Elon Musk - Modi: త్వరలో భారత్కు టెస్లా.. మోదీతో భేటీ అనంతరం ఎలాన్ మస్క్
Elon Musk - Modi: అమెరికా పర్యటనలో ఉన్న మోదీతో మస్క్ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. భారత్లో టెస్లా ప్రవేశంపై స్పందించారు.
వాషింగ్టన్: భారత్లో టెస్లా (Tesla) కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయని కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ అంశంపై ప్రకటన ఉండే అవకాశం ఉందని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (Modi)తో ఆయన బుధవారం భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. మోదీతో భేటీ అద్భుతంగా జరిగిందని సమావేశం అనంతరం మస్క్ (Elon Musk) తెలిపారు.
స్థానిక చట్టాలను ట్విటర్ పాటించాల్సిందే..
స్థానిక ప్రభుత్వాల నియమ, నిబంధనల్ని పాటించడం తప్ప మరోమార్గం లేదని ట్విటర్ (Twitter) విషయంలో మస్క్ (Elon Musk) స్పందించారు. లేదంటే కార్యకలాపాలు మూసివేయాల్సి వస్తుందని తెలిపారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనల సమయంలో ట్విటర్పై భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందంటూ ఇటీవల ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయా దేశాల చట్టాలను పాటించాల్సిందేనని మస్క్ ఉద్ఘాటించారు. నిబంధనలకు లోబడే వీలైనంతలో వాక్ స్వేచ్ఛను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
వచ్చే ఏడాది భారత్కు..
వచ్చే ఏడాది భారత్లో పర్యటించే యోచనలో ఉన్నట్లు మస్క్ (Elon Musk) తెలిపారు. సాధ్యమైనంత త్వరలో భారత్లో టెస్లా ప్రవేశం ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీ (Modi) నుంచి మంచి సహకారం లభిస్తోందని వెల్లడించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే దీనిపై ఓ సానుకూల ప్రకటన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఒక్క ప్రకటనలో తాము దీన్ని తేల్చేయాలనుకోవడం లేదని.. భారత్తో సంబంధాల విషయంలో తమ నిర్ణయం కీలకంగా మారనుందని పేర్కొన్నారు.
మోదీకి అభిమానిని..
ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే భారత్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని మస్క్ అభిప్రాయపడ్డారు. భారత భవిష్యత్పై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మస్క్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్పై మోదీ (Modi)కి చాలా శ్రద్ధ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో పెట్టుబడుల పెట్టాలని ఆయన ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తాను మోదీకి అభిమానని చెప్పారు. సౌర ఇంధనంలో పెట్టుబడులకూ అక్కడ గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు.
మస్క్ (Elon Musk)తో భేటీ గొప్పగా జరిగినట్లు మోదీ (Modi) ట్వీట్ చేశారు. ఇంధనం నుంచి ఆధ్యాత్మికత వరకు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ‘‘మీతో మళ్లీ సమావేశం కావడం గౌరవంగా భావిస్తున్నా’’ అని అన్నారు.
మోదీ అమెరికా పర్యటన ఈ నెల 24 వరకు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం బయల్దేరిన ఆయన అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం న్యూయార్క్కు చేరుకున్నారు. ఆయనకు అమెరికాలో మన దేశ రాయబారి తరణ్జీత్ సింగ్ సంధు, ఐరాసలో శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు విమానాశ్రయానికి వచ్చి మోదీని స్వాగతించారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
Elon Musk: టెస్లా షేర్ల ర్యాలీతో బిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఆయన షేర్ల విలువ 18.5 బిలియన్ డాలర్లు ఎగసింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668
Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 దగ్గర కొనసాగుతోంది. -
పతంజలి దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు
Patanjali: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పది ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేసింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై