IPO: ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటే
IPO: స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి
స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రారంభ లాభాలను అందించి, పెట్టుబడిదారులకు కొత్త ఉత్సాహాన్నీ ఇచ్చాయి. దీంతో చాలామంది ఐపీఓలకు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ, ఇందులో కొందరికే షేర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఓ (IPO)లో షేర్లు రావాలంటే అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
IPO: ఐపీఓలో షేర్ల కేటాయింపు పూర్తిగా యాంత్రికంగానే జరుగుతుందనేది గమనించాల్సిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ మానవ ప్రమేయం ఇందులో ఉండే అవకాశం లేదు. ఐపీఓ (IPO) దరఖాస్తులు అధికంగా వచ్చినప్పుడు, దరఖాస్తు చేసిన వారందిరకీ కనీసం ఒక లాట్ కేటాయించేలా ప్రాధాన్యత ఇస్తుంటారు.
బహుళ డీమ్యాట్ ఖాతాలు: పెట్టుబడిదారులు తమకున్న అన్ని డీమ్యాట్ ఖాతాల నుంచీ ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటారు. దీనివల్ల చాలా సందర్భాల్లో షేర్లు కేటాయింపు ఉండకపోవచ్చు. దీనికి బదులుగా కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్న డీమ్యాట్ ఖాతాలన్నింటి నుంచీ ఐపీఓకి దరఖాస్తు చేయడం ఉత్తమం. ఏదో ఒక ఖాతాకు షేర్ల కేటాయింపు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గరిష్ఠ ధర: రిటైల్ మదుపరులు గరిష్ఠ కట్-ఆఫ్ వద్ద బిడ్ వేయాలి. కొంతమంది షేర్లను ఏ ధరకు కొనాలనుకుంటున్నారనే విషయాన్ని పేర్కొంటారు. గరిష్ఠ ధరకు కేటాయింపులు జరిగినప్పుడు.. వారికి షేర్లు జారీ అయ్యే వీలుండదు. కాబట్టి, ఎప్పుడూ కట్-ఆఫ్ ధర వద్దే దరఖాస్తు చేయాలి.
షేర్-హోల్డర్ విభాగంలో: తమ అవకాశాలను మెరుగుపర్చుకునేందుకు పెట్టుబడిదారులు వాటాదారుల కోటానూ చూడాలి. దీనికోసం మాతృ సంస్థ వాటాలను ముందుగా కొనాలి. అప్పుడు షేర్-హోల్డర్స్ విభాగంలో దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది. ఇక్కడ పోటీ తక్కువగా ఉండే వీలుంది. కాబట్టి, షేర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
చివరి నిమిషం వరకూ: ఐపీఓ చివరి తేదీ వరకూ చాలామంది దరఖాస్తు చేయరు. దీనివల్లా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. బ్రోకర్లు చివరి రోజు నిర్ణీత వ్యవధికన్నా ముందే దరఖాస్తులను ఆమోదించడం నిలిపి వేయొచ్చు. ఒక సంస్థ ఐపీఓకి దరఖాస్తు చేయాలని అనుకున్నప్పుడు.. మొదటి రోజునే ఆ పని పూర్తి చేయాలి. వేచి చూడటం వల్ల ప్రయోజనమేమీ ఉండదు.
బహుళ విభాగాల్లో: వ్యక్తులు హెచ్ఎన్ఐ, రిటైల్ విభాగంలో దరఖాస్తు చేయలేరు. ఎందుకంటే.. ప్రతి దరఖాస్తుకూ ప్రత్యేక పాన్ అవసరం అవుతుంది. ఇలా దరఖాస్తు చేసినా, తిరస్కరించేందుకు ఆస్కారం ఉంటుంది. రిటైల్ మదుపరి ఐపీఓలో రూ.2లక్షలకు మించి విలువైన షేర్ల కోసం దరఖాస్తు చేసినప్పుడు ఎన్ఐఐ కోటాలో హెచ్ఎన్ఐగా పరిగణిస్తారు. ఈ విభాగంలో ఉన్న వారి పెట్టుబడి మిగులు, నికర విలువ రూ.2 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఐపీఓలో ఎన్ఐఐ విభాగానికి 15 శాతం కేటాయిస్తారు. కాబట్టి, చిన్న మదుపరులకు ఇది ప్రతికూలమైన అంశం.
యూపీఐ ద్వారా చెల్లింపు: యూపీఐతో ఐపీఓకి దరఖాస్తు లావాదేవీ పరిమితిని రూ.5లక్షలకు పెంచారు. యూపీఐ ద్వారా ఒక దరఖాస్తును మాత్రమే అనుమతిస్తారు. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బీఎల్, యాక్సిస్ బ్యాంకులు ప్రస్తుతం 5 దరఖాస్తుల వరకూ అనుమతిస్తున్నాయి.
మదుపరులు ఎప్పటికప్పుడు మారుతున్న ఐపీఓ నిబంధనలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఐపీఓకి దరఖాస్తు చేసుకునేటప్పుడూ సంబంధిత సంస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. కొన్ని పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి వాటిని జాగ్రత్తగా గమనించాలి. కేవలం అందరూ మదుపు చేస్తున్నారు కాబట్టి, మనమూ దరఖాస్తు చేయాలనే ఆలోచన సరికాదు.
- మహావీర్ లునావత్, మేనేజింగ్ డైరెక్టర్, పాంటోమ్యాథ్ క్యాపిటల్ అడ్వైజర్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఆధార్ కార్డ్లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి.. -
పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో
చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం. -
టెక్నాలజీ కంపెనీల్లో
బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
ఆధార్ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్ విత్డ్రా ఎలా చేసుకోవాలి?
Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.. -
వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు
IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి. -
టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసానిచ్చేలా
బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్ పాలసీలు. వీటిని ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. -
కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ
IRCTC tour package: వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న కేరళ టూర్ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి.. -
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి.. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
డిజీ లాకర్తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM