Forbes: ఫోర్బ్స్ మహిళా ధనవంతుల జాబితాలో భారత సంతతి మహిళలు
ఫోర్బ్స్(Forbes) తాజాగా విడుదల చేసిన అమెరికా తొలి వంద మంది సంపన్నుల జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలు చోటు సంపాదించుకున్నారు. ఇక ఈ జాబితాలో తొలి స్థానంలో డైనీ హెండ్రిక్స్ ఉన్నారు.
న్యూయార్క్: అమెరికాలో తొలి వంద మంది మహిళా సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలు చోటు దక్కించుకున్నారు. వ్యక్తిగత ఆస్తుల విలువతోపాటు, కంపెనీల్లో వారికున్న వాటాల విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో పెప్సికో మాజీ ఛైర్మన్, సీఈవో ఇంద్రా నూయీ(Indra Nooyi), ఆరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్(Jayshree Ullal), సింటెల్ ఐటీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ (Neerja Sethi), కాన్ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే(Neha Narkhede) ఉన్నారు.
జయశ్రీ ఉల్లాల్: 2.4 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో 15వ స్థానంలో ఉన్నారు. జయశ్రీ 2008 నుంచి ఆరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో ఆమెకు 2.4 శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. అరిస్టా 2022లో 4.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
నీర్జా సేథీ: సింటెల్ సహ వ్యవస్థాపకురాలిగా 990 మిలియన్ డాలర్ల సంపదతో నీర్జా జాబితాలో 25వ స్థానంలో కొనసాగుతున్నారు. 1980లో భర్త భరత్ దేశాయ్తో కలిసి నీర్జా సింటెల్ను స్థాపించారు. కంపెనీ నుంచి తన వాటా కింద ఆమె 510 మిలియన్ డాలర్లు పొందినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
నేహా నార్ఖడే: నేహా 520 మిలియన్ డాలర్ల సంపదతో 50వ స్థానంలో ఉన్నారు. నేహా గతంలో లింక్డ్ఇన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. లింక్డ్ఇన్లో కీలకమైన ఓపెన్ సోర్స్ మెసేజింగ్ సిస్టమ్ అపాచీ కఫ్కా (Apache Kafka)ను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2014లో లింక్డ్ఇన్ను వీడి, ఇద్దరు సహోద్యోగులతో కలిసి కాన్ఫ్లూయెంట్ను స్థాపించారు. సంస్థలో నేహాకు ఆరు శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది.
ఇంద్రా నూయీ: 350 మిలియన్ డాలర్ల సంపదతో 77వ స్థానంలో ఉన్నారు. 2019లో ఆమె పెప్సికో నుంచి పదవీ విరమణ చేశారు. 24 ఏళ్ల పాటు సంస్థలో అత్యున్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఇంద్రా నూయీ.. పెప్సికో ఆదాయాన్ని పెంచారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులను పరిచయం చేయడంతోపాటు, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రవేశపెట్టినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2019లో పెప్సికో నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి అమెజాన్లో బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో ఏబీసీ సప్లై సహా వ్యవస్థాపకురాలు డైనీ హెండ్రిక్స్(Daine Hendricks) చోటు సంపాదించుకున్నారు. ఆమె ఈ ఘనత సాధించడం వరుసగా ఆరోసారి. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ 15 బిలియన్ డాలర్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
ఓలా క్యాబ్స్ సీఈఓ పదవికి హేమంత్ భక్షి రాజీనామా చేశారు. సీఈఓ పదవి చేపట్టిన 4 నెలలకే బాధ్యతల నుంచి వైదొలిగారు. -
సౌత్ ఇండియన్ బ్యాంకుతో జట్టు కట్టిన టాటా మోటార్స్
వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్.. సౌత్ ఇండియన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. -
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
దేశంలో డిజిటల్ లావాదేవీలతో పాటు నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది. సీఎంఎస్ సంస్థ వెలువరించిన తాజా నివేదిక ఈ పరిస్థితిని తెలియజేస్తోంది. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!