జేఎస్ డబ్ల్యూఎనర్జీ చేతికి మైత్రా విద్యుత్తు ప్రాజెక్టులు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైత్రా ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1,753 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను జేఎస్డబ్ల్యూ గ్రూపు కొనుగోలు చేయనుంది. ఇందులో 1,331 మెగావాట్ల సామర్థ్యం గల 10 పవన విద్యుత్తు ప్రాజెక్టులు, 422 మెగావాట్ల సామర్థ్యం గల
లావాదేవీ విలువ రూ.10,530 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైత్రా ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1,753 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను జేఎస్డబ్ల్యూ గ్రూపు కొనుగోలు చేయనుంది. ఇందులో 1,331 మెగావాట్ల సామర్థ్యం గల 10 పవన విద్యుత్తు ప్రాజెక్టులు, 422 మెగావాట్ల సామర్థ్యం గల 7 సౌర విద్యుత్తు ప్రాజెక్టులు, మరొక అనుబంధ ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) సంస్థ ఉన్నాయి. దేశంలోని దక్షిణ, మధ్య, పశ్చిమ భారతదేశంలో ఈ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులను రూ.10,530 కోట్ల సంస్థాగత విలువకు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేస్తోంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఈ మేరకు మైత్రా ఎనర్జీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.
18 అనుబంధ కంపెనీలూ..: మైత్రా ఎనర్జీకి చెందిన 18 అనుబంధ కంపెనీల కింద ఈ ఇంధన ప్రాజెక్టులున్నాయి. చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాక, ఈ 18 అనుబంధ కంపెనీలూ మైత్రా నుంచి జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ కిందకు వస్తాయి. ముఖ్యంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2021-22లో ఈ అనుబంధ కంపెనీలు రూ.1,467 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి.
2025కు 10 గిగావాట్ల లక్ష్యం: జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 10 గిగావాట్లు, 2030 కల్లా 20 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. మైత్రా ఎనర్జీ నుంచి కొనుగోలు చేస్తున్న ప్రాజెక్టులతో, 2025కు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి వీలు కలుగుతుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి 4,784 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉండగా, ఈ లావాదేవీతో కలిపి మొత్తం 6,537 మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించినట్లు అవుతుంది. దీనికి తోడు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సొంతంగా నిర్మిస్తున్న 2,500 మెగావాట్ల ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తవుతాయని అంచనా. వాటితో కలిపి ఈ సంస్థ 9 గిగావాట్ల సామర్థ్యాన్ని అధిగమించినట్లు అవుతుంది. ఇందులో పునరుత్పాదక ఇంధన విద్యుత్తు ప్రాజెక్టుల వాటాయే 65% ఉండటం ప్రత్యేకత.
గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులూ చేపడతాం : తమ విద్యుత్తు ప్రాజెక్టుల సంఖ్యను, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోడానికి తమకు అవకాశం లభించినట్లు, మైత్రా ఎనర్జీ ప్రాజెక్టులను కొనుగోలు చేయడం వల్ల తమ వాటాదార్లకూ మేలు జరుగుతుందని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ జాయింట్ ఎండీ ప్రశాంత్ జైన్ అన్నారు. దేశవ్యాప్తంగా తమకు విద్యుత్తు యూనిట్లు ఉన్నట్లు అవుతుందని పేర్కొన్నారు. మరికొన్ని అవకాశాలు సమీప భవిష్యత్తులో లభిస్తే, వాటిని కూడా అందిపుచ్చుకుంటామని స్పష్టం చేశారు. దీంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ విభాగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. -
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత