రిలయన్స్ గూటికి లోటస్ చాక్లెట్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోటస్ చాక్లెట్ల్లో మెజారిటీ వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఎఫ్ఎమ్సీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్(ఆర్సీపీఎల్) కొనుగోలు చేయనుంది.
దిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోటస్ చాక్లెట్ల్లో మెజారిటీ వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఎఫ్ఎమ్సీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్(ఆర్సీపీఎల్) కొనుగోలు చేయనుంది. చాక్లెట్లు, కొకోవా ఉత్పత్తులు, కొకోవా అనుబంధ ఉత్పత్తులను తయారు చేసే లోటస్ చాక్లెట్లో ప్రమోటర్లు, ప్రమోటర్ల బృందం నుంచి 51% వాటాకు సమానమైన 65.48 లక్షల షేర్లను కొనుగోలు చేస్తుంది. ఒక్కో షేరుకు రూ.113 సగటు ధరతో, రూ.74 కోట్లు ఇందుకు వెచ్చిస్తుంది. తదుపరి 26 శాతం వాటా (33,38,673 షేర్ల)కు ఓపెన్ ఆఫర్ను ఆర్సీపీఎల్ ప్రకటిస్తుంది. ‘దేశీయంగా అభివృద్ధి చేసిన రోజువారీ అత్యున్నత నాణ్యతా ఉత్పత్తులకు ఊతమివ్వాలన్న మా ఉద్దేశాన్ని లోటస్లో ఈ పెట్టుబడులు సూచిస్తున్నాయ’ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశా అంబానీ పేర్కొన్నారు.
* లోటస్ చాక్లెట్ సంస్థను 1988లో సినీనటి శారద, విజయ రాఘవన్ నంబియార్ కలిసి ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లా దౌలతాబాద్లో ఈ యూనిట్ ఉంది. ప్రస్తుతం సింగపూర్ కేంద్రంగా పనిచేసే సన్షైన్ అలైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుబంధ సంస్థగా ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rent a girl friend: అద్దెకు గర్ల్ఫ్రెండ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్...
-
India News
దేవుడా.. ఈ బిడ్డను సురక్షితంగా ఉంచు: భూప్రకంపనల మధ్యే సి-సెక్షన్ చేసిన వైద్యులు..!
-
Politics News
AP News: ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
-
Sports News
IND vs AUS: భారత్, ఆసీస్ మూడో వన్డే.. ఆలౌటైన ఆస్ట్రేలియా
-
India News
Modi: JAM-జన్ధన్, ఆధార్, మొబైల్.. ప్రపంచానికే ఓ కేస్స్టడీ
-
Crime News
Vijayawada: విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48కోట్ల విలువైన బంగారం పట్టివేత