పీఎన్‌బీ లాభం మూడింతలు

ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), మార్చి త్రైమాసికంలో  రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ.

Published : 10 May 2024 02:37 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), మార్చి త్రైమాసికంలో  రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. కీలక ఆదాయం మెరుగుపడటం, మొండి బకాయిలు తగ్గడం కలిసొచ్చింది. మొత్తం ఆదాయం రూ.27,269 కోట్ల నుంచి రూ.32,361 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయమే రూ.23,849 కోట్ల నుంచి రూ.28,113 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.9,499 కోట్ల నుంచి 9.1% పెరిగి రూ.10,363 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 8.74% నుంచి 5.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 2.72% నుంచి 0.73 శాతానికి పరిమితమయ్యాయి. ఫలితంగా మొండి బకాయిలపై కేటాయింపులు రూ.3,625 కోట్ల నుంచి రూ.1,958 కోట్లకు దిగి వచ్చాయి.

పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో బ్యాంక్‌ లాభం రూ.8,245 కోట్లుగా ఉంది. 2022-23 లాభం రూ.2,507 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. మొత్తం ఆదాయం రూ.97,287 కోట్ల నుంచి రూ.1,20,285 కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని