Phonepe: యూపీఐ లైట్‌.. చెల్లింపులు అంత లోపుంటే పిన్‌ అక్కర్లేదు..

డిజిటల్‌ చెల్లింపులు రూ.200 లోపు ఉన్నప్పుడు పిన్‌ నమోదు చెయ్యాల్సిన అవసరం లేకుండా యూపీఐ లైట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఫోన్‌పే వెల్లడించింది.

Updated : 04 May 2023 07:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ చెల్లింపులు రూ.200 లోపు ఉన్నప్పుడు పిన్‌ నమోదు చెయ్యాల్సిన అవసరం లేకుండా యూపీఐ లైట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఫోన్‌పే వెల్లడించింది. దీనికోసం ముందుగానే యూపీఐ లైట్‌లో రూ.2,000 వరకు జమ చేసుకోవచ్చు. ఫలితంగా బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా చెల్లింపులు పూర్తవుతాయి. యూపీఐ లైట్‌ కూడా ప్రస్తుత ఫోన్‌పే యాప్‌లోనే అందుబాటులో ఉంటుందని.. ప్రత్యేకంగా కేవైసీ అవసరం లేదని తెలిపింది. బ్యాంకు ఖాతా వివరాల్లో చిన్న చిన్న లావాదేవీలు నమోదు కాకుండా ఉండేందుకు ఇది ఉపకరిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని