ఫెడ్ తెచ్చిన లాభోత్సాహం
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు వచ్చే ఏడాది రేట్ల కోతలకు సంకేతాలివ్వడంతో గురువారం మన సూచీలు దుమ్మురేపాయి. ఐటీ, టెక్, స్థిరాస్తి షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటంతో సెన్సెక్స్, నిఫ్టీ తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి.
సెన్సెక్స్ 930, నిఫ్టీ 256 పాయింట్లు దూసుకెళ్లాయ్
రూ.355 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు వచ్చే ఏడాది రేట్ల కోతలకు సంకేతాలివ్వడంతో గురువారం మన సూచీలు దుమ్మురేపాయి. ఐటీ, టెక్, స్థిరాస్తి షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటంతో సెన్సెక్స్, నిఫ్టీ తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులకు తోడు, ముడిచమురు ధరలు తగ్గడమూ మదుపర్ల సెంటిమెంట్ను బలపడేలా చేసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 10 పైసలు కోలుకుని 83.30 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 75.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- సూచీల పరుగు నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గురువారం రూ.3.83 లక్షల కోట్లు పెరిగి, రికార్డు గరిష్ఠమైన రూ.355.02 లక్షల కోట్లకు చేరింది.
- సెన్సెక్స్ ఉదయం 70,146.09 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఒకదశలో 1,018.29 పాయింట్లు లాభపడి 70,602.89 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 929.60 పాయింట్ల లాభంతో 70,514.20 వద్ద ముగిసింది. నిఫ్టీ 256.35 పాయింట్లు పెరిగి 21,182.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,210.90 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. సెన్సెక్స్ 70,000 పాయింట్ల పైన, నిఫ్టీ 21,000 పాయింట్లపైన ముగియడం ఇదే తొలిసారి.
- సెన్సెక్స్ 30 షేర్లలో 22 పరుగులు తీశాయి. టెక్ మహీంద్రా 3.91%, ఇన్ఫోసిస్ 3.61%, విప్రో 3.52%, హెచ్సీఎల్ టెక్ 3.27%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.97%, బజాజ్ ఫైనాన్స్ 2.88% రాణించాయి. పవర్గ్రిడ్, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటన్, మారుతీ, సన్ఫార్మా 2% వరకు నష్టపోయాయి.
- బీమా సంస్థల షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఎల్ఐసీ షేరు 1.32% లాభంతో రూ.815.30 వద్ద ముగిసింది. ఎస్బీఐ లైఫ్ 0.16% పెరిగింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ 3.1%, నిప్పన్ లైఫ్ ఏఎంసీ 3.6%, హెచ్డీఎఫ్సీ లైఫ్ 1.90%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ 1.72% నష్టపోయాయి.
- ప్రైవేట్ రుణదాతల నుంచి 1.25 బిలియన్ డాలర్ల రుణాలను పొందినట్లు వేదాంతా మాతృసంస్థ వేదాంతా రిసోర్సెస్ వెల్లడించింది. 2024, 2025లలో గడువు తీరనున్న 3.2 బి.డాలర్ల రుణాల రీఫైనాన్స్ కోసం వీటిని వినియోగించనుంది.
- గుజరాత్లోని ఇంధన, పోర్ట్ ప్రాజెక్టుల్లో రూ.55,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్సార్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. బిహార్లో మరో రూ.8700 కోట్లు పెట్టుబడి పెడతామని అదానీ గ్రూప్ తెలిపింది.
ఐపీఓ సమాచారం..
- డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ రెండో రోజు ముగిసేసరికి 15.16 రెట్ల స్పందన వచ్చింది. ఇష్యూలో భాగంగా 88,37,407 షేర్లను ఆఫర్ చేయగా, 13,39,90,938 షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ విభాగంలో 41.07 రెట్ల స్పందన దక్కింది.
- ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ రెండో రోజుకు 4.34 రెట్ల స్పందన నమోదైంది. ఇష్యూలో భాగంగా 1,79,10,449 షేర్లు జారీ చేయనుండగా, 7,76,42,790 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
- ఐనాక్స్ సీవీఏ ఐపీఓ మొదటి రోజు 2.78 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,54,77,670 షేర్లను ఆఫర్ చేయగా, 4,30,88,606 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
- డెనిమ్ బ్రాండ్ మఫ్తీ జీన్స్ తయారీ సంస్థ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఐపీఓ ఈనెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.266- 280 ను నిర్ణయించారు. రిటైల్ మదుపర్లు కనీసం 53 షేర్లకు బిడ్లు దాఖలు చేసుకోవాలి.
- హ్యాపీ ఫోర్జింగ్స్ ఐపీఓ 19న ప్రారంభమై 21న ముగియనుంది. ధరల శ్రేణి రూ.808- 850.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
ఏఐని సమర్థంగా అర్థం చేసుకోగల వారిదే భవిష్యత్ అని ఇన్ఫోసిస్ సీటీఓ రఫీ అన్నారు. ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ టూల్స్ నేర్చుకోవడం ముఖ్యమని చెప్పారు. -
రాజస్థాన్లో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న JSW సిమెంట్
రాజస్థాన్లో కొత్త సిమెంట్ తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు JSW సిమెంట్ రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. -
నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు : జొమాటో సీఈఓ
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తాను స్టార్టప్ ప్రారంభించాలనుకున్న తొలి రోజుల గురించి గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడింది. -
రీకాల్, కోక్రియేట్ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పీసీలు
Microsoft Copilot+ PCs: ఏఐ ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పేరిట కొత్త పీసీలను విడుదల చేసింది. వీటిలో రీకాల్, కోక్రియేట్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. -
చైనాలో ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్స్.. ఏడాదిలో రెండోసారి.. ఎందుకంటే?
చైనాలో ఐఫోన్లపై యాపిల్ సంస్థ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఏడాదిలో ఇలా డిస్కౌంట్ ఇవ్వడం ఇది రెండోసారి. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,455
Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు కుంగి 22,455 దగ్గర కొనసాగుతోంది. -
పారిశ్రామిక ప్రముఖులు ఓటేశారు
లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్లో, సోమవారం ముంబయిలో పారిశ్రామిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
విద్యుత్తు విధాన మార్గదర్శకాలు త్వరలో
మనదేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈవీ నూతన విధాన మార్గదర్శకాలను ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. -
సానుకూలతలున్నా.. అప్రమత్తతే!
ఎన్నికల అనంతరం అధికారం చేపట్టే పార్టీ విషయమై అనిశ్చితి వల్ల అప్రమత్తతతో ఉన్నా, నిఫ్టీ-50 ఈ వారం సానుకూలతలను కనబరచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
74,360 ఎగువన లాభాలు కొనసాగొచ్చు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. డీఐఐల కొనుగోళ్లు, స్థిరమైన చమురు ధరలు ఇందుకు దోహదపడ్డాయి. -
ఇండియా సిమెంట్స్కు తగ్గిన నష్టం
ఇండియా సిమెంట్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.50.06 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. -
ఆయిల్ ఇండియా 2 షేర్లకు ఒకటి బోనస్
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.2,332.94 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. -
దిల్లీలో ఉబర్ బస్సు సేవలు
‘దిల్లీ ప్రీమియం బస్ స్కీమ్’ కింద దేశ రాజధానిలో బస్సులు తిప్పేందుకు దిల్లీ రవాణా విభాగం నుంచి అగ్రిగేటర్ లైసెన్స్ పొందినట్లు ఉబర్ వెల్లడించింది. -
ఎస్బీఐ ఛైర్మన్ పదవికి నేడు ఇంటర్వ్యూలు
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ పదవికి అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూలను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) మంగళవారం నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్లో ఐఎస్బీకి దేశంలో ప్రథమ స్థానం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్- 2024 లో మనదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. -
విస్తరణ దిశగా నెక్స్ట్వేవ్
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే హైదరాబాదీ ఎడ్యుటెక్ అంకురం నెక్ట్స్వేవ్ విస్తరణ బాట పట్టింది. -
మార్చిలో 14.41 లక్షల మంది చేరిక: ఈపీఎఫ్ఓ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో ఈ ఏడాది మార్చిలో నికరంగా 14.41 లక్షల మంది సభ్యులు చేరారు. -
సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై కేంద్రం మార్గదర్శకాలు
మనదేశం నుంచి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాలు ఎథిలీన్ ఆక్సైడ్ (ఈటీఓ)తో కలుషితం కాకుండా ఉండేలా చూడడం కోసం కేంద్రం సవివర మార్గదర్శకాలను జారీ చేసింది. -
సంక్షిప్త వార్తలు
పవర్ మెక్ ప్రాజెక్ట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,311.86 కోట్ల ఆదాయంపై రూ.84.41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
తాజా వార్తలు (Latest News)
-
బాలుడి ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరి మృతి
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
-
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్