రూ.లక్ష పెట్టుబడి.. రూ.1.58 కోట్లుగా...
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు విభిన్నమైనవి. ఇవి పూర్తిగా ఈక్విటీ ఫండ్లూ కావు. అలాగని డెట్ ఫండ్లుగానూ చెప్పలేం. ఈ రెండింటి మిశ్రమమే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు.
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు విభిన్నమైనవి. ఇవి పూర్తిగా ఈక్విటీ ఫండ్లూ కావు. అలాగని డెట్ ఫండ్లుగానూ చెప్పలేం. ఈ రెండింటి మిశ్రమమే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు. ఈక్విటీలతోపాటు, రుణ పత్రాల్లో ‘డైనమిక్ అలకేషన్’ పద్ధతిలో పెట్టుబడి పెడతాయి. తక్కువ నష్టభయంతో స్థిరమైన లాభాలు ఆర్జించడం లక్ష్యంగా ఈ తరహా పథకాలను మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పలు సంస్థలు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లను ఆవిష్కరించిన విషయం విదితమే. కానీ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ప్రత్యేకతలే వేరు. ఈ ఫండ్ తాజాగా తన 30 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. అంతేకాదు, సగటున ఏటా 18 శాతం లాభాలను ఆర్జించింది. ఈ పథకం ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్)లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, దాని విలువ 158 రెట్లు పెరిగి, ఇప్పుడు రూ.1.58 కోట్లు అయింది.
హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ 1994 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. మనదేశంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న కొన్ని పథకాల్లో ఇదీ ఒకటి. 2023 డిసెంబరు 31వ తేదీ నాటికి ఈ పథకం నిర్వహణలో రూ.73,000 కోట్లు (ఏయూఎం) ఉండటం గమనార్హం. పైగా ఇది ‘యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్’ తరగతి కిందకు వచ్చే పథకం. అంటే ఫండ్ మేనేజర్ల నైపుణ్యం, క్రియాశీలత, సమర్థత ఆధారంగా లాభాలు ఉంటాయి.
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఛీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సిఐఓ)గా వ్యవహరించిన ప్రశాంత్ జైన్ ఎన్నో ఏళ్ల పాటు దీనికి ఫండ్ మేనేజర్గా వ్యవహరించారు. 2022 జులైలో ఆయన సిఐఓ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి ఈ పథకం బాధ్యతలను గోపాల్ అగర్వాల్, అనిల్ బంబోలి, అరుణ్ అగర్వాల్... తదితరులు నిర్వహిస్తున్నారు.
మూడేళ్లుగా...
మూడేళ్లుగా ఈ పథకంపై ఆకర్షణీయమైన లాభాలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ ప్లాన్- గ్రోత్ ఆప్షన్ కింద స్కీము బెంచ్మార్క్ రిటర్న్స్ 11.02 శాతం కాగా, ఈ పథకం మాత్రం 25.42 శాతం లాభాలు నమోదు చేసింది. గత ఏడాది కాలంలో బెంచ్మార్క్ రిటర్న్స్ 14.26 శాతం అయితే, ఈ ఫండ్ 31.30 శాతం లాభాలు ఆర్జించింది. క్రమానుగత పెట్టుబడి విధానంలో (సిప్) మదుపు చేసిన వారికి గత మూడేళ్ల కాలంలో ఏటా 17.49 శాతం, గత ఏడాది కాలంలో 33.54 శాతం ప్రతిఫలం లభించింది.
హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఈక్విటీ పోర్ట్ఫోలియో టాప్- 5 హోల్డింగ్స్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. పెట్టుబడుల పోర్ట్ఫోలియో రూపకల్పన, నిర్వహణలో ఈ పథకం ‘డైనమిక్ ఇన్వెస్ట్మెంట్’ వ్యూహాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ స్థితిగతుల ప్రకారం ఈక్విటీ, రుణ పత్రాలకు కేటాయింపులు మార్చుకోవటం ఈ వ్యూహంలోని ప్రధాన లక్షణం. ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి మార్కెట్ విలువ, నిఫ్టీ 50 ట్రెయిలింగ్ పీఈ, ఎర్నింగ్స్ ఈల్డ్/ జీ-సెక్ ఈల్డ్ నిష్పత్తి, మరికొన్ని ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రుణ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవటానికి టెన్యూర్, డ్యూరేషన్ సర్దుబాటు తర్వాత వడ్డీ రేటు అంచనాలు, క్రెడిట్ రిస్క్, లిక్విడిటీ... తదితర అంశాలను పరిశీలిస్తారు. హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, అనుసరిస్తున్న పెట్టుబడుల విధానం కాలపరీక్షకు నిలిచిందని హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఎండీ నవ్నీత్ మునోత్ పేర్కొన్నారు. తమ మదుపరులకు ఇదే విధంగా భవిష్యత్తులోనూ లాభాలు తెచ్చిపెట్టే లక్ష్యంతో ముందుకు సాగుతాం- అని ఆయన ఆన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట