Common charger: ‘కామన్ ఛార్జర్’పై నిపుణుల కమిటీ.. రెండు నెలల డెడ్లైన్
Common charger: మొబైళ్లు, ఇతర పోర్టబుల్ పరికరాలన్నింటికీ ఒకటే తరహా ఛార్జర్ (Common charger) తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది.
దిల్లీ: మొబైళ్లు, ఇతర పోర్టబుల్ పరికరాలన్నింటికీ ఒకటే తరహా ఛార్జర్ (Common charger) తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో ఉన్న సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయనుంది. రెండు నెలల్లోగా ఈ కమిటీలు నివేదిక సమర్పించాల్సి ఉంటుందని వినియోగదారు వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ తెలిపారు. కామన్ ఛార్జర్ అంశంపై బుధవారం నిర్వహించిన కీలక సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కామన్ ఛార్జర్ అంశం సంక్లిష్టమైనదిగా రోహిత్ కుమార్ పేర్కొన్నారు. తొలి దశలో టైప్-సి సహా రెండు రకాల ఛార్జర్లకు మారడంపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. కామన్ ఛార్జర్ విషయంలో తుది నిర్ణయం తీసుకునేముందు అటు పరిశ్రమ వర్గాలు, వినియోగదారులు, తయారీదారులు, పర్యావరణం ఇలా అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందుకే నిపుణులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మొబైల్, ఫీచర్ ఫోన్లు; ల్యాప్టాప్లు, ఐప్యాడ్స్; వేరేబుల్ ఎలక్ట్రానిక్ డివైజులు.. ఇలా మూడు సెగ్మెంట్లకు వేర్వేరు గ్రూప్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీలు తమ సిఫార్సులను రెండు నెలల్లోగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమ వర్గాల ప్రతినిధులు, ఫిక్కీ, సీఐఐ, అసోచామ్ సంఘాల ప్రతినిధులు, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బీహెచ్యూ నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎందుకీ కామన్ ఛార్జర్..?
గ్యాడ్జెట్లు కొత్త రూపు సంతరించుకుంటున్నా.. వాటికి ఉపయోగించే ఛార్జర్ల సమస్య మాత్రం ఇప్పటికీ పోలేదు. ఒక కంపెనీ టైప్-సి పోర్ట్ ఇస్తే.. మరో కంపెనీ యూఎస్బీ పోర్ట్ అంటుంది. ఇంకోటి లైట్నింగ్ పోర్ట్ తీసుకొస్తుంది. ఒకరు బాక్సులో ఛార్జర్ అందిస్తే.. మరొకరు సపరేట్గా కొనాలంటారు. దీనివల్ల వినియోగదారుడి చేతి చమురు వదలడమే కాకుండా పెద్ద ఎత్తున ఈ-వేస్టేజ్ పేరుకుపోతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కామన్ ఛార్జర్ విధానం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్ ఇలా.. గ్యాడ్జెట్ ఏదైనా ఒకటే ఛార్జర్ ఉండాలంటోంది. ఛార్జర్ల సమస్యకు చెక్ పెడుతూ ఇటీవల యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల కోసం కంపెనీలన్నీ విధిగా టైప్-సి పోర్ట్ కలిగిన ఛార్జింగ్ ప్రమాణాలను పాటించాలని సూచించింది. 2024ను దీనికి గడువుగా నిర్దేశించింది. అమెరికాలో సైతం ఇలాంటి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సైతం దీనిపై దృష్టి సారించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
గూగుల్ సీఈఓ సుందర్పిచాయ్ గ్రాడ్యుయేషన్ నాటి ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
అదానీ గ్రీన్, శ్రీలంక ప్రభుత్వం మధ్య విద్యుత్ ఒప్పందం
శ్రీలంకలో పవన విద్యుత్ కేంద్రాల స్థాపన కోసం భారత్కు చెందిన అదానీ గ్రీన్, శ్రీలంక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. -
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో కొత్తగా నాలుగు ఫీచర్లను యాడ్ చేసింది. అవేంటో చూసేయండి. -
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
Samsung Power Banks: 10,000mAh, 20,000mAh సామర్థ్యంతో భారత్లో శామ్సంగ్ రెండు కొత్త పవర్బ్యాంకులను విడుదల చేసింది. -
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
పేటీఎం యూపీఐ లావాదేవీల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. వరుసగా మూడో నెలా క్షీణత నమోదైంది. మరోవైపు ఫోన్పే, గూగుల్ పే హవా కొనసాగుతోంది. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
Trading hours: స్టాక్ బ్రోకర్ కమ్యూనిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ సమయం పొడిగించే అంశాన్ని సెబీ తిరస్కరించింది. -
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
Tesla: టెక్ కంపెనీల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు కష్టపడి పనిచేసిన తమను తొలగించడంపై పలువురు సామాజిక మాధ్యమ వేదికల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 67 పాయింట్ల లాభంతో 73,963 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,484 దగ్గర కొనసాగుతోంది. -
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు. -
జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. -
ఫరూఖ్నగర్లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. -
ఆఫ్లైన్లోనూ ఇ-రుపీ
ఇ-రుపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి