PM Kisan: వచ్చే వారమే బ్యాంకు ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు

PM Kisan 14th installment: పీఎం కిసాన్‌కు 14వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతున్నలకు గుడ్‌న్యూస్‌. జులై 27వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి.

Published : 19 Jul 2023 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్‌ (PM Kisan) పథకం 14వ విడత నిధుల (PM Kisan 14th installment) విడుదలకు తేదీ ఖరారైంది. వచ్చే వారమే రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సారి దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతులు ఈ నిధులు అందుకోనున్నారు. ఈ పథకం కింద ఏటా రూ.6వేలు చొప్పున మూడు విడతల్లో నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఫిబ్రవరిలో 13వ విడత నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయగా.. ఈసారి జులై 27న నిధులు విడుదల చేయనున్నారు. రాజస్థాన్‌లోని సీకర్‌లో రైతులతో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. పీఎం కిసాన్‌ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్‌ అకౌంట్‌ కలిగి ఉండాలి. అలాగే ఇ-కేవైసీ చేసి ఉండాలి.

₹10 లక్షల ప్రమాద బీమా ఇక ఆటోమేటిక్‌.. IRCTC నిర్ణయం

ఒకవేళ పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్నా, పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో తెలుసుకోవాలన్నా https://pmkisan.gov.in/లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌/ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. అలాగే, పీఎం కిసాన్‌కు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 155261 / 011-24300606 హెల్ప్‌లైన్లను సంప్రదించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని