Philanthropy List: దాతృత్వంలో శివ్ నాడార్ అగ్రస్థానం.. రోజుకి రూ.3 కోట్ల విరాళం
గత నాలుగేళ్లలో రూ.10 కోట్లకు పైగా వితరణ చేస్తున్న వారి సంఖ్య భారత్లో 116 పెరిగిందని హురున్ ఇండియా ఫిలాంత్రోపీ నివేదిక తెలిపింది. ఈ ఏడాది హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ వితరణలో అగ్రస్థానంలో నిలిచారు.
ముంబయి: సాఫ్ట్వేర్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపక ఛైర్మన్ శివ్ నాడార్ దాతృత్వంలో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. 2021-22లో ఆయన రూ.1,161 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే సగటున రోజుకు దాదాపు రూ.3 కోట్లను వితరణగా అందించారు. ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2022 జాబితాలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ రూ.484 కోట్ల విరాళంతో రెండో స్థానానికి చేరారు. వరసగా రెండు సంవత్సరాల పాటు ఈ జాబితాలో ప్రేమ్జీ ఈసారి తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ రూ.190 కోట్ల విరాళంతో జాబితాలో ఏడోస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 15 మంది శ్రీమంతులు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా విరాళాలిచ్చారు.
☞ ఎల్అండ్టీ గ్రూప్ ఛైర్మన్ రూ.142 కోట్లతో దేశంలోనే అత్యధిక విరాళం ఇచ్చిన ప్రొఫెషనల్ మేనేజర్గా నిలిచారు.
☞ జీరోదాకు చెందిన నితిన్ కామత్, నిఖిల్ కామత్ వితరణ 300 శాతం పెరిగి రూ.100 కోట్లకు చేరింది. నిఖిల్ కామత్ ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు.
☞ మైండ్ట్రీ వ్యవస్థాపకులు సుబ్రతో బాగ్చీ, ఎన్ ఎస్ పార్థసారథి ఒక్కొక్కరు రూ.213 కోట్లు విరాళమిచ్చి హురున్ జాబితాలో తొలి పదిస్థానాల్లోకి ఎగబాకారు.
☞ ఐఐఎస్సీ బెంగళూరుకు రూ.105 కోట్లు ఇచ్చిన క్వెస్ కార్ప్ ఛైర్మన్ అజిత్ ఐజాక్ తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్లో ఆయన 12వ ర్యాంకులో ఉన్నారు.
☞ ఐఐటీ కాన్పూర్లోని మెడికల్ సైన్సెస్ అండ్ టెక్కు రూ.100 కోట్ల విరాళమిచ్చిన ఇండిగో కో-ప్రమోటర్ రాకేశ్ గాంగ్వాల్ సైతం తొలిసారి ఈ జాబితాలో చేరారు.
☞ ఇన్ఫోసిస్ నందన్ నిలేకని రూ.159 కోట్లు, క్రిస్ గోపాలకృష్ణన్ రూ.90 కోట్లు, ఎస్.డి.శిబులాల్ రూ.35 కోట్లు వితరణ చేసి వరుసగా 9, 16, 28వ స్థానాల్లో నిలిచారు.
☞ ఈ ఏడాది కొత్తగా 19 మంది ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ జాబితాలో చేరారు. వీరి విరాళాల విలువ రూ.832 కోట్లు.
☞ ఈ ఏడాది ఆరుగురు మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. రోహిణీ నిలేకని రూ.120 కోట్లు, లీనా గాంధీ తివారీ రూ.21 కోట్లు, అను అగా రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చారు.
☞ రూ.10 కోట్ల కంటే ఎక్కువ వితరణ చేసిన వారి సంఖ్య గత నాలుగేళ్లలో 116 శాతం పెరిగి 80కి చేరింది.
☞ అత్యధిక విరాళాలు విద్య కోసం అందాయి. తర్వాత కొవిడ్ నివారణ చర్యల కోసం కూడా భారీ ఎత్తున విరాళాలొచ్చాయి.
☞ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారి సగటు వయసు 69 ఏళ్లు.
☞ ప్రాంతాలవారీగా చూస్తే ఈ జాబితాలో ముంబయి నుంచి 33 శాతం మంది, దిల్లీ నుంచి 16 శాతం, బెంగళూరు నుంచి 13 శాతం మంది ఉన్నారు.
☞ ఫార్మా పరిశ్రమ (20 శాతం) నుంచి ఎక్కువ మంది దాతలు ఉన్నారు. రసాయనాలు, పెట్రోకెమికల్స్ తర్వాతి స్థానంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. -
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. -
కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్
బైజూస్ బ్రాండ్ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన కోర్సు సబ్స్క్రిప్షన్ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. -
బ్యాంకింగ్ రంగంలో...
ఇండెక్స్ తరగతికి చెందిన ఓపెన్ ఎండెడ్ పథకాన్ని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. యాక్సిస్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అనే ఈ కొత్త పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది. -
కార్డు బిల్లు సెటిల్ చేశారా?
క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించాలి. అనివార్య పరిస్థితుల్లో బిల్లును సెటిల్మెంట్ చేసుకోవాల్సి వస్తే? అది కొంత మేరకు ఉపశమనం కలిగించవచ్చు. -
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
బైజూస్ సంస్థ పూర్వ వైభవం కోసం కృషి చేస్తోంది. ఇందులోభాగంగా కోర్సు ఫీజులను తగ్గించింది. సేల్స్ టీమ్కు ప్రోత్సాహకాలను పెంచింది. -
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
Amazon Fire TV Stick: అమెజాన్ కొత్త ఫైర్ స్టిక్ను లాంచ్ చేసింది. 4కె సపోర్ట్తో ఇది వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
నౌక స్వాధీనం ఘటన.. భారత నావికుల్లో ఐదుగురికి ఇరాన్ విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!