India: పెట్టుబడుల ఆకర్షణ.. చైనాను దాటేసిన భారత్!
పెట్టుబడులను ఆకర్షించే మార్కెట్ల జాబితాలో చైనా కంటే భారత్ ముందంజలో ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా పెట్టుబడిదారులకు భారత్లో ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపింది.
దిల్లీ: పెట్టుబడులకు అనుకూలమైన, అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్ల జాబితాలో చైనా (China)ను భారత్ (India) అధిగమించినట్టు ఓ సర్వే వెల్లడించింది. అధిక జనాభా, రాజకీయ స్థిరత్వం, చురుకైన నియంత్రణ వ్యవస్థల కారణంగా భారత్ ఈ ఘనత సాధించినట్లు ఓ సర్వే పేర్కొంది. ఇన్వెస్కో గ్లోబల్ సావరీన్ అసెట్ మేనేజ్మెంట్ అనే సంస్థ 85 సావరీన్ వెల్త్ ఫండ్స్ (సార్వభౌమ సంపద నిధి సంస్థలు), 57 సెంట్రల్ బ్యాంకులకు చెందిన ప్రణాళిక విభాగం అధిపతులు, 142 మంది చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ల అభిప్రాయాల ఆధారంగా ఓ సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. ఈ సంస్థల మొత్తం సంపద విలువ 21 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని నివేదికలో పేర్కొంది.
వ్యాపార నిర్వహణ, రాజకీయ స్థిరత్వం పరంగా భారత్ ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఉందని ఇన్వెస్కో సంస్థ నివేదికలో వెల్లడించింది. దేశంలో పెరుగుతున్న జనాభా, ప్రణాళికాపరమైన కార్యక్రమాలు, సావరీన్ పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం వంటి అనుకూల అంశాలు పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ను చైనా కంటే ముందంజలో ఉంచాయని తెలిపింది.
‘‘ చైనా, భారత్ల గురించి మాకు పూర్తి అవగాహన లేదు. కానీ, వ్యాపారపరమైన నిర్వహణ, పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. భారత్లో జనాభా పెరుగుదల వేగంగా ఉంది. కొత్త కంపెనీల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. ఇందుకోసం చక్కటి నియంత్రణ కార్యక్రమాలు చేపడుతోంది. అంతేకాకుండా పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది’’ అని తూర్పు మధ్య ప్రాంతానికి చెందిన ఓ సావరీన్ ఫండ్ ప్రతినిధి తెలిపారు.
మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాల తరహాలో విదేశీ పెట్టుబడుల ద్వారా భారత్ కూడా లబ్ధి పొందుతోందని ఇన్వెస్కో నివేదికలో వెల్లడించింది. దాంతోపాటు విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన మార్కెట్లుగా భారత్, దక్షిణ కొరియాలు ఉన్నాయని తెలిపింది. రాబోయే దశాబ్ద కాలంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఈ సర్వేలో పాల్గొన్న సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో బంగారం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బాండ్లకు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
Moto: 50dB, 46dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కు సపోర్ట్ చేసే రెండు కొత్త ఇయర్బడ్స్ను మోటో భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. -
అందుకే భారత్కు సొంత టెక్నాలజీ అవసరం.. లింక్డిన్పై ఓలా సీఈఓ ఫైర్!
Ola CEO: ఓలా సీఈఓ చేసిన ఓ పోస్ట్ను లింక్డిన్ తొలగించింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
ఐపీఓకు గో డిజిట్ ఇన్సూరెన్స్.. విరుష్క జోడీ వాటాలు వదులుకుంటున్నారా?
డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓకు రానుంది. మే 15న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై.. 17న ముగియనుంది. -
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
TCS CEO Salary: టీసీఎస్ సీఈఓ కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. అదే సమయంలో సీఓఓ గణపతి సుబ్రమణియం రూ.26.18 కోట్ల వేతనాన్ని పొందారు. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
AI Express: ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. కంపెనీ 25 మందిని తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది. -
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతోంది. -
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
India Economic Superpower: రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత్ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. దీంట్లో ప్రధాని మోదీతో పాటు అంబానీ, అదానీ కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది. -
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది. -
400 మంది ఇంజినీర్ల నియామకాలు: కోటక్ బ్యాంక్
ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని బ్యాంక్ భావిస్తోంది. -
10 కిలోల పెంపుడు జంతువు క్యాబిన్లోనే
తమ దేశీయ విమానాల క్యాబిన్లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
తమ వెబ్సైట్లో వేసవి విహారం కోసం శోధించిన వాటి వివరాలను ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ను కోల్కతా ఓపెనర్గా చూడాలనుంది : వసీమ్ అక్రమ్
-
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
-
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
-
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
-
అందుకే భారత్కు సొంత టెక్నాలజీ అవసరం.. లింక్డిన్పై ఓలా సీఈఓ ఫైర్!
-
ఐపీఓకు గో డిజిట్ ఇన్సూరెన్స్.. విరుష్క జోడీ వాటాలు వదులుకుంటున్నారా?