Mukesh Ambani: వారసులకు ముకేశ్ అంబానీ ఇచ్చిన టార్గెట్లు ఇవే..!
తన వారసులకు వ్యాపార బాధ్యతలను అప్పగించిన ముకేశ్ అంబానీ.. తాజాగా ఆయా రంగాల్లోని లక్ష్యాలు, అవకాశాలను వారికి గుర్తుచేశారు.
దిల్లీ: దేశవ్యాప్తంగా 2023 చివరినాటికి జియో 5జీ నెట్వర్క్ను విస్తరించనున్నట్లు రిలయన్స్ (Reliance) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తెలిపారు. అలాగే రిటైల్ రంగంలో వస్తున్న అవకాశాల్ని అందింపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛ ఇంధన రంగంలోనూ గణనీయ పురోగతి సాధించాలని నిర్దేశించుకున్నారు. ఇలా ముకేశ్ (Mukesh Ambani) తన ముగ్గురు వారసులకు లక్ష్యాలను నిర్దేశించారు. ధీరూభాయ్ జయంతి సందర్భంగా బుధవారం జరిగిన ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’లో ముకేశ్ (Mukesh Ambani) ఈ వ్యాఖ్యలు చేశారు.
‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ సమగ్ర స్వీయ-పరివర్తన ప్రయాణం ప్రారంభమైందని ముకేశ్ అన్నారు. 2021లో జరిగిన ‘ఫ్యామిలీ డే’లో ముకేశ్ తొలిసారి తన వారసత్వ ప్రణాళిక గురించి ప్రస్తావించారు. తన వ్యాపారాన్ని మూడు భాగాలుగా గుర్తించి.. టెలికాం, డిజిటల్ను పెద్ద కొడుకు ఆకాశ్కు; రిటైల్ను కూతురు ఈశాకు; స్వచ్ఛ ఇంధన వ్యాపారాన్ని చిన్న కొడుకు అనంత్కు అప్పగించిన విషయం తెలిసిందే. తాజా ఫ్యామిలీ డే సందర్భంగా ఈ మూడు విభాగాల్లో సాధించాల్సిన లక్ష్యాలను ముకేశ్ తన వారసుల ముందుంచారు.
‘‘సంవత్సరాలు వెళ్లిపోతాయి. దశాబ్దాలు గడిచిపోతాయి. మర్రి చెట్టు లాగా రిలయన్స్ ఇంకా పెరిగి పెద్దదవుతూనే ఉంటుంది. దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తాయి. వేర్లు మరింత లోతుకు వెళ్తాయి. నానాటికీ పెరుగుతున్న భారతీయుల జీవితాలను స్పృశిస్తూ, సుసంపన్నం చేస్తూ రిలయన్స్ వారిని మరింత శక్తిమంతంగా మారుస్తుంది’’ అని ముకేశ్ అన్నారు. వచ్చే ఐదేళ్లలో రిలయన్స్ 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోనుందని గుర్తుచేశారు.
ఆకాశ్కు గొప్ప అవకాశం..
‘‘ఆకాశ్ నేతృత్వంలో జియో ప్రపంచంలోని అత్యుత్తమ 5G నెట్వర్క్ను భారతదేశం అంతటా విస్తరిస్తోంది. ఈ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా అమలవుతోంది. 2023లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, భారత్లో రాబోతున్న మరో అతిపెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి జియో ప్లాట్ఫామ్స్ సిద్ధం కావాల్సి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ప్రత్యేకమైన డిజిటల్ ఉత్పత్తులు, పరిష్కారాలను అందించాల్సిన అవసరం ఉంది’’ అని టెలికాం, డిజిటల్ విభాగం సాధించాల్సిన లక్ష్యాలను ముకేశ్ నిర్దేశించారు. దేశంలో ప్రతి గ్రామం 5జీ నెట్వర్క్తో అనుసంధానం కానుంనదని పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక సేవల్ని అందించాలన్నారు. తద్వారా పట్టణ- గ్రామీణ ప్రాంతాల మధ్యనున్న అంతరాన్ని తగ్గించడానికి ఇదే గొప్ప అవకాశం అన్నారు. ఈ రకంగా భారత్ సమగ్రాభివృద్ధిని మరింత వేగంగా సాధించడంలో జియో భాగమయ్యే అవకాశం ఉందన్నారు.
ఈశా టార్గెట్ ఇదే..
మరోవైపు ఈశా నేతృత్వంలో రిటైల్ బిజినెస్ దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంటోందన్నారు. ఈ రంగంలో ఉన్న మరిన్ని అవకాశాల్ని అందిపుచ్చుకోగల సామర్థ్యం, సమర్థత రిలయన్స్ రిటైల్ బృందానికి ఉందని చెప్పారు. జియో తరహాలోనే రిటైల్ వ్యాపార వృద్ధి సైతం భారతదేశ సమగ్ర అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఉత్పాదకతను పెంచడం సహా వ్యాపారులను సుభిక్షంగా మార్చగలదన్నారు.
అనంత్కు ‘హరిత’ లక్ష్యం..
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం గిగా ఫ్యాక్టరీలను నిర్మించడంతోపాటు హైడ్రోజన్ వ్యాపారంలోకి ప్రవేశించడం వరకు విస్తరించిన ‘కొత్త ఇంధన’ వ్యాపారానికి.. రిలయన్స్ రూపురేఖలనే మార్చగల సామర్థ్యం ఉందని ముకేశ్ అన్నారు. అనంత్ నేతృత్వంలోని ఈ కొత్త తరం వ్యాపారం.. జామ్నగర్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుతో వేగంగా విస్తరించనుదన్నారు. భారత్లో అతిపెద్ద, అత్యంత విలువైన కంపెనీగా ఉన్న రిలయన్స్.. రానున్న రోజుల్లో ‘గ్రీనెస్ట్ కార్పొరేట్’గా అవతరించే దిశగా దూసుకెళ్తోంద్నారు. భారత్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను అందుకోవడం, స్వయం సమృద్ధిని సాధించేలా చూడడమే రిలయన్స్ న్యూ ఎనర్జీ బినిసెస్ ముందున్న స్పష్టమైన లక్ష్యమని తెలిపారు. చురుగ్గా ఉంటూ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
టీమ్వర్క్, నాయకత్వంతోనే వ్యాపారంలో విజయం సాధ్యమవుతుందని అంబానీ అన్నారు. అందుకు ఇటీవల అర్జెంటీనా ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిచిన ఉదంతాన్ని ప్రస్తావించారు. జట్టు సహకారం లేకపోతే మెస్సి ఒక్కడే కప్ను గెలవడం సాధ్యమయ్యేది కాదన్నారు. అలాగే మెస్సి స్ఫూర్తిమంతమైన నాయకత్వం లేకుండా అర్జెంటీనాకు విజయం అంత సులభమై ఉండేది కాదన్నారు. తొలి మ్యాచ్లో తడబడినా.. విజయాన్ని ముద్దాడే వరకు అర్జెంటీనా పోరాటం ఆపలేదన్నారు. చివరి పెనాల్టీ షాట్ వరకు వారి దృష్టంతా విజయంపైనే ఉందని కొనియాడారు. రిలయన్స్ను సైతం ధీరూభాయ్ అంబానీ అదే తరహాలో నిర్మించారని తెలిపారు. తన తండ్రితో పాటు స్వామి వివేకానంద కూడా తనలో ఎంతో స్ఫూర్తి నింపారని ముకేశ్ తెలిపారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. నిరంతరం దానికోసమే తపించాలన్న స్వామీజీ మాటల్ని గుర్తుచేశారు. అందరూ దీన్ని పాటించాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్ను తీసుకురానుంది. -
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
Go Digit: ఆన్లైన్ వేదికగా ఇన్సూరెన్స్ సేవలందించే స్టార్టప్ సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీఓ ఈనెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. -
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
Train Ticket: రైల్వే టికెట్లకు సంబంధించిన రిఫండ్ల సొమ్ము ఇప్పుడ వేగంగా జమ అవుతోంది.ఒక రోజులోనే ఆయా ఖాతాల్లో పడుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. -
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. -
కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్
బైజూస్ బ్రాండ్ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన కోర్సు సబ్స్క్రిప్షన్ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. -
బ్యాంకింగ్ రంగంలో...
ఇండెక్స్ తరగతికి చెందిన ఓపెన్ ఎండెడ్ పథకాన్ని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. యాక్సిస్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అనే ఈ కొత్త పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం