Adani Group: అదానీపై హిండెన్బర్గ్ ఆరోపణలకు ఏడాది.. 7 షేర్లు ఇంకా దిగువనే!
Adani Group: హిండెన్బర్గ్ ఆరోపణలు వెలువడి ఏడాది గడిచిన వేళ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు. ఏడాది కాలంలో తాము మరింత దృఢంగా మారామని పేర్కొన్నారు.
ముంబయి: అదానీ గ్రూప్ (Adani Group) అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ (Hindenburg) ఆరోపణలు చేసి ఏడాది గడిచింది. దేశ స్టాక్ మార్కెట్లో తీవ్ర కుదుపునకు కారణమైన ఈ ఉదంతంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. పదింటిలో ఇప్పటికీ ఏడు సంస్థల షేర్లు మునుపటితో పోలిస్తే దిగువనే ట్రేడవుతున్నాయి.
మార్కెట్ క్యాప్ ఇంకా 24%..
స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం.. హిండెన్బర్గ్ (Hindenburg) ఆరోపణలకు ముందు రూ.19.23 లక్షల కోట్ల వద్ద అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ (Adani Group Market Cap) రికార్డు గరిష్ఠానికి చేరింది. 2024 జనవరి 24న స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి ఈ విలువ రూ.14.52 లక్షల కోట్లుగా ఉంది. అంటే గరిష్ఠం నుంచి ఇంకా 24 శాతం పుంజుకోవాల్సి ఉంది.
ఇదీ షేర్ల పరిస్థితి..
అదానీ గ్రూప్లోని (Adani Group) మొత్తం పది నమోదిత సంస్థల్లో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ షేర్ల ధరలు మాత్రమే మునుపటి స్థాయికి చేరాయి. గత ఏడాది వ్యవధిలో అదానీ పవర్ 89 శాతం, అదానీ పోర్ట్స్ 47 శాతం, అంబుజా సిమెంట్స్ షేర్లు 5 శాతం రాణించాయి. మిగిలిన కంపెనీల షేర్లన్నీ ఇంకా దిగువ స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి. 2024 జనవరి 24 ముగింపు ధరలను పరిగణనలోకి తీసుకుంటే అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 74 శాతం, అదానీ విల్మర్ 38 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 15 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 14 శాతం, ఎన్డీటీవీ 6 శాతం, ఏసీసీ 4 శాతం మేర పుంజుకోవాల్సి ఉంది.
హిండెన్బర్గ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అదానీ గ్రూప్.. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపడం కోసం పలు చర్యలు చేపట్టింది. రుణ వాయిదాలను ముందస్తుగానే చెల్లించింది. కొత్తగా నిధులను సమీకరించుకుంది. మరోవైపు హిండెన్బర్గ్ ఆరోపణలపై సెబీ దర్యాప్తు, ఆరోపణలపై ఇతర సంస్థల విచారణ అవసరం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల వంటి పరిణామాలూ షేర్లు కనిష్ఠాల నుంచి పుంజుకోవడానికి దోహదం చేశాయి.
మరింత దృఢంగా మారాం: గౌతమ్ అదానీ
హిండెన్బర్గ్ ఆరోపణలు గత ఏడాది వ్యవధిలో తమని మరింత దృఢంగా మార్చాయని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) అన్నారు. ఈ అనుభవం తమకు విలువైన పాఠాలు నేర్పిందని తాజాగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. సాధారణంగా షార్ట్ సెల్లర్ల ఆరోపణలు కేవలం ఫైనాన్షియల్ మార్కెట్లకు మాత్రమే పరిమితమవుతాయన్నారు. కానీ, అదానీ గ్రూప్పై వచ్చినవి మాత్రం రాజకీయ రంగు కూడా పులుముకున్నాయని ఆరోపించారు. నిరాధార ఆరోపణల వల్ల వేలాదిమంది రిటైల్ మదుపరులు నష్టపోవడం తనను తీవ్రంగా బాధించిందని గౌతమ్ అదానీ అన్నారు. తమపై ఆరోపణలు గుప్పించిన వారి ప్రణాళికలు పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదన్నారు. లేదంటే దేశంలో చాలా కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్రాజెక్టులపై పెనుప్రభావం ఉండేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులు తమకు కొత్త కాదని, ఇకపై ఆగుతాయన్న భ్రమలోనూ లేమని చెప్పారు.
ఇవీ హిండెన్బర్గ్ ఆరోపణలు..
అదానీ గ్రూప్ (Adani Group) తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందిందని ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరేబియన్, మారిషస్ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని తెలిపింది. వీటి ద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ (Adani Group) తీవ్రంగా ఖండించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు. -
జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. -
ఫరూఖ్నగర్లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. -
ఆఫ్లైన్లోనూ ఇ-రుపీ
ఇ-రుపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
మాస్చిప్ టెక్నాలజీస్ ఆదాయాల్లో వృద్ధి
సెమీకండక్టర్, సాఫ్ట్వేర్, సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మాస్చిప్ టెక్నాలజీస్ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
సంక్షిప్త వార్తలు(7)
సువెన్ లైఫ్సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం