Stock Market Closing Bell: సెన్సెక్స్ 770 పాయింట్లు డౌన్..అంతర్జాతీయ మార్కెట్లలోని అమ్మకాల ఎఫెక్ట్!
Stock Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి.....
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెప్టెంబరు నెలను భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య భారీ నష్టాలతో ట్రేడింగ్ మొదలుపెట్టిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. మధ్యలో స్వల్పంగా కోలుకున్నప్పటికీ.. తిరిగి అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగియగా.. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు అదే బాటలో పయనించాయి. మధ్యాహ్నం ప్రారంభమైన ఐరోపా మార్కెట్లు సైతం అప్రమత్తంగానే కదలాడుతున్నాయి.
నష్టాలకు ప్రధాన కారణాలు..
రేట్ల పెంపు భయాలు, ద్రవ్యోల్బణం మార్కెట్లను వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి ఐరోపా, ఆసియా ప్రాంతంలో తయారీ కార్యకలాపాలు నెమ్మదించాయన్న నివేదికలు జత కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు చమురు ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలూ మదుపర్లను కలవరపెట్టాయి. దేశీయంగా చూస్తే నిన్న వెలువడిన జీడీపీ గణాంకాలు మార్కెట్లను నిరాశపర్చాయి. ఏప్రిల్-జులై త్రైమాసికంలో వృద్ధి రేటు 16.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేయగా.. అది 13.5 శాతానికి పరిమితమైంది. మరోవైపు ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఈ ఏడాది భారత వృద్ధిరేటును 8.8 శాతం నుంచి 7.7 శాతానికి సవరించింది. అలాగే మంగళవారం నాటి భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు కీలక కౌంటర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమూ నష్టాలకు ఆజ్యం పోసింది.
* నిఫ్టీ ఉదయం 17,485.70 వద్ద భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,468.45 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 216.50 పాయింట్ల నష్టంతో 17,542.80 వద్ద స్థిరపడింది. 58,710.53 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ 58,522.57 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. చివరకు సెన్సెక్స్ 770.48 పాయింట్ల భారీ నష్టంతో 58,766.59 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.58 వద్ద నిలిచింది.
* సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, టైటన్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్, టీసీఎస్, సన్ఫార్మా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్యూఎల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, పవర్గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
Go Digit: ఆన్లైన్ వేదికగా ఇన్సూరెన్స్ సేవలందించే స్టార్టప్ సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీఓ ఈనెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. -
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
Train Ticket: రైల్వే టికెట్లకు సంబంధించిన రిఫండ్ల సొమ్ము ఇప్పుడ వేగంగా జమ అవుతోంది.ఒక రోజులోనే ఆయా ఖాతాల్లో పడుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. -
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. -
కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్
బైజూస్ బ్రాండ్ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన కోర్సు సబ్స్క్రిప్షన్ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. -
బ్యాంకింగ్ రంగంలో...
ఇండెక్స్ తరగతికి చెందిన ఓపెన్ ఎండెడ్ పథకాన్ని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. యాక్సిస్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అనే ఈ కొత్త పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది. -
కార్డు బిల్లు సెటిల్ చేశారా?
క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించాలి. అనివార్య పరిస్థితుల్లో బిల్లును సెటిల్మెంట్ చేసుకోవాల్సి వస్తే? అది కొంత మేరకు ఉపశమనం కలిగించవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ