Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 83 పాయింట్ల లాభంతో 62,929 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 29 పాయింట్ల లాభంతో 18,627 దగ్గర కొనసాగుతోంది.
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అయితే, ఆరంభంలో లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే లాభాల్లోకి ఎగబాకాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 83 పాయింట్ల లాభంతో 62,929 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 29 పాయింట్ల లాభంతో 18,627 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు పుంజుకొని 82.68 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, టైటన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా స్టీల్, టీసీఎస్, ఎంఅండ్ఎం, సన్ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. ప్రస్తుతం యూఎస్ ఫ్యూచర్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు మాత్రం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా అప్పుల పరిమితి పెంపుపై బుధవారం ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బిల్లు గట్టెక్కడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు దేశీయంగా చూస్తే పలు మార్గదర్శకాలను జారీ చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు కార్పొరేట్ పాలనాపరంగా బలహీనంగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ హెచ్చరించారు. ఈ ధోరణి మారకపోతే.. బ్యాంకింగ్ రంగం ఊగిసలాటకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర స్వల్పంగా పెరిగి 77.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.1,758.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు సైతం రూ.853.57 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
గమనించాల్సిన స్టాక్స్..
నాట్కో ఫార్మా: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.926.9 కోట్ల ఆదాయాన్ని, రూ.275.8 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాలంలో రూ.610.6 కోట్ల ఆదాయంపై రూ.50.5 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేసింది.
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రా: జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు నష్టాలు పెరిగాయి. ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికంలో రూ.1,895 కోట్ల స్థూల ఆదాయంపై రూ.637 కోట్ల నికర నష్టాన్ని సంస్థ నమోదు చేసింది. 2021-22 ఇదే కాలంలో ఆదాయం రూ.1,284 కోట్లు, నికర నష్టం రూ.129 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయంతో పాటు నష్టాలు కూడా పెరిగాయి.
ఓఎన్జీసీ: ప్రభుత్వరంగ చమురు సంస్థ ఓఎన్జీసీ తన హరిత ఇంధన ప్రాజెక్టులపై 2030 నాటికి రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2038 కల్లా సున్నా కర్బన స్థాయికి చేరాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్ వారెన్ బఫెట్ ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం. -
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
బిగ్బుల్ దివంగత రాకేశ్ ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటన్ షేరు ఒక్క రోజులో రూ. వందల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చింది. -
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
గూగుల్ సీఈఓ సుందర్పిచాయ్ గ్రాడ్యుయేషన్ నాటి ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
అదానీ గ్రీన్, శ్రీలంక ప్రభుత్వం మధ్య విద్యుత్ ఒప్పందం
శ్రీలంకలో పవన విద్యుత్ కేంద్రాల స్థాపన కోసం భారత్కు చెందిన అదానీ గ్రీన్, శ్రీలంక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. -
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో కొత్తగా నాలుగు ఫీచర్లను యాడ్ చేసింది. అవేంటో చూసేయండి. -
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
Samsung Power Banks: 10,000mAh, 20,000mAh సామర్థ్యంతో భారత్లో శామ్సంగ్ రెండు కొత్త పవర్బ్యాంకులను విడుదల చేసింది. -
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
పేటీఎం యూపీఐ లావాదేవీల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. వరుసగా మూడో నెలా క్షీణత నమోదైంది. మరోవైపు ఫోన్పే, గూగుల్ పే హవా కొనసాగుతోంది. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
Trading hours: స్టాక్ బ్రోకర్ కమ్యూనిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ సమయం పొడిగించే అంశాన్ని సెబీ తిరస్కరించింది. -
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
Tesla: టెక్ కంపెనీల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు కష్టపడి పనిచేసిన తమను తొలగించడంపై పలువురు సామాజిక మాధ్యమ వేదికల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 67 పాయింట్ల లాభంతో 73,963 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,484 దగ్గర కొనసాగుతోంది. -
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్