SSY: సుకన్య సమృద్ధి యోజన ఉపసంహరణ నియమాలు ఏంటో తెలుసా?
ఇది దీర్ఘకాల వ్యవధి ఉన్న మెచ్యూరిటీ పథకం అయినప్పటికీ కొన్ని బలమైన కారణాలతో ముందుగా కూడా ఈ ఖాతా నుంచి ఉపసంహరించుకోవచ్చు.
అమ్మాయిలు భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, చదువు, వివాహం మొదలగు కార్యక్రమాలకు అయ్యే ఖర్చులకు ఉపయోగపడుతుందనే ఉద్ధేశంతో 10 ఏళ్లలోపు బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం 2014లో సుకన్య సమృద్ధి యోజన స్కీమును ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకానికి 7.60% వడ్డీ రేటును ఇస్తోంది. పోస్టాఫీసులో ఏ ఇతర స్కీమ్ కన్నా కూడా దీనిలోనే ఎక్కువ వడ్డీ ఆర్జించవచ్చు. దీనిలో ఒక ఆర్థిక సంవత్సర కనీస డిపాజిట్ రూ. 250, గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ ఖాతా దీర్ఘకాలం కొనసాగుతుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల మెచ్యూరిటీ కాలవ్యవధి కలిగి ఉంటుంది. డిపాజిట్లయితే 15 ఏళ్లు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఖాతాలో డిపాజిట్లు చేయకపోయినా మెచ్యూరిటీ వరకు వడ్డీ లభిస్తుంది. అమ్మాయి, ఖాతా మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం నిధిని, వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. ఈ మొత్తం ఉపసంహరణకు ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు.
18 ఏళ్లు నిండిన తర్వాత అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత శాఖకు సమర్పించి తన ఖాతాను సొంతంగా నిర్వహించుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఖాతాలో ఉన్న డబ్బును ఉపసంహరించుకుని ఖాతాను మూసివేయొచ్చు. లేదా ఖాతాలో ఉన్న సొమ్మును పాక్షికంగా కూడా ఉపసంహరించుకుని ఖాతాను కొనసాగించవచ్చు. ఉపసంహరణ ఫారంను పూర్తిచేసి, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఖాతా నుంచి పాక్షికంగా, పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు ఉండొచ్చు. అవేంటో చూద్దాం.
విద్య:
అమ్మాయికి 18 ఏళ్లు వచ్చినా లేదా 10వ తరగతి విద్యను పూర్తి చేసినా..విద్యా ప్రయోజనాల కోసం నగదు అవసరాలకై ఈ ఖాతా నుంచి ఉపసంహరించుకోవచ్చు. దీని కోసం, కళాశాల/యూనివర్సిటీ విద్యా ప్రవేశానికి సంబంధించిన సరైన పత్రాలు (ధ్రువీకరించబడిన ప్రవేశ ఆఫర్, ఫీజు వివరాల కాపీలను) సమర్పించాలి. మునుపటి సంవత్సరం ఖాతాలో అందుబాటులో ఉన్న మొత్తంలో 50% మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
వివాహం:
ఖాతాదారైన అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత, పెళ్లికి సంబంధించి..వివాహానికి ఒక నెల ముందు లేదా వివాహం జరిగిన 3 నెలల తర్వాత ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. వివాహానికి సంబంధించిన రుజువు తప్పనిసరిగా సమర్పించాలి.
మరణం:
ఖాతాదారైన అమ్మాయి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఖాతాకు సంబంధించిన హక్కు ఖాతా ప్రారంభించిన వ్యక్తికి లభిస్తుంది. మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన తర్వాత డిపాజిట్ నిల్వ మొత్తాన్ని వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు.
పౌరసత్వం:
ఖాతాను ప్రారంభించినప్పుడు అమ్మాయికి భారత పౌరసత్వం ఉన్నప్పటికీ..తర్వాత డిపాజిట్ కాలవ్యవధిలో పౌరసత్వం కోల్పోతే ఖాతా క్లోజ్ చేస్తారు. ఈ వివరాలను సంబంధిత శాఖకు తెలియజేయాలి.
సంరక్షకుల మరణం:
ఖాతాను ప్రారంభించిన తల్లిదండ్రులు/సంరక్షకుడు మరణించిన సందర్భంలో ఖాతాదారైన అమ్మాయికి ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు ఖాతా ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత ఖాతాను మూసేయొచ్చు. అయితే, ఇలాంటి ఉపసంహరణకు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు ఆమోదం తప్పనిసరి.
అత్యవసర పరిస్థితులు:
అమ్మాయికి ప్రాణాంతక వ్యాధి లేదా ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో..వీటికి సంబంధించిన పత్రాలు సమర్పిస్తే మొత్తం డిపాజిట్, వడ్డీతో సహా ఉపసంహరించుకుని ఖాతా మూసివేయడానికి అనుమతి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు