ఇదేం పద్ధతి!
అధికారో, ఉద్యోగో, కిందిస్థాయి సిబ్బందో.. స్థాయి, హోదా ఏదైనా కావొచ్చు. ఏదైనా కార్యాలయంలో ఎవరిపైౖనా అయినా అవినీతి ఆరోపణలు వస్తే ఏం చేస్తాం. వారితో కాస్త ప్రత్యేకంగా వ్యవహరిస్తాం.
వద్దన్నా.. బాధ్యతలు
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: అధికారో, ఉద్యోగో, కిందిస్థాయి సిబ్బందో.. స్థాయి, హోదా ఏదైనా కావొచ్చు. ఏదైనా కార్యాలయంలో ఎవరిపైౖనా అయినా అవినీతి ఆరోపణలు వస్తే ఏం చేస్తాం. వారితో కాస్త ప్రత్యేకంగా వ్యవహరిస్తాం. వీలైనంత వరకు వారిని కార్యాలయ బాధ్యతలకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప అదంతా మనకెందుకులే అనుకొని అలక్ష్యంగా వ్యవహరించం కదా. కానీ, కొందరు అధికారులు మాత్రం ఈ విషయంలో నిర్లిప్త ధోరణి అవలంబిస్తున్నారు. ఎవరు అడుగుతారులే, ఏం చేస్తారులే అనే వైఖరి కనబరుస్తున్నారు. ముఖ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ అనిశాకు చిక్కిన వారిని తిరిగి అదేతరహా బాధ్యతల్లో కొనసాగిస్తున్నారు. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని ప్రజాసంబంధ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని నిబంధనలున్నా, అవేవీ పట్టించుకోకుండా పనితీరును అపహాస్యం చేస్తున్నారు.
అనిశాకు పట్టుబడినా..
ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా మామూలు ప్రజానీకాన్ని లంచం కోసం ఇబ్బంది పెట్టినా, పని చేయకుండా సతాయించినా, అక్రమార్జనను ప్రోత్సహించినా అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. సదరు ఉద్యోగి పనితీరుపై ఆరాతీసి, తదనుగుణంగా వారిపై నిఘా ఏర్పాటుచేస్తారు. లంచం తీసుకునే సమయంలో నేరుగా పట్టుకుంటారు. కేసులు నమోదుచేస్తుంటారు. ఇలా పట్టుబడిన వారిలో అధికారులున్నా, కిందిస్థాయి ఉద్యోగులు ఉన్నా.. వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. ఇది కొద్దిరోజుల వరకే. కేసు విచారణ కొనసాగుతున్నా సదరు ఉద్యోగులు తమ ప్రయత్నాలతో తిరిగి ఉద్యోగాల్లో చేరుతుంటారు. విచారణ, శిక్షలు అనే విషయం కాసేపు పక్కనపెడితే.. ఇలా అనిశాకు చిక్కిన వారిని ఆ కేసులు పూర్తయ్యే వరకు ప్రజాసంబంధమైన విధులకు దూరంగా ఉంచాలి. అదే క్యాడర్లో ఇతర బాధ్యతలు అప్పగించాలనే నిబంధన ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో ఇది పక్కాగా అమలుకావడం లేదు. ఉన్నతస్థాయి అధికారులు సైతం ఈ విషయంలో పెద్దగా అభ్యంతరపెట్టిన ఘటన లేకపోవడంతో వివిధ సందర్భాల్లో పట్టుబడిన వారు సైతం ఎప్పటిలాగే ప్రజాసంబంధమైన కార్యకలాపాల్లో భాగమవుతున్నారు. విధులను కొనసాగిస్తున్నారు.
అక్రమాలకు ఊతమిచ్చేలా..
ఏ శాఖలోనైనా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో కేసులు నమోదైన వ్యక్తులను కొద్దిరోజుల అనంతరం మళ్లీ అదే స్థానంలో నియమించడం, లేక ప్రజలతో సంబంధం ఉండే బాధ్యతలు అప్పగించడం ఎంతమాత్రమూ సమంజసం కాదు. దీనివల్ల అవినీతికి మరింత ఊతమిచ్చినట్లవుతుంది. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, సబ్రిజిస్ట్రార్ వంటి ప్రజాసంబంధ శాఖల్లో ఈ తరహా వైఖరి ఆక్షేపణీయం. జిల్లా పరిధిలో చోటుచేసుకున్న పలు సంఘటనలు పరిశీలిస్తే.. శాఖతో సంబంధం లేదు, ఆరోపణలతో అవసరం లేదు, పైరవీలు- ఒత్తిళ్లు ఉంటే ఎప్పటిలా ఉద్యోగంలో కొనసాగొచ్చనే భావన కలుగుతోంది.
- నిర్మల్ బల్దియా పరిధిలో ఇప్పటికే అసెస్మెంట్ విషయంలో ఆరోపణలు ఎక్కువ. ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోయినా, ఖాళీస్థలం ఉన్నా గుడ్డిగా ఇంటినంబర్లు కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలాంటివి అరికట్టి కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన మున్సిపల్ రెవెన్యూ విభాగంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే వాదనలకు బలం చేకూర్చేలా కొద్దిరోజుల క్రితం ఓ అధికారి, కిందిస్థాయి ఉద్యోగి ఇద్దరూ అనిశా వలలో చిక్కిన విషయం తెలిసిందే. అయితే.. సదరు అధికారి సస్పెన్షన్లో ఉండటంతో ఆయన స్థానంలో కొత్తగా మరొకరిని నియమించారు. ఇలా నియమితులైన వ్యక్తి సైతం కొద్దిరోజుల క్రితం అనిశా దాడిలో చిక్కిన వారే కావడం గమనార్హం. కేవలం పనిచేసే ప్రాంతం మార్చి మళ్లీ అదే తరహా బాధ్యతలు అప్పగించడం అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది.
- జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ అధికారి గతంలో అనిశాకు చిక్కారు. ఆ తర్వాత కొద్దినెలల అనంతరం అతడిని మళ్లీ అదే కేడర్ అధికారిగా, అదీ ఈ జిల్లాలోనే నియమించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.
- జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే సమయంలో గతంలో అనిశాకు పట్టుబడ్డారు. అయినా, అదేం పెద్ద విషయం కాదు, అంతా సర్వసాధారణమే అన్నట్లుగా మళ్లీ అదే శాఖలో ఎప్పటిలా విధులను కొనసాగిస్తుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా పాఠశాల స్థాయి ఈత పోటీలు
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన పాఠశాల స్థాయి ఈత పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తాం
[ 29-04-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పలరాలో సోమవారం సాయంత్రం మంత్రి సీతక్క ఎంపీ అభ్యర్థి సుగుణ తరఫున ప్రచారం నిర్వహించారు. -
విద్యుత్ స్తంభం పైనుంచి పడి జేఎల్ఎం దుర్మరణం
[ 29-04-2024]
విద్యుత్తు స్తంభం పైనుంచి కింద పడి జూనియర్ లైన్మెన్ దుర్మరణం చెందిన సంఘటన అదిలాబాద్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. -
సదస్సుపై దాడికి పాల్పడటం ఉన్మాద చర్య
[ 29-04-2024]
కవులు, రచయితలను, ప్రజాస్వామ్యాదులపై దాడికి పూనుకోవటం ఉన్మాదా చర్యని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు. -
మే డే గోడ ప్రతులను ఆవిష్కరించిన ఏఐటీయూసీ నేతలు
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం ఏఐటీయూసీ నేతలు ప్రపంచ కార్మిక దినోత్సవానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. -
ఫ్లెక్సీల ఏర్పాటుపై ఫిర్యాదు
[ 29-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి ఒక పార్టీకి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులకు భాజపా నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. -
కార్మికుల హక్కుల సాధనకు మతోన్మాదులను ఓడించాలి
[ 29-04-2024]
కార్మికుల హక్కులను కాలరాసే యత్నాలు చేస్తున్న మతోన్మాద పార్టీలను ఓడించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ పిలుపునిచ్చారు. -
రిమ్స్ లాండ్రీకి నీటి కొరత
[ 29-04-2024]
రిమ్స్లోని లాండ్రీకి నీటి కొరత సమస్య ఏర్పడింది. -
ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలో సోమవారం బాలకేంద్రం, నృత్య శిక్షణ కేంద్రాలు, డ్యాన్స్ అకాడమీల్లో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
వంతెనలు లేక.. చింతలు తీరక
[ 29-04-2024]
వర్షంవస్తే ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే వందలాది గ్రామాలున్నాయి. అక్కడ పురిటి నొప్పులతో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక మృత్యువాత పడుతున్న తల్లుల వేదన పట్టించుకునే వారు కరవయ్యారు. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 29-04-2024]
మీకు స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. రోజుకు రూ.5 వేలు మొదలుకొని నెలకు రూ.లక్షపైనే ఆదాయం పొందవచ్చని నమ్మబలికింది ఓ విదేశీ ఆన్లైన్ కంపెనీ. సంప్రదింపులు లేకుండా చాటింగ్ ద్వారా లావాదేవీలు నడిపి పెద్ద ఎత్తున యువకులు పెట్టుబడి పెట్టేలా ఎరవేసింది. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 29-04-2024]
ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వాడకం పెరిగిపోవడంతో గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్ల లోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
ఎన్నికల వేళ.. గొలుసు దుకాణాల గోల
[ 29-04-2024]
‘లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, మద్యం గొలుసుదుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. -
తాళం వేసుందా.. సొమ్ము గోవిందా
[ 29-04-2024]
జిల్లాలో తాళం వేసిన ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాలామంది విహారయాత్రలు, ప్రముఖ దేవాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. -
పురిటిలోనే బిడ్డ.. వైద్యం అందక తల్లి మృతి
[ 29-04-2024]
కాగజ్నగర్ పట్టణం పెట్రోల్బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. -
ఓటు మీది.. అభివృద్ధి మాది
[ 29-04-2024]
పదేళ్లలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస చేసిందేమి లేదని, కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
తాగునీటి కష్టాలు మొదలు..
[ 29-04-2024]
గత నెల రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి గోదావరినదిలో నిర్మించిన ఇన్టేక్వెల్స్ వద్ద నీటిమట్టం ఇప్పటికే తగ్గిపోయింది. -
కళాశాలలు డీలా.. గురుకులాలు భళా
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది. -
పోలింగ్ చీటీ.. ఓటరు దిక్సూచీ
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తోంది. ఓటర్లు అందరూ స్వేచ్ఛాయుతంగా ఓటువేసేందుకు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ఓటర్లకు పోలింగ్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఎన్నికలకు సమాయత్తం
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఓటు... మరింత చేరువ!
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం కుదిరేది కాదు. ఆయా గ్రామాల ప్రజలు ఓట్లు వేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. -
పరిమితి మించితే చిక్కులే..
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణపర్వం పూర్తయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. -
16 శాతం రాకుంటే డిపాజిట్ గల్లంతే..
[ 29-04-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
57 మంది అధ్యాపకులకు నోటీసులు
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనరల్, వొకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 29.28 శాతం,
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్