logo

Crime News: విలువైన వస్తువులు దొరకలేదని.. వస్తువులకు నిప్పు పెట్టిన దొంగలు

చోరీకి వచ్చిన దొంగలకు బంగారం, నగదు విలువైన వస్తువులు లభించలేదని ఆగ్రహం వ్యక్తం చేసి ఇంట్లో ఫర్నిచర్‌ను దహనం చేసిన సంఘటన మేడ్చల్‌ ఠాణా పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. శామీర్‌పేట మండలం

Updated : 05 Feb 2022 13:15 IST

శామీర్‌పేట, న్యూస్‌టుడే: చోరీకి వచ్చిన దొంగలకు బంగారం, నగదు విలువైన వస్తువులు లభించలేదని ఆగ్రహం వ్యక్తం చేసి ఇంట్లో ఫర్నిచర్‌ను దహనం చేసిన సంఘటన మేడ్చల్‌ ఠాణా పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. శామీర్‌పేట మండలం మురహరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజయ్‌ వాటర్‌ ఫ్రంట్‌లో నెల రోజుల క్రితం ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగలు చోరీకి పాల్పడి విలువైన వస్తువులు దోచుకెళ్లారు. దీంతో మేడ్చల్‌ పోలీసులు, మురహరిపల్లి పంచాయతీ ప్రజాప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బంగారం, నగదు ఇళ్లల్లో పెట్టుకోవద్దని చైతన్యం చేశారు. దీంతో చాలామంది ఇళ్లల్లో విలువైన వస్తువులు ఉంచట్లేదు. పనుల నిమిత్తం ఇళ్లకు తాళాలు వేసిన ఐదు ఇళ్లను గురువారం గుర్తించిన దొంగలు.. అర్ధరాత్రి ప్రజయ్‌ వాటర్‌ ఫ్రంట్‌లోకి ప్రవేశించారు. ఆ ఇళ్లల్లోనూ బంగారం, నగదు లభించకపోవడంతో ఆగ్రహించిన దొంగలు.. ఓ ఇంటిలోని ఫర్నీచర్‌కు నిప్పు పెట్టి పరారయ్యారు.  పోలీసులు నిఘా కెమెరాలను పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. దొంగలేే నిప్పు పెట్టినట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని