ముందుకెళ్లాలంటే.. ముచ్చెమటలే!
నగరం నలువైపుల పెరిగిన ట్రాఫిక్ వాహనదారులకు నరకం చూపుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ ప్రధాన మార్గాల్లో నిత్యం రద్దీ వాతావరణం దర్శనమిస్తోంది.
నగరం నలువైపుల పెరిగిన ట్రాఫిక్ వాహనదారులకు నరకం చూపుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ ప్రధాన మార్గాల్లో నిత్యం రద్దీ వాతావరణం దర్శనమిస్తోంది. కరోనా అనంతరం ఈ ఏడాది సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఐటీ కంపెనీలు కార్యాలయాల నుంచే పనులు కొనసాగిస్తుండటంతో మాదాపూర్, ఐటీకారిడార్ ప్రాంతాల్లో సందడి నెలకొంది. దీంతో ఎటుచూసినా ఉదయం 6 గంటల నుంచే రహదారులు వాహనాలతో నిండిపోతున్నాయి.
ఇవిగో అడ్డంకులు.. గ్రేటర్ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు యూటర్న్లు ఏర్పాటు చేశారు. మెట్రోరైలు ప్రయాణించే 69 కిలోమీటర్ల మెట్రో కారిడార్ పొడవునా, పై వంతెనల కింద భాగంలో పాదచారులు రోడ్డు దాటేందుకు సుమారు 60కు పైగా పెలికాన్ సిగ్నల్స్ నెలకొల్పారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రధాన ప్రాంతాలు, ట్రాఫిక్ కూడళ్ల వద్ద పోలీసులున్నా గమ్యం చేరేందుకు అధిక సమయం వెచ్చించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మార్గాల్లో రహదారులకు ఇరువైపులా నిలిపిన వాహనాలు. అడ్డదారిలో ప్రయాణం, తోపుడుబండ్లు, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం, వ్యాపార దుకాణాలకు వచ్చే కొనుగోలు దారులు ఆరుబయటే వాహనాలు నిలుపుతున్నారు. పోలీసు అధికారులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రహదారుల మరమ్మతులు, డివైడర్లు తదితర ఏర్పాటుపై జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల శాఖలకు ట్రాఫిక్ పోలీసులు నివేదిక అందజేశారు. నెలల గడుస్తున్నా.. అధిక శాతం నివేదికలు ఆయా శాఖల వద్దనే ఉండిపోయాయి
బాబోయ్ ఐటీ కారిడార్.. సైబరాబాద్ పరిధిలో కూకట్పల్లి, జేఎన్టీయూ, మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీకారిడార్ ప్రాంతాల్లో నిత్యం రద్దీ వాతావరణం. తాగునీటి ట్యాంకర్లు, ఇసుకలారీలు, భవన వ్యర్థాలను తరలించే టిప్పర్లు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలో ఇటువంటి వాహనాలపై 6 నెలల వ్యవధిలో సుమారు 72,000, అడ్డదారిలో రాకపోకలు సాగించిన వాహనాలపై 35,000లకు పైగా కేసులు నమోదు చేశారు. ఉల్లంఘనులకు జరిమానాలు విధిస్తున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఐటీ కంపెనీల కార్యాలయాలు ప్రారంభమవటంతో రద్దీ పెరిగిందంటున్నారు పోలీసులు.
వాన నీటితో ఆగమాగం.. నగరంలో వర్షమంటే వాహనదారులు హడలెత్తుతారు. మురుగు, వరదనీరు ఉప్పొంగి రహదారులను జలమయం చేస్తాయి. ప్రయాణించే మార్గాల్లో గుంతలు, మ్యాన్హోళ్లు, కాల్వలు ఎక్కడున్నాయనేది గమనించడం కష్టమవుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో వర్షం కురిసినపుడు 211 ప్రాంతాల్లోని మార్గాల్లో వరదనీరు నిలుస్తుంది. రైల్వే వంతెనలు, ఫ్లై ఓవర్లు, ప్రధాన నాలాలున్న ప్రదేశాల్లో ప్రయాణించడం ప్రాణసంకటమనేది బహిరంగ రహస్యం. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజగిరి, తిరుమలగిరి, పంజాగుట్ట, మారేడుపల్లి, బంజారాహిల్స్, చిక్కడపల్లి, సైఫాబాద్, మీర్చౌక్, ఫలక్నుమా, కాచిగూడ, బహదూర్పుర, మాదాపూర్, గచ్చిబౌలి మియాపూర్ తదితర మార్గాల్లోని 123 చోట్ల అధికంగా వరదనీరు నిలుస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్రాలో ఓటుంది.. తపాలా ఓటును పంపండి
[ 05-05-2024]
నగరంలో ఎన్నికల విధులకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగంపై అయోమయంలో పడ్డారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్కు వరుస కట్టిన వినతులే అందుకు నిదర్శనం. -
టక్కరి దొంగ.. పోలీసులతోనే ఉపాధి పొంది మస్కా కొట్టి చోరీలు
[ 05-05-2024]
అతను దొంగ.. సుమారు వందకుపైగా కేసుల్లో శిక్ష అనుభవించాడు.. మార్పు వచ్చినట్టు నటించాడు.. పోలీసులతోనే స్వయం ఉపాధి పొందాడు.. నిజంగా మార్పు రాలేదు. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
[ 05-05-2024]
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
పజ్జన్న అంటే ప్రజల మనిషని తెలుసు
[ 05-05-2024]
జనంలో ఉండే నేతకే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని, అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే తన గెలుపు ఖరారైందని భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
అన్నీ ఒకేచోట.. ఇబ్బంది లేదిక
[ 05-05-2024]
ఇంధనాలన్నీ ఒకే చోట ఉండేలా కొత్త బంకులు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతుండటంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను నెలకొల్పారు. -
ఒకటిన్నర ఎకరా మించితే.. టీడీఆర్ కష్టం
[ 05-05-2024]
అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేపట్టి టీడీఆర్ (అభివృద్ధి బదలాయింపు హక్కు) ఇచ్చే ప్రక్రియపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. -
అదనంగా 60శాతం ఈవీఎంలు
[ 05-05-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో..ఎన్నికల అధికారులు 60శాతం ఈవీఎంలను అదనంగా తెప్పించారు. -
రాళ్లే బద్దలవుతుంటే.. రికార్డులెంత
[ 05-05-2024]
నగరంలో రోజురోజుకు భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
ఆనాటి బరిలో ఇద్దరే
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్నపుడు పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 40మంది కంటే ఎక్కువగా బరిలో ఉంటున్నారు. కానీ 1957 ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కేవలం ఇద్దరు అభ్యర్థులే బరిలో నిలిచారు. -
మండుటెండల్లో.. ఠండా పానీ
[ 05-05-2024]
చలివేంద్రం అంటే.. రెండు మట్టి కుండలు.. వాటిపైన ప్లాస్టిక్ గ్లాసు గుర్తుకొస్తుంది. తొలిసారి జలమండలి వినూత్న పద్ధతిలో చలివేంద్రాలను తీసుకొచ్చింది. -
ముమ్మరంగా నేతల ప్రచారాలు
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో కూడా అధికారం చేపడుతుందని టీపీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీగౌడ్, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. -
ప్రజాశ్రేయస్సే అధికారులకు పరమావధి కావాలి
[ 05-05-2024]
సివిల్ సర్వీసెస్ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు, దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. -
దేశవ్యాప్తంగా మోదీ నామస్మరణే
[ 05-05-2024]
దేశంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి విజయవంతంగా అమలుచేస్తోందని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
‘అల్లాహ్ మీద ఒట్టు.. జీవితంలో ఎవరిపై జులుం చేయలేదు’
[ 05-05-2024]
మతాల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ సర్కారును ఓడించేందుకు అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని మజ్లిస్ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. -
గెలుపు, ఓటమికి మధ్య నోటా దోబూచులాట!
[ 05-05-2024]
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఓటర్లు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఎన్నికల కమిషన్ కల్పించిన అవకాశం నోటా (నన్ ఆఫ్ ది ఎబౌవ్). -
పోటీ త్రిముఖం.. ప్రచారం బహుముఖం
[ 05-05-2024]
చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ఈసారి పేరుకే 43 మంది బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, భాజపా, భారాసల మధ్యే ‘త్రిముఖ’ పోటీ నెలకొంది. -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. -
కలిసికట్టుగా ‘కొండా’ను గెలిపిద్దాం: భాజపా
[ 05-05-2024]
ప్రతి ఒక్కరు ఐక్యతగా పనిచేసి ఎంపీ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయానికి కృషిచేద్దామని ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ పటేల్ అన్నారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్ర మోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రాణం తీసిన.. ఫొటో సరదా..
[ 05-05-2024]
క్వారీ గుంతలో సరదాగా ఈత కొడుతూ ఫొటో దిగాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్ క్వారీ గుంత వద్ద జరిగింది. -
ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు
[ 05-05-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే కాదు.. అప్పుడప్పుడు పేర్లు కంగారు పెడుతుంటాయి. ఒకే పేరుతో ఇద్దరు పోటీ చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆందోళన ఉంటుంది. -
శంషాబాద్లో చిక్కిన చిరుత అమ్రాబాద్కు తరలింపు
[ 05-05-2024]
శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాప్ బోనులో చిక్కిన మగ చిరుతను శనివారం హైదరాబాద్ నెహ్రూ జూపార్కు అధికారులు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులోకి వదలి పెట్టారు. -
క్రిశాంక్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 05-05-2024]
భారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ మన్నె క్రిశాంక్ను ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ శనివారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.