logo

Sabitha Indra Reddy: మంత్రి కూరగాయలు కొంటే.. మహిళా వ్యాపారి ఆనందమే వేరు

కందుకూరులో శనివారం మార్కెట్‌ సముదాయాన్ని  మంత్రి సబితారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. మార్కెట్‌ లోతిరుగుతూ మహిళలందరితో  కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.

Updated : 24 Sep 2023 09:01 IST

కందుకూరులో కూరగాయలు కొంటున్న సబితారెడ్డి, పక్కన ఆనందంతో నినాదాలు చేస్తున్న మహిళా వ్యాపారి

కందుకూరు: కందుకూరులో శనివారం మార్కెట్‌ సముదాయాన్ని  మంత్రి సబితారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. మార్కెట్‌ లోతిరుగుతూ మహిళలందరితో  కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా అక్కడ కూరగాయలు అమ్మే మహిళతో ఆప్యాయంగా మాట్లాడారు. మంత్రి కూరగాయలు కొనడంతో మహిళా వ్యాపారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తూకం వేయడం మరచి ‘సబితమ్మ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేసింది. తమ కోసం ఇంత మంచి మార్కెట్‌ నిర్మించినందుకు ధన్యవాదాలు తెలిపింది. కాగా, ఆమె భర్త వేరే రాజకీయ పార్టీకి చెందిన కార్మిక విభాగంలో క్రియాశీల పాత్ర పోషిస్తుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు