ప్రాంతీయ రింగ్రోడ్డు గ్రీన్బెల్ట్తో బహుళ ప్రయోజనాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ రింగ్రోడ్(రీజినల్ రింగ్రోడ్) పరిధిలోని ప్రతిపాదిత గ్రీన్బెల్ట్ ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరనున్నాయి.
ప్రభుత్వానికి జేఎన్టీయూ ఆచార్యుడు కె.ఎం.లక్ష్మణ్రావు ప్రతిపాదన
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ రింగ్రోడ్(రీజినల్ రింగ్రోడ్) పరిధిలోని ప్రతిపాదిత గ్రీన్బెల్ట్ ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరనున్నాయి. గ్రీన్బెల్ట్ ద్వారా అందుబాటులోకి వచ్చే 1.10లక్షల ఎకరాల భూముల్లో చెరువులు, ఆక్వాకల్చర్, అగ్రిబిజినెస్ వంటి వ్యాపారాలు చేపట్టవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం లేదా 1.10లక్షల ఎకరాలను ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా పచ్చదనం పెంపొందించి ప్రాంతీయ రింగ్రోడ్డు లోపల సకాలంలో వర్షాలు కురిసేలా చేయవచ్చు. రింగ్రోడ్డుపై రాకపోకలు కొనసాగించే వాహనాలు వెదజల్లే కాలుష్యం ముప్పునుంచి తప్పించుకోవచ్చని జేఎన్టీయూ ఆచార్యులు కె.ఎం.లక్ష్మణ్రావు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వీటిని ప్రభుత్వానికి అందజేసేందుకు వీలుగా తుదిమెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుత ఓఆర్ఆర్ చుట్టూ అంతగా గ్రీన్బెల్ట్ లేకపోవడం, నివాసాలు, పరిశ్రమలు పెరుగుతుండడంతో కాలుష్యం అధికమవుతోందని, ప్రాంతీయ రింగ్రోడ్డు అందుబాటులోకి రాకముందే గ్రీన్బెల్ట్ను సక్రమంగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు రూపొందించామన్నారు.
110 ప్రాంతాల్లో గ్రీన్జోన్లు.. ప్రాంతీయ రింగ్రోడ్డు లోపల వంద ప్రాంతాల్లో గ్రీన్జోన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రతిపాదనల్లో తొలి లక్ష్యం. ప్రభుత్వం గ్రీన్బెల్ట్కు కేటాయించనున్న 1.10లక్షల ఎకరాలను 110 గ్రీన్జోన్లుగా విభజిస్తే.. ప్రతి 3.5 కిలోమీటర్లకు ఒక గ్రీన్జోన్ వస్తుంది. ప్రతి గ్రీన్జోన్లో వెయ్యి ఎకరాల భూమి ఉంటుంది. ఇందులో 200నుంచి 400 ఎకరాల వరకూ చెరువులు నిర్మించడం, 600 ఎకరాల్లో అగ్రిబిజినెస్, పర్యావరణానికి హానికలగని రీతిలో రిసార్ట్స్ను ఏర్పాటు చేయడం ద్వారా వెయ్యి ఎకరాల భూమిని పర్యావరణ ప్రాంతంగా మార్చవచ్చు. రెండు వందల ఎకరాల నుంచి నాలుగు వందల ఎకరాల్లో నిర్మించనున్న చెరువుల ద్వారా ఆక్వాకల్చర్ను ప్రవేశపెడితే.. గ్రీన్జోన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుంది. మిగిలిన 600 ఎకరాల్లో ప్రభుత్వం వద్ద నిధులుంటే సరే.. లేదంటే ప్రముఖ ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు లీజుకివ్వడం ద్వారా ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందనుంది.
లోపల గృహసముదాయాలు.. వెలుపల పరిశ్రమలు.. హైదరాబాద్ రింగ్రోడ్డుకు ప్రాంతీయ రింగ్రోడ్డుకు అనుసంధానం చేయడం ద్వారా బాహ్యవలయ రహదారి వెలుపల కూడా ప్రణాళికాబద్ధమైన శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం చేపట్టేందుకు వీలుంటుంది. ప్రాంతీయ రింగ్రోడ్డు వెలుపల పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమల్లో విధులు నిర్వహించే కార్మికులు, సిబ్బందికి ప్రాంతీయ రింగ్రోడ్డు లోపలే ఇళ్లు, తాత్కాలిక నిర్మాణాలు చేపడితే పనిచేసే ప్రాంతాలకు, నివాసాలకు పది కిలోమీటర్లలోపే దూరం ఉండనుంది. భవిష్యత్తులో హైదరాబాద్ రింగ్రోడ్డు వెలుపల కూడా ఐటీ సంస్థలు, భారీస్థాయిలో గేటెట్ కమ్యూనిటీలు అందుబాటులోకి వస్తే.. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమిత్షా వీడియో మార్ఫింగ్.. దేశ భద్రత అంశం: కిషన్రెడ్డి
[ 29-04-2024]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆడియో, వీడియో మార్ఫింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని భాజపా తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. -
నిన్నటి వరకు సీబీఐ, ఈడీ.. ఇప్పుడు దిల్లీ పోలీసులు: రేవంత్రెడ్డి
[ 29-04-2024]
అమిత్షా వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో తనతోపాటు పలువురికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
[ 29-04-2024]
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
[ 29-04-2024]
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’