మరో వెయ్యిటన్నుల.. వెలుగు
వ్యర్థాలను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్ మరో మైలురాయిని అందుకుంది. నాలుగేళ్ల కిందట జవహర్నగర్లో రోజూ 20మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల డబ్ల్యూటీఈ(వేస్ట్ టు ఎనర్జీ) కేంద్రం అందుబాటులోకి వచ్చింది.
దుండిగల్లో ప్రారంభమైన రెండో డబ్ల్యూటీఈ
రోజుకు 900-1000 టన్నుల చెత్తతో విద్యుత్తు
డిసెంబరుకు సిద్ధం కానున్న మూడో కేంద్రం
ఈనాడు, హైదరాబాద్: వ్యర్థాలను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్ మరో మైలురాయిని అందుకుంది. నాలుగేళ్ల కిందట జవహర్నగర్లో రోజూ 20మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల డబ్ల్యూటీఈ(వేస్ట్ టు ఎనర్జీ) కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దాని పక్కనే 25 మెగావాట్ల డబ్ల్యూటీఈ నిర్మాణ దశలో ఉండగా.. అదే సమయంలో మొదలైన దుండిగల్ కేంద్రం సేవలు తాజాగా మొదలయ్యాయి. దుండిగల్ 10 మెగావాట్ల కేంద్రం అందుబాటులోకి రావడంతో జవహర్నగర్పై ఒత్తిడి తగ్గిందని, అక్కడ పోగయ్యే వ్యర్థాల నుంచి రోజూ వెయ్యి టన్నుల చెత్తను దుండిగల్కు తరలించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
100 మెగావాట్ల దిశగా..
నగరంలో ప్రస్తుతం రెండు డబ్ల్యూటీఈలు పని చేస్తున్నాయి. వాటి ద్వారా రోజూ 2,200 టన్నుల ఆర్డీఎఫ్ (రెఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్) భస్మమవుతోంది. మరో 2,600టన్నుల ఆర్డీఎఫ్ రోజూ జవహర్నగర్లో నిల్వ ఉంటోంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటామని అధికారులు చెబుతున్నారు. జవహర్నగర్ డంపింగ్యార్డులో నిర్మిస్తోన్న రెండో కేంద్రం అందుబాటులోకి వస్తే మూడు ప్లాంట్లలో కలిసి మొత్తం 60మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ప్యారానగర్లో తలపెట్టిన విద్యుదుత్పత్తి కేంద్రం పనులు స్థానికులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా నిలిచాయి. బీబీనగర్, యాచారంలో ప్లాంట్లు ఎప్పుడో సిద్ధమయ్యాయి. గత ప్రభుత్వం ఆయా కేంద్రాలను పక్కనపెట్టిందని, యాజమాన్యాలు ప్రస్తుత సర్కారును సంప్రదిస్తే జీహెచ్ఎంసీతో ఒప్పందం చేసుకుని విద్యుదుత్పత్తిని ప్రారంభించవచ్చని ఇంజినీర్లు గుర్తు చేస్తున్నారు. అదే జరిగితే గ్రేటర్లోని వ్యర్థాలతో 100మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆర్డీఎఫ్ తరలింపు ద్వారా..
డంపింగ్యార్డుకు వచ్చే వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేస్తారు. అందులోంచి.. కాగితం, ప్లాస్టిక్, ఇతర మండే స్వభావమున్న వ్యర్థాలను పక్కకు తీసి వారంపాటు ఎండలో ఉంచుతారు. దాన్నే ఆర్డీఎఫ్ అంటారు. అలా పోగైన ఆర్డీఎఫ్ను రెసిప్రొకేటింగ్ గ్రేట్ అనే సాంకేతిక పద్ధతిలో విద్యుదుత్పత్తికి ఉపయోగిస్తారు. ప్రస్తుతం దుండిగల్ కేంద్రానికి జవహర్నగర్లోని ఆర్డీఎఫ్ను పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో కూకట్పల్లిలోని కైత్లాపూర్, మియాపూర్లోని దీప్తిశ్రీనగర్, ఇతర చెత్తనిల్వ కేంద్రాల్లోనే ఆర్డీఎఫ్ను తయారు చేసి.. అక్కడి నుంచి దుండిగల్ డబ్ల్యూటీఈకి తరలించే చర్చలు జరుగుతున్నాయని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమిత్షా వీడియో మార్ఫింగ్.. దేశ భద్రత అంశం: కిషన్రెడ్డి
[ 29-04-2024]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆడియో, వీడియో మార్ఫింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని భాజపా తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. -
నిన్నటి వరకు సీబీఐ, ఈడీ.. ఇప్పుడు దిల్లీ పోలీసులు: రేవంత్రెడ్డి
[ 29-04-2024]
అమిత్షా వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో తనతోపాటు పలువురికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
[ 29-04-2024]
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
[ 29-04-2024]
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’