indian 2: ‘భారతీయుడు-2’.. మూవీ మీకు నచ్చడానికి వాళ్లే కాదు.. నేనూ ఒక కారణమవుతా: సిద్ధార్థ్
Siddharth: శంకర్, కమల్హాసన్ కాంబినేషన్లో వస్తున్న ‘ఇండియన్2’ గురించి నటుడు సిద్ధార్థ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హైదరాబాద్: భారతీయ సినిమా పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘భారతీయుడు2’ (indian 2) ఒకటి. శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సిద్ధార్థ్ (Siddharth) మాట్లాడారు. తన పాత్రపై స్పందించారు. కమల్హాసన్, శంకర్, ‘భారతీయుడు’ అనే బ్రాండ్ ఇమేజ్ ప్రేక్షకుడిని థియేటర్కు రప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని, కానీ, సినిమా నచ్చడానికి తానూ ఓ కారణమవుతానని సిద్ధార్థ్ ధీమా వ్యక్తం చేశారు.
‘‘చిన్నా’ విజయంతో నాలాంటి నటుడు తమకు కావాలని తెలుగు ప్రేక్షకులు గట్టిగా చెప్పారు. సినిమా విడుదలకు ముందు పరిస్థితులను బట్టి భావోద్వేగానికి గురయ్యా. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులే కాదు, తెలుగు మాట్లాడే ప్రతీ ప్రేక్షకుడు నా చిత్రాన్ని చూడటాన్ని గెలుపుగా భావిస్తా. ‘చిన్నా’ను కొంతమంది థియేటర్లో చూశారు. ఇంకొందరు ఓటీటీలో చూస్తారు. మరి కొందరు టీవీలో చూస్తారు. అప్పటివరకూ ఈ మూవీ గురించి మాట్లాడుతూనే ఉంటాను. అలా థియేటర్కు వచ్చి చూసి వెళ్లిపోయే సినిమా కాదిది. నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. ఒక నటుడిగా ఇంతకంటే ఎక్కువ చేయలేను. చప్పట్ల కోసం ఈ మూవీ చేయలేదు. ‘మీలో ఒక మార్పు కలగాలి. బాధ రావాలి’ అని చేశా. నా నటనను ఆమోదించారు. 20ఏళ్ల నట జీవితంలో ఇప్పటివరకూ చేయని కథతో ఈ మూవీ చేశా. ఒక నిర్మాత ఇలాంటి సినిమా తీయడం ప్రస్తుతం పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. కానీ, నేను చేశా’’
‘‘రాబోయే 15 నెలల్లో నేను నటించిన నాలుగు ఆసక్తికర సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో డిఫరెంట్ జానర్ మూవీలు ఉంటాయి. ఒక సినిమాకూ మరొక దానికి సంబంధం ఉండదు. పదేళ్ల తర్వాత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన మూవీ చేశా. మరో నెలరోజుల్లో ఆ వివరాలు ప్రకటిస్తా. దాని తర్వాత ‘ఇండియన్2’ వస్తుంది. కమల్హాసన్-శంకర్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో అందరూ చూడటానికి వస్తారు. అంతేకాదు, ‘భారతీయుడు’ అనే ట్యాగ్ కూడా ప్రేక్షకుడిని థియేటర్కు రప్పిస్తుంది. అయితే, సినిమా మీకు నచ్చడానికి నేనూ ఒక కారణమవుతానని గర్వంగా చెబుతున్నా. ఇది నా జీవితంలో మర్చిపోలేని మూవీ’’ అని సిద్ధార్థ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు.