బ్రేకింగ్

breaking
25 Apr 2024 | 12:38 IST

రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: అన్నింటా జీఎస్టీ విధించి కేంద్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని పదేళ్ల భాజపా పాలనపై గాంధీభవన్‌లో నిర్వహించిన ఛార్జ్‌షీట్‌ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ.113 లక్షల కోట్లు అప్పులు చేసింది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రహదారులను కార్పొరేట్లకు కట్టబెట్టారు. రూ.60 లక్షల కోట్ల ఆస్తులను రూ.6 లక్షల కోట్లకు తెగనమ్మారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోంది. రాజ్యాంగంపై ఆఖరి యుద్ధాన్ని ఆ పార్టీ ప్రకటించింది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు