బ్రేకింగ్

breaking
04 May 2024 | 13:21 IST

కేసీఆర్‌.. మీరు ఏ సంకీర్ణంలో చేరతారు?: సీఎం రేవంత్‌

కొత్తగూడెం: కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్‌ చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌.. భాజపాలో చేరతారని మేం మొదటి నుంచి చెబుతున్నాం. కేంద్రంలో భాజపా చేసిన అన్ని చట్టాలకు భారాస మద్దతిచ్చింది. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 9 లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు