బ్రేకింగ్

breaking
04 May 2024 | 13:41 IST

ఇది దాడులు, దోపిడీల ప్రభుత్వం: పవన్‌

గుడివాడ: జగన్‌ ప్రభుత్వం డబుల్‌ డి ప్రభుత్వం అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. గుడివాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. మన సభ కోసం స్థలమిచ్చిన రైతుల ఇళ్లు కూల్చారు. 30 కేసులుండి ఐదేళ్ల నుంచి జగన్‌ బెయిల్‌పై ఉన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుతో ఆస్తులు కాజేయాలని చూస్తున్నారు’’ అని పవన్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు