ఎయిరిండియా స్పెషల్‌ ఆఫర్‌.. దేశీయ విమాన టికెట్లపై డిస్కౌంట్‌

రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశీయ విమాన టికెట్లపై ఎయిరిండియా డిస్కౌంట్ ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది.

Published : 21 Jan 2023 15:43 IST

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) విమాన టికెట్ల ధరలపై రాయితీని ప్రకటించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దేశీయ ప్రయాణాలకు లిమిటెడ్‌ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిరిండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. ఎంపిక చేసిన 49 రూట్లలో ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.

నేటి (జనవరి 21) నుంచి జనవరి 23 మధ్య టికెట్లను బుక్ చేసుకునే వారికి ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుందని ఎయిరిండియా తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య ప్రయాణించొచ్చని పేర్కొంది. ఎయిరిండియా సిటీ ఆఫీస్‌, ఎయిర్‌పోర్ట్‌ ఆఫీస్‌, వెబ్‌సైట్స్‌, మెబైల్‌ యాప్స్‌, ట్రావెల్ ఏజన్స్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. టికెట్‌ ధరలు రూ.1705 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఎంపిక చేసిన రూట్లలో డిస్కౌంట్‌ ధరలు ఇవేనంటూ కొన్నింటి ధరలను ఎయిరిండియా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని