Adani group: నష్టాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. అమెరికా దర్యాప్తు ఎఫెక్ట్
Adani group: అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. దానిపై అమెరికా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని వస్తున్న వార్తలే ఇందుకు కారణం.
Adani group | ముంబయి: అదానీ గ్రూప్ స్టాక్స్ (Adani group) మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లంచం ఆరోపణల విషయంలో ఆ గ్రూప్పై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిందన్న వార్తల నేపథ్యంలో వాటి విలువ కుంగింది. దీనికి తోడు అదానీ పవర్కు సుప్రీంకోర్టులో చుక్కెదురవడం గ్రూప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. గ్రూప్లోని అన్ని కంపెనీల షేర్లూ ఆరంభంలో భారీ నష్టాలు ఎదుర్కొనగా.. సాయంత్రం స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
ఈ గ్రూప్లో ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ ఉదయం 4 శాతం నష్టపోగా.. తర్వాత కోలుకొని 0.71 శాతం నష్టంతో ముగిసింది. అదానీ పోర్ట్స్ అండ్ ఎనకమిక్ జోన్ లిమిటెడ్ ఓ దశలో 3 శాతం మేర కుంగగా.. చివరికి 1.24 శాతం నష్టంతో ముగిసింది. బీఎస్ఈలో అదానీ టోటల్ గ్యాస్ 4.35 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.40 శాతం, అంబుజా సిమెంట్స్ 2.81 శాతం, ఏసీసీ 2.43 శాతం చొప్పున నష్టపోయాయి. ఎన్డీటీవీ 2.08 శాతం, అదానీ విల్మర్ 2.05 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 1.67 చొప్పున నష్టపోయాయి. ఈ గ్రూప్నకు చెందిన డాలర్ బాండ్ల విలువ సైతం తగ్గింది.
అదానీ గ్రూప్ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
భారత్లో ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో అనుకూలంగా వ్యవహరించేలా అదానీ గ్రూప్ లేదా గౌతమ్ అదానీ సహా కొందరు వ్యక్తులు ఎవరైనా లంచం ఇవ్వజూపారా? లేదా? అనేది తెలుసుకోవడానికి అమెరికా దర్యాప్తు చేపట్టిందని బ్లూమ్బెర్గ్ తన కథనంలో పేర్కొంది. ఆ దేశ అటార్నీ జనరల్ ఆఫీస్, జస్టిస్ డిపార్ట్మెంట్కు చెందిన ఫ్రాడ్ యూనిట్ ఈ విచారణ జరపుతున్నట్లు తెలిపింది. దేశీయ ఎనర్జీ కంపెనీ అజ్యూర్ పవర్ గ్లోబల్పైనా ఈ దర్యాప్తు మొదలైనట్లు పేర్కొంది. అమెరికాలో అదానీ గ్రూప్ ట్రేడ్ కానప్పటికీ.. అమెరికన్ల పెట్టుబడులు ఆ గ్రూప్లో ఉన్న నేపథ్యంలో అక్కడి సంస్థలు దర్యాప్తు జరపొచ్చు. అయితే, దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారమూ లేదని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది.
- మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన జైపూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ నుంచి పేమెంట్ సర్ఛార్జి కింద రూ.1300 కోట్లు కోరుతూ అదానీ పవర్ రాజస్థాన్ లిమిటెడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను తిరస్కరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
ఓలా క్యాబ్స్ సీఈఓ పదవికి హేమంత్ భక్షి రాజీనామా చేశారు. సీఈఓ పదవి చేపట్టిన 4 నెలలకే బాధ్యతల నుంచి వైదొలిగారు. -
సౌత్ ఇండియన్ బ్యాంకుతో జట్టు కట్టిన టాటా మోటార్స్
వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్.. సౌత్ ఇండియన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. -
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
దేశంలో డిజిటల్ లావాదేవీలతో పాటు నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది. సీఎంఎస్ సంస్థ వెలువరించిన తాజా నివేదిక ఈ పరిస్థితిని తెలియజేస్తోంది. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్