Smartphones: 18 శాతం మార్కెట్ వాటాతో 2023లో శాంసంగ్ టాప్!
Smartphones: సీఎంఆర్ నివేదిక ప్రకారం.. 2023లో వార్షిక ప్రాతిపదికన స్మార్ట్ఫోన్ మార్కెట్ 19 శాతం వృద్ధి నమోదుచేసింది. 5జీ స్మార్ట్ఫోన్ సరఫరాలు 122 శాతం వృద్ధితో 65 శాతానికి చేరాయి.
దిల్లీ: భారత స్మార్ట్ఫోన్ విపణి (Indian Smartphone Market)లో దక్షిణ కొరియా ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ (Samsung) అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీకి 2023లో 18 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు మార్కెట్ పరిశోధన సంస్థ ‘సైబర్మీడియా రీసెర్చ్’ (సీఎంఆర్) నివేదిక వెల్లడించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మాత్రం చైనా కంపెనీ షావోమీ అగ్రస్థానంలో నిలిచింది.
సీఎంఆర్ నివేదిక ప్రకారం.. 2023లో వార్షిక ప్రాతిపదికన స్మార్ట్ఫోన్ మార్కెట్ 19 శాతం వృద్ధి నమోదుచేసింది. 5జీ స్మార్ట్ఫోన్ సరఫరాలు 122 శాతం వృద్ధితో 65 శాతానికి చేరాయి. 2023 ఏడాదికి సంబంధించి మార్కెట్ షేర్ పరంగా శాంసంగ్ (Samsung) అగ్రస్థానంలో నిలవగా, చైనా కంపెనీ వివో 16 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. 5జీ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో సైతం 23 శాతం మార్కెట్ షేర్తో శాంసంగ్ టాప్లో ఉంది. వివో 15 శాతం, వన్ప్లస్ 13 శాతం వాటాతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
డిసెంబర్ త్రైమాసికంలో మొత్తంగా స్మార్ట్ఫోన్ల సరఫరాలో రికార్డు స్థాయిలో 29 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో షావోమీ 19 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా, శాంసంగ్ (18.9శాతం), వివో (16 శాతం), రియల్మీ (12 శాతం), ఒప్పో (8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ 6 శాతం వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీ విక్రయాల్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల వాటానే 50 శాతానికి పైగా ఉంది. ప్రీమియం సెగ్మెంట్లో రూ.25,000 పైన ఉన్న స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లలో 71 శాతం వృద్ధి నమోదైంది.
రూ.7,000- రూ.25,000 ధరల శ్రేణి 5జీ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు 58 శాతానికి పెరిగినట్లు సీఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ అనలిస్ట్ శిప్రా సిన్హా వెల్లడించారు. 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 47 శాతంగా ఉంది. రూ.50,000 పైన ధర పలికే సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో 65 శాతం వృద్ధి నమోదైంది. ప్రముఖ టెలికాం సంస్థ ‘జియో’ సహకారంతో 4జీ ఫీచర్ ఫోన్లు సైతం మార్కెట్లో గణనీయ వాటాను కలిగి ఉన్నట్లు సిన్హా వెల్లడించారు. 4జీ ఫీచర్ ఫోన్ మార్కెట్ 52 శాతం వృద్ధి నమోదు చేయగా, 2జీ ఫోన్ల అమ్మకాలు 12 శాతం పడిపోయాయి. ఫీచర్ ఫోన్ల విక్రయాల్లో ‘జియో’ 38 శాతం మార్కెట్ షేర్తో తొలిస్థానంలో ఉంది. 23 శాతంతో ఐటెల్ రెండు, 15 శాతంతో లావా మూడో స్థానంలో ఉన్నాయి.
షావోమీ సబ్ బ్రాండ్ పోకో షిప్మెంట్స్ పరంగా 148 శాతం వృద్ధి నమోదు చేయగా, వివో 5జీ షిప్మెంట్స్ రికార్డు స్థాయిలో 300 శాతం పెరిగాయి. 2024కు సంబంధించి 5జీ ఫోన్ల డిమాండ్ దృష్ట్యా 7-8 శాతం వృద్ధి ఉండొచ్చని సీఎంఆర్ అంచనా వేసింది. ఈ ఏడాది 5జీ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 40 శాతానికి పెరగొచ్చని, 4జీ ఫోన్ల అమ్మకాలు 10 శాతం పుంజుకోవచ్చని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!