Bill Gates: ‘పనికంటే జీవితం ఎంతో గొప్పది’ బిల్ గేట్స్
Bill Gates: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ సెలవుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారాంతపు సెలవులపై తనకున్న అభిప్రాయాన్ని తన బ్లాగ్ పోస్టులో పంచుకున్నారు.
Bill Gates | ఇంటర్నెట్డెస్క్: మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) వీకెండ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థలో పనిచేసే తొలినాళ్లలో వారాంతాల్లో సెలవులు తీసుకోవడం, పనిచేయకుండా ఉండటం ఆయనకు నచ్చేది కాదని పేర్కొన్నారు. అయితే తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాగ్లో రాసుకొచ్చారు.
‘నేను నా పిల్లల వయసులో ఉన్నప్పుడు సెలవులపై అంత ఆసక్తి ఉండేది కాదు. ముఖ్యంగా తండ్రిని అయ్యాక నా అభిప్రాయం మారింది. పని కంటే జీవితం విలువైందని గ్రహించా’ అంటూ బిల్ గేట్స్ తన బ్లాగ్ పోస్టు ద్వారా తెలిపారు. తన పిల్లల ఎదుగుదల చూడటం ఎందో ఆనందంగా ఉందన్నారు. గోల్కీపర్స్ ఈవెంట్లో చిన్న కుమార్తె ఫోబ్తో తాను వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాదిలో జరిగిన ముఖ్యాంశాలలో ఇది కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు.
పూర్వ విద్యార్థుల దాతృత్వం.. ‘ఐఐటీ బాంబే’కు రూ.57 కోట్లు అందజేత
పని- జీవిత సమతుల్యత గురించి ఈ ప్రపంచ కుబేరుడు మాట్లాడటం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో అరిజోనా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ‘జీవితాన్ని ఆస్వాదించటం కూడా మరచిపోయేలా కష్టపడొద్దు. పనికంటే జీవితం ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే మీరు అంత కాలం వేచి ఉండకండి. మీ బంధాలను బలపరుచుకోవడానికి, విజయాన్ని పంచుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత సమయం వెచ్చించండి’ అని ఆయన విద్యార్థులకు సూచించారు.
ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మాటలకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్న సమయంలో గేట్స్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!