Changes from Dec 1st: శ్రీవారి బ్రేక్ దర్శన వేళల్లో మార్పు, నగదు విత్డ్రాకు ఓటీపీ.. రేపటి నుంచే..!
ఆర్థిక విషయాలకు సంబంధించి డిసెంబర్ 1 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. నగదు విత్డ్రాకు ఓటీపీ, ద్విచక్ర వాహన ధరలు వంటివి అందులో ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఒకటో తేదీ వచ్చిదంటే చాలు.. రెంట్, కరెంట్ బిల్లు కట్టాలి. స్కూల్ ఫీజులు, పాల బిల్లులూ షరా మామూలే. జీతం అందిందన్న ఆనందాన్ని అందుకునేలోపే.. ‘మేమున్నాం’ అని ఇవన్నీ గుర్తుచేస్తుంటాయి. వీటికి తోడు ప్రతి నెలా కొత్తగా వచ్చే మార్పులు ‘ఫ్యామిలీ మ్యాన్’పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంటాయి. అలా డిసెంబర్ 1 నుంచి కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అందులో కొన్ని నేరుగా మన జేబును ప్రభావితం చేసేవైతే.. మరికొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అవేంటో చూసేయండి..
ఓటీపీ ఉండాల్సిందే..
ప్రభుత్వరంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఏటీఎంలో (ATM) క్యాష్ విత్డ్రా నిబంధనలు మార్చింది. డెబిట్ కార్డు వినియోగించి ఇకపై నగదు తీయాలంటే మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. మోసాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకే ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. కాబట్టి ఏటీఎంకు వెళ్లేవారు డెబిట్ కార్డుతో పాటు మొబైల్ను వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు.
శ్రీవారి బ్రేక్ దర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు తితిదే తెలిపింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది.
హీరో మోటోకార్ప్
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ.1500 వరకు పెంచనుంది. కొత్త ధరలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. మోడల్, విక్రయించే ప్రాంతాన్ని బట్టి ధర పెంపు పరిమాణం మారొచ్చని పేర్కొంది. తయారీ వ్యయాల భారం అధికం కావడంతో, వాహన ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది.
డిజిటల్ రుపీ రేపటి నుంచే
రిటైల్ డిజిటల్ రూపాయి (ఇRs-ఆర్) ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1 నుంచి ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. తొలుత 4 నగరాల్లో ప్రారంభించి, తదుపరి మరో 9 నగరాల్లో ఈ సేవలను విస్తరిస్తారు. ప్రస్తుతానికి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లు ఈ లావాదేవీల్లో పాల్గొంటాయి. డిజిటల్ రూపాయిని టోకు విభాగంలో నవంబరు 1న ఆర్బీఐ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బండ బరువు దిగేనా? పెరిగేనా?
కొన్ని నెలలుగా ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పూ ఉండడం లేదు. నవంబర్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.115 మేర తగ్గించాయి. డిసెంబర్ 1న మరోసారి రేట్లు సవరించనున్నాయి. ఈ సారైనా సిలిండర్ ధరను తగ్గిస్తారా? మళ్లీ పెంచుతారా? అనేది చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’