Disney India: రిలయన్స్ చేతికే డిస్నీ.. త్వరలో అధికారిక ప్రకటన?
Disney- Reliance: డిస్నీ ఇండియా వ్యాపారం రిలయన్స్ చేతికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
Disney- Reliance | ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన ఎంటర్టైన్మెంట్ సంస్థ డిస్నీ.. తన ఇండియా వ్యాపార విక్రయ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ఆసక్తి-స్థోమత కలిగిన పలువురు పెట్టుబడిదార్లతో ఆ సంస్థ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో రిలయన్స్ సహా అదానీ గ్రూప్, సన్టీవీతోనూ చర్చలు జరిపింది. అయితే, డిస్నీ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కొనుగోలు చేయబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో ఈ లావాదేవీ జరిగే అవకాశం ఉందని ‘బ్లూమ్బెర్గ్’ పేర్కొంది.
డిస్నీ స్టార్ వ్యాపారంలో నియంత్రిత వాటాను రిలయన్స్కు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 బిలియన్ డాలర్లకు విక్రయించాలని డిస్నీ భావిస్తుండగా.. రిలయన్స్ 7, 8 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సుముఖంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. రిలయన్స్ మీడియా యూనిట్లు సైతం ఇందులో విలీనం అయ్యే అవకాశం ఉందని తెలిపాయి. కొంత నగదు, షేర్ల బదిలీ రూపంలో ఈ డీల్ జరిగే అవకాశం ఉందని సమాచారం.
రూ.15 వేల పెట్టుబడి.. రూ.1.2 కోట్ల ఆర్జన.. చాట్జీపీటీ సాయంతో!
విలీనం అనంతరం కూడా డిస్నీ ఇండియాకు మైనారిటీ వాటా ఉంటుందని సమాచారం. అయితే, ఈ డీల్ విలువ విషయంలో తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. దీనిపై డిస్నీ స్పందించకపోగా.. రిలయన్స్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కులను రిలయన్స్కు చెందిన వయాకామ్18 మీడియా దక్కించుకోవడంతో డిస్నీ+ హాట్స్టార్కు ఇటీవల చందాదారులు భారీగా తగ్గారు. దీనికి తోడు హెచ్బీఓ కంటెంట్ను సైతం రిలయన్స్ దక్కించుకోవడంతో మరో గట్టి దెబ్బ తగిలింది. దీంతో డిస్నీస్టార్ నంబర్లను పెంచుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే విక్రయానికి ముందుకు రావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాభంలో 37% వృద్ధి
బ్యాటరీల సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం. -
సగానికి తగ్గిన ఐఓసీ లాభం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. -
సంక్షిప్తవార్తలు (8)
సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతి తీసుకుంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్లో ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ఉండనుంది. -
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ రిస్క్ తీసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జెఫ్ బెజోస్ నుంచి నేర్చుకున్న విలువైన పాఠం గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో పంచుకున్నారు.