E-rupee: చలామణీలో ₹130 కోట్ల డిజిటల్ రూపాయిలు: నిర్మలా సీతారామన్
దేశంలో ఇ-రూపీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. మూడు నెలలుగా వీటి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 130 కోట్లకు పైగా డిజిటల్ రూపాయలు చలామణీలో ఉన్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
దిల్లీ: చట్టబద్ధ కరెన్సీకి అదనంగా తీసుకొస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (ఇ-రూపీ) ప్రయోగాలు దేశంలో కొనసాగుతున్నాయి. రిటైల్, టోకు విభాగాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న ఈ కరెన్సీ (E-rupee) విలువ ప్రస్తుతం రూ.130 కోట్లపైనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) తెలిపారు. ఫిబ్రవరి 28 నాటికి రిటైల్ డిజిటల్ రూపాయలు (e?-R) రూ.4.14 కోట్లు, హోల్సేల్ (e?-W) రూ.126.27 కోట్లు చొప్పున చలామణీలో ఉన్నాయని లోక్సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపాయిని గతేడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న హోల్సేల్ విభాగంలో, డిసెంబర్ 1 నుంచి రిటైల్ విభాగంలో దీని ప్రయోగాలు ప్రారంభించింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులు కలిపి మొత్తం 9 బ్యాంకులు హోల్సేల్ పైలట్ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.
బ్యాంకులు అందించే డిజిటల్ వ్యాలెట్ల ద్వారా డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరపొచ్చని కేంద్రమంత్రి చెప్పారు. టీ దుకాణాదారులు, పండ్ల విక్రేతలు, వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులతో పాటు రిటైల్ ఔట్లెట్లు, పెట్రోల్ పంపులు కూడా ఈ ప్రయోగాల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. కొన్ని ఆన్లైన్ వ్యాపార సంస్థలు సైతం ఉన్నాయని చెప్పారు. ప్రయోగాల్లో భాగంగా సాంకేతిక పనితీరు, డిజైన్ గురించి తెలుసుకుంటున్నామని, వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఇ-రూపీని దశలవారీగా విస్తరించే అంశంపై దృష్టి సారించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
చలామణీలో ఉన్న నగదు ₹31 లక్షల కోట్లు
2014 నాటికి ఆర్థిక వ్యవస్థలో చలామణీలో ఉన్న నగదు విలువ రూ.13 లక్షల కోట్లుగా కాగా.. ఆ విలువ 2022 నాటికి రూ.31.33 లక్షల కోట్లకు చేరిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు వెల్లడించారు. 2014లో జీడీపీలో 11.6 శాతంగా ఉన్న నగదు విలువ (నోట్లు, నాణేలు కలిపి) వాటా 2022 మార్చి 25 నాటికి 13.7 శాతానికి పెరిగిందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా 2016 మార్చి నాటికి రూ.16.63 లక్షల కోట్లుగా ఉన్న నగదు విలువ.. 2017 మార్చి నాటికి రూ.13.35 లక్షల కోట్లకు పడిపోయింది. ఆ మరుసటి ఏడాది నుంచి మళ్లీ పెరుగుతూ వచ్చింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నల్లధనం నిరోధించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నకిలీ నోట్ల అరికట్టేందుకే పెద్ద నోట్ల రద్దు చేపట్టినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్ను తీసుకురానుంది. -
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
Go Digit: ఆన్లైన్ వేదికగా ఇన్సూరెన్స్ సేవలందించే స్టార్టప్ సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీఓ ఈనెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. -
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
Train Ticket: రైల్వే టికెట్లకు సంబంధించిన రిఫండ్ల సొమ్ము ఇప్పుడ వేగంగా జమ అవుతోంది.ఒక రోజులోనే ఆయా ఖాతాల్లో పడుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. -
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. -
కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్
బైజూస్ బ్రాండ్ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన కోర్సు సబ్స్క్రిప్షన్ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. -
బ్యాంకింగ్ రంగంలో...
ఇండెక్స్ తరగతికి చెందిన ఓపెన్ ఎండెడ్ పథకాన్ని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. యాక్సిస్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అనే ఈ కొత్త పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం