IPO: 4 ఐపీఓలు రాబోతున్నాయ్
ఈ వారం స్టాక్ మార్కెట్లో తొలి పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓల) సందడి ఉండబోతోంది. 4 కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ.1,100 కోట్ల నిధుల్ని సమీకరించబోతున్నాయి.
రూ.1,100 కోట్ల సమీకరణ లక్ష్యంతో..
దిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లో తొలి పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓల) సందడి ఉండబోతోంది. 4 కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ.1,100 కోట్ల నిధుల్ని సమీకరించబోతున్నాయి. జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్, న్యూ స్వాన్ మల్టీటెక్, ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్, ఐఎఫ్బీ ఫైనాన్స్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
- జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్: కొత్త ఏడాదిలో మెయిన్బోర్డ్ విభాగంలో వస్తున్న తొలి ఐపీఓ ఇదే. ఈనెల 9-11 తేదీల్లో ఈ ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.315-331గా నిర్ణయించారు. రూ.1,000 కోట్ల నిధుల్ని ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సమీకరించబోతోంది. పూర్తిగా తాజా షేర్లు జారీ చేయనున్నారు. కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (సీఎన్సీ) మెషీన్ల తయారీ సంస్థ అయిన జ్యోతి సీఎన్సీ, తాజా ఐపీఓ ద్వారా సమీకరించబోయే మొత్తంలో రూ.475 కోట్లు అప్పులు తీర్చేందుకు, రూ.360 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ కోసం, మిగతాది ఇతర కార్పొరేట్ అవసరాల కోసం కేటాయించనుంది.
- న్యూ స్వాన్ మల్టీటెక్: రూ.33.11 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఐపీఓ 11-15 తేదీల మధ్య ఉండనుంది. ఒక్కో షేరుకు ఇష్యూ ధరను రూ.62-66 గా నిర్ణయించారు. పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారా ఐపీఓ ఉండనుంది. కంపెనీ సేకరించిన నిధుల్లో కొంత భాగం లుధియానాలోని తయారీ యూనిట్ మెషినరీ కోసం, మిగతాది రుణాల చెల్లింపు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుంది.
- ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్: మోనోక్రిస్టలిన్, పాలీక్రిస్టలిన్ సోలార్ మాడ్యూళ్లు తయారు చేసే ఈ సంస్థ, రూ.28 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. ఈ నెల 11-15 తేదీల్లో ఇష్యూ ఉండనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.51-54ను నిర్ణయించింది. పూర్తిగా తాజా షేర్లు జారీ చేయనున్నారు. మూలధన వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనుంది.
- ఐబీఎల్ ఫైనాన్స్: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) విభాగంలో ఈ ఏడాది రాబోతున్న తొలి ఐపీఓ ఇదే. ఈనెల 9-11 తేదీల మధ్య ఇష్యూ ఉండనుంది. రూ.33.4 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. ఒక్కో షేరు ధరను రూ.51గా నిర్ణయించింది. 65.5 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. భవిష్యత్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఐపీఓ నిధులను వినియోగించనుంది.
- కౌసల్య లాజిస్టిక్స్ షేరు నమోదు నేడు: కౌసల్య లాజిస్టిక్స్ షేరు, ఎన్ఎస్ఈ ఎమర్జ్ మార్కెట్లో నేడు నమోదు కానుంది.
రిలయన్స్-బ్రూక్ఫీల్డ్ డేటా కేంద్రం ప్రారంభం వచ్చే వారమే
చెన్నై: బ్రూక్ఫీల్డ్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చెన్నైలో నెలకొల్పిన డేటా కేంద్రాన్ని వచ్చే వారం ప్రారంభించనున్నట్లు ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. బ్రూక్ఫీల్డ్, అమెరికా సంస్థ డిజిటల్ రియాల్టీ భాగస్వాములుగా ఉన్న సంయుక్త సంస్థలో భాగస్వామిగా చేరేందుకు ఆర్ఐఎల్ గతేడాది జులైలో రూ.378 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఈ మూడు కంపెనీలకు సంయుక్త సంస్థలో తలో 33% వాటాలు ఉన్నాయి. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నుద్దేశించి, దృశ్యమాధ్యమ విధానంలో ప్రసంగించిన అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సదస్సును తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ సహా పలువురు పాల్గొన్నారు.
మొబైల్ ఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాల కోసం తమిళనాడు ప్రభుత్వంతో రూ.12,082 కోట్ల అవగాహనా ఒప్పందాన్ని టాటా ఎలక్ట్రానిక్స్ కుదుర్చుకుంది. జేఎస్డబ్ల్యూ రెన్యూవబుల్ రూ.12,000 కోట్లు, టీవీఎస్ గ్రూప్ రూ.5,000 కోట్లు, మిత్సుబిషి ఎలక్ట్రిక్ రూ.6,180 కోట్లు, పెగాట్రాన్ రూ.1,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. -
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!