ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ వస్త్రాలపై 75% తగ్గింపు

భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ తన విస్తృత వస్త్రశ్రేణిపై 75 శాతం వరకు తగ్గింపును ప్రకటిస్తోంది. పురుషులు, మహిళలు, చిన్నారుల విభాగాల్లో అధునాతన, సంప్రదాయ వస్త్రాలపై వీటిని అందిస్తోంది. అదనంగా ‘ఇండిపెండెన్స్‌ గోల్డెన్‌ సెలబ్రేషన్స్‌’లో భాగంగా ప్రతీ గ్రాము పసిడి

Published : 14 Aug 2022 03:05 IST

హైదరాబాద్‌: భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ తన విస్తృత వస్త్రశ్రేణిపై 75 శాతం వరకు తగ్గింపును ప్రకటిస్తోంది. పురుషులు, మహిళలు, చిన్నారుల విభాగాల్లో అధునాతన, సంప్రదాయ వస్త్రాలపై వీటిని అందిస్తోంది. అదనంగా ‘ఇండిపెండెన్స్‌ గోల్డెన్‌ సెలబ్రేషన్స్‌’లో భాగంగా ప్రతీ గ్రాము పసిడి విక్రయ ధరపై రూ.100ను తగ్గిస్తోంది. వెండి సామగ్రిపై తరుగు, మజూరీ ఛార్జీలను మినహాయిస్తోంది. ఆగస్టు 14, 15 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.


సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌  ‘హర్‌ ఘర్‌ ఫ్రీడమ్‌ సేల్‌’

హైదరాబాద్‌: భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ‘హర్‌ ఘర్‌ ఫ్రీడమ్‌ సేల్‌’ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్‌లకు చెందిన బ్రాండెడ్‌ మెన్స్‌వేర్‌, ఉమెన్స్‌ వేర్‌, కిడ్స్‌వేర్‌లపై 75 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. నగలు, బంగారు ఆభరణాలకు ఫ్రీడమ్‌ గోల్డెన్‌ ఆఫర్‌ వర్తిస్తుందని, ఇందులో భాగంగా ప్రతి గ్రాము బంగారం కొనుగోలుపై ఒక గ్రాము వెండి ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది.. స్టోన్‌ ఛార్జీలు, అన్ని రకాల రత్నాభరణాలపై 20 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 14, 15 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని