బేర్ పంజా
బేర్ ధాటికి వరుసగా నాలుగో రోజూ సూచీలు విలవిలలాడాయి. అంతర్జాతీయంగా మాంద్యం సంభవించవచ్చనే భయాలు పెరగడంతో, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలగా.. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సోమవారం అదే బాటలో నడిచాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల
4 రోజుల్లో రూ.13.30 లక్షల కోట్లు ఆవిరి
డాలర్తో పోలిస్తే రూపాయి 81.67కు
బేర్ ధాటికి వరుసగా నాలుగో రోజూ సూచీలు విలవిలలాడాయి. అంతర్జాతీయంగా మాంద్యం సంభవించవచ్చనే భయాలు పెరగడంతో, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలగా.. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సోమవారం అదే బాటలో నడిచాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల కారణంగా డాలర్తో పోలిస్తే రూపాయి తాజా జీవనకాల కనిష్ఠానికి చేరడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. సోమవారం మరో 58 పైసలు కోల్పోయిన రూపాయి రికార్డు కనిష్ఠమైన 81.67కు పడిపోయింది. బ్యారెల్ ముడిచమురు ధర 0.75 శాతం తగ్గి 85.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు నీరసంగానే ట్రేడయ్యాయి. గత 8 ట్రేడింగ్ రోజుల్లో విదేశీ మదుపర్లు బిలియన్ డాలర్ల (రూ.8000 కోట్లకు పైగా) షేర్లను అమ్మేశారు. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
* సూచీల వరుస నష్టాల నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో రూ.13.30 లక్షల కోట్లు తగ్గి రూ.270.11 లక్షల కోట్లకు చేరింది.
* సెన్సెక్స్ ఉదయం 57,525.03 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో 57,038.24 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. అనంతరం కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆఖరి గంటన్నరలో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో 953.70 పాయింట్ల నష్టంతో 57,145.22 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 311.05 పాయింట్లు క్షీణించి 17,016.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,978.30- 17,196.40 పాయింట్ల మధ్య కదలాడింది.
* హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ షేరు అరంగేట్రం అదిరింది. ఇష్యూ ధర రూ.330తో పోలిస్తే బీఎస్ఈలో 34.54% లాభంతో రూ.444 వద్ద షేరు నమోదైంది. ఇంట్రాడేలో 59.87% దూసుకెళ్లి రూ.527.60 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 47.24% లాభంతో రూ.485.90 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,423.83 కోట్లుగా నమోదైంది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 24 కుదేలయ్యాయి. మారుతీ 5.49%, టాటా స్టీల్ 4.22%, ఐటీసీ 3.96%, యాక్సిస్ బ్యాంక్ 3.40%, ఎన్టీపీసీ 3.35%, బజాజ్ ఫైనాన్స్ 3.34%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.87%, ఎం అండ్ ఎం 2.83%, బజాజ్ ఫిన్సర్వ్ 2.60%, రిలయన్స్ 2.54% మేర డీలాపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ 1.31%, హెచ్సీఎల్ టెక్ 1.28%, ఇన్ఫోసిస్ 1.06%, అల్ట్రాటెక్ 0.50% రాణించాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. స్థిరాస్తి 4.29%, వాహన 3.86%, యుటిలిటీస్ 3.72%, విద్యుత్ 3.71%, కమొడిటీస్ 3.32%, ఇంధన 3.17%, చమురు-గ్యాస్ 3.10%, టెలికాం 2.97% పడ్డాయి. బీఎస్ఈలో 2980 షేర్లు నష్టాల్లో ముగియగా, 611 స్క్రిప్లు లాభపడ్డాయి. 116 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
అనిల్ అంబానీకి ఉపశమనం: నల్ల ధన నిరోధక చట్టం కింద నమోదైన పన్ను ఎగవేత కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఉపశమనం లభించింది. ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులపై నవంబరు 17 వరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని బాంబే హైకోర్టు ఆదేశించింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.814 కోట్లకు పైగా వెల్లడించని మొత్తంపై, అనిల్ అంబానీ రూ.420 కోట్ల పన్ను ఎగవేశారని ఐటీ విభాగం ఆరోపిస్తోంది. అనిల్ అంబానీ ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేశారని, భారత పన్ను అధికారులకు విదేశీ బ్యాంక్ ఖాతా వివరాలను కావాలనే వెల్లడించలేదని అభియోగాలు మోపింది.
* 2022-23లో కొత్తగా 100 తెరలను ప్రారంభించేందుకు రూ.350 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు పీవీఆర్ సినిమాస్ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి ఐనాక్స్ లీజర్తో విలీనం పూర్తి కావొచ్చని పీవీఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ గౌతమ్ దత్తా పేర్కొన్నారు.
* తమ ప్లాట్ఫామ్పై ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ (ఈజీఆర్)లను తీసుకొచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తుది అనుమతి లభించినట్లు బీఎస్ఈ వెల్లడించింది. చిన్న మదుపర్లు, వాణిజ్యసంస్థలు, దిగుమతిదార్లు, బ్యాంకులు, రిఫైనరీ సంస్థలు, బులియన్ ట్రేడర్లు, ఆభరణాల తయారీదార్లు, రిటైల్ వ్యాపారులు కూడా వీటిని ట్రేడ్ చేసేందుకు త్వరలో అవకాశం కల్పిస్తామని తెలిపింది.
* ఉత్తర ప్రదేశ్, హరియాణల్లో 33.3 లక్షల ఐఓటీ ఆధారిత స్మార్ట్మీటర్లను ఇన్స్టాల్ చేయనున్నట్ల వొడాఫోన్ ఐడియా, ఈఈఎస్ఎల్ తెలిపాయి. ఇప్పటికే ఈ కంపెనీలు 16.7 లక్షల స్మార్ట్మీటర్లను ఏర్పాటు చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్ను తీసుకురానుంది. -
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
Go Digit: ఆన్లైన్ వేదికగా ఇన్సూరెన్స్ సేవలందించే స్టార్టప్ సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీఓ ఈనెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. -
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
Train Ticket: రైల్వే టికెట్లకు సంబంధించిన రిఫండ్ల సొమ్ము ఇప్పుడ వేగంగా జమ అవుతోంది.ఒక రోజులోనే ఆయా ఖాతాల్లో పడుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. -
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. -
కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్
బైజూస్ బ్రాండ్ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన కోర్సు సబ్స్క్రిప్షన్ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. -
బ్యాంకింగ్ రంగంలో...
ఇండెక్స్ తరగతికి చెందిన ఓపెన్ ఎండెడ్ పథకాన్ని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. యాక్సిస్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అనే ఈ కొత్త పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం