2026 నుంచి గ్యాస్ ధరలపై స్వేచ్ఛ
సహజవాయువు (గ్యాస్) ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన కిరీట్ పారిఖ్ కమిటీ తన నివేదికను సమర్పించింది. దిగ్గజ క్షేత్రాల నుంచే చేసే ఉత్పత్తులకు కనీస, గరిష్ఠ (సీలింగ్) ధరలను సిఫారసు చేసింది.
దిగ్గజ క్షేత్రాలకు మాత్రం కనీస, గరిష్ఠ ధరలు
కిరీట్ పారిఖ్ కమిటీ సిఫారసులు
దిల్లీ: సహజవాయువు (గ్యాస్) ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన కిరీట్ పారిఖ్ కమిటీ తన నివేదికను సమర్పించింది. దిగ్గజ క్షేత్రాల నుంచే చేసే ఉత్పత్తులకు కనీస, గరిష్ఠ (సీలింగ్) ధరలను సిఫారసు చేసింది. సంక్లిష్ట క్షేత్రాల నుంచి గ్యాస్ను వెలికితీసే సంస్థలకు మాత్రం 2026 జనవరి 1 నుంచి ధరలపై స్వేచ్ఛ ఇవ్వాలని పేర్కొంది. దేశంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో మూడింట రెండొంతులను ఉత్పత్తి చేసే దిగ్గజ క్షేత్రాల నుంచి వచ్చే సహజ వాయువుకు స్థిర ధరల శ్రేణి ఉండాలని ప్రతిపాదించింది. దీని వల్ల తయారీదార్లు ధరలను అంచనా వేసుకోగలుగుతారు. సీఎన్జీ, గొట్టపు వంట గ్యాస్ ధరలూ అదుపులో ఉంటాయని భావిస్తోంది. గతేడాది కాలంలో ఈ ధరలు 70 శాతం పెరిగాయి.
కనీసం 4 డాలర్లు.. పరిమితి 6.5 డాలర్లు.. ఏటా 0.5 డాలర్ల పెంపు: ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్లలో గ్యాస్ ధరలకు బదులుగా, దిగుమతి అయ్యే ముడి చమురు ధరలతో అనుసంధానం చేయాలి. వీటికి కనీస, గరిష్ఠ(సీలింగ్) పరిమితిని నిర్దేశించాలని పారిఖ్ తెలిపారు.
దీని ప్రకారం..ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ తయారీదార్లకు దిగుమతి చమురుకు అనుసంధానంగా ఉండే ధరను చెల్లిస్తారు. కనీస ధర ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్కు 4 డాలర్లుగా; గరిష్ఠ పరిమితి ధర 6.5 డాలర్లుగా ఉండాలి. గ్యాస్ మిగులు ఉండే దేశాల ధరలతో అనుసంధానం చేసి, లెక్కవేసిన ప్రస్తుత రేటు 8.57 డాలర్లుగా ఉంది. అయితే గరిష్ఠ ధరను ఏటా 0.5 డాలర్ల మేర పెంచాలని పారిఖ్ స్పష్టం చేశారు. 2027 జనవరి 1 నుంచి మార్కెట్ ఆధారిత రేట్లను నిర్ణయించాలని సలహా ఇచ్చామన్నారు.
వీటికి పరిమితి తొలగింపు: రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ పీఎల్సీ అభివృద్ధి చేస్తున్న సంక్లిష్ట క్షేత్రాలకు మాత్రం ధరల విధానాన్ని మార్చలేదు. ప్రస్తుతం ఈ క్షేత్రాలకు సీలింగ్ ధర 12.46 డాలర్లుగా ఉంది. మూడేళ్ల పాటు ప్రభుత్వం నిర్ణయించే ఈ గరిష్ఠ ధరను కొనసాగించాలని, 2026 జనవరి 1 నుంచి ఈ పరిమితిని ఎత్తివేయాలని తెలిపింది.
జీఎస్టీలోకి తీసుకురండి: జీఎస్టీలోకి సహజ వాయువును తీసుకు రావాలని కమిటీ సలహా ఇచ్చింది. ‘ఈ విషయంపై రాష్ట్రాలకు ఆందోళనలు ఉన్నాయి. దీనిపై ఏకాభిప్రాయాన్ని సాధించే దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామ’ని ఆయన అన్నారు. ఇందువల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పేతే, నష్ట పరిహారం ఇచ్చేందుకు ప్రస్తుతం ఇతర రంగాలకున్న తరహాలోనే ఈ రంగంలోనూ ఒక వ్యవస్థను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్ను తీసుకురానుంది. -
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
Go Digit: ఆన్లైన్ వేదికగా ఇన్సూరెన్స్ సేవలందించే స్టార్టప్ సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీఓ ఈనెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. -
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
Train Ticket: రైల్వే టికెట్లకు సంబంధించిన రిఫండ్ల సొమ్ము ఇప్పుడ వేగంగా జమ అవుతోంది.ఒక రోజులోనే ఆయా ఖాతాల్లో పడుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. -
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. -
కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్
బైజూస్ బ్రాండ్ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన కోర్సు సబ్స్క్రిప్షన్ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. -
బ్యాంకింగ్ రంగంలో...
ఇండెక్స్ తరగతికి చెందిన ఓపెన్ ఎండెడ్ పథకాన్ని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. యాక్సిస్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అనే ఈ కొత్త పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!