‘మయన్మార్’ నుంచే పసిడి స్మగ్లింగ్
దేశంలో 2021లో 797.3 మెట్రిక్ టన్నుల బంగారం వినియోగం జరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం విడుదల చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) స్మగ్లింగ్ నివేదిక వెల్లడించింది.
2021-22లో 833 కిలోల పట్టివేత
దేశంలోకి 525.82 మెట్రిక్ టన్నుల దిగుమతి
797.3 మెట్రిక్ టన్నుల వినియోగం
డీఆర్ఐ నివేదికలో వెల్లడి
దేశంలో 2021లో 797.3 మెట్రిక్ టన్నుల బంగారం వినియోగం జరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం విడుదల చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) స్మగ్లింగ్ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో రూ.1,91,000 కోట్ల విలువైన 525.82 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు తెలిపింది. ‘బంగారం వినియోగంలో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానాన్ని భారత్ ఆక్రమించింది. బంగారం ఉత్పత్తిలో భారత్ వాటా పెద్దగా లేనందున స్థానిక వినియోగం కోసం పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. గత అయిదేళ్లలో భారత్కు దిగుమతి అయిన బంగారంలో 30% గోల్డ్డోర్ బార్స్ ఉన్నాయి. ఇదే సమయంలో డీఆర్ఐ 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ మార్గాల నుంచి భారత్లోకి అక్రమంగా రవాణా చేస్తున్న 833 కేజీల బంగారాన్ని పట్టుకొంది. భారత్లోకి స్మగ్లింగ్ అవుతున్న బంగారంలో అత్యధికం స్విట్జర్లాండ్దే అయినా చారిత్రకంగా దేశంలోకి బంగారం స్మగ్లింగ్ మధ్య ప్రాచ్య దేశాల నుంచి విమాన మార్గాల్లో జరుగుతోంది. అయితే దేశీయ వ్యవస్థలు గట్టి నిఘా ఉంచడం వల్ల స్మగ్లర్లు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నార’ని తన నివేదికలో తెలిపింది. అందులోని ముఖ్యాంశాలు..
చైనా నుంచి మయన్మార్.. అక్కడి నుంచి మిజోరం..మణిపూర్
అంతర్జాతీయ విమానాశ్రయల్లో నిఘా పెరగడంతో స్మగ్లర్లు పశ్చిమాసియా నుంచి వచ్చే విమాన మార్గాలను వదిలి చైనా-మయన్మార్ ద్వారా భారత్కు భూ మార్గంలో స్మగ్లింగ్ చేయడంపై దృష్టి సారించారు. మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, చైనాలతో భారత్ సరిహద్దులను పంచుకోవడంవల్ల స్మగ్లర్లు ఇప్పుడు భూమార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మయన్మార్ అత్యంత ప్రధాన స్మగ్లింగ్ కేంద్రంగా మారింది. భారత్కు అక్రమంగా వచ్చే బంగారంలో 37% మయన్మార్, 7% బంగ్లాదేశ్, 20% మధ్యప్రాచ్యం, 36% ఇతర దేశాల నుంచి వస్తోంది. గత ఏడాది దొరికిన దొంగ సరుకులో 73% మొత్తం మయన్మార్, బంగ్లాదేశ్లనుంచి వస్తున్నదేనని తేలింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం స్మగ్లింగ్ బంగారాన్ని చైనా నుంచి మయన్మార్కు చేరుస్తున్నారు. తర్వాత మయన్మార్లోని మ్యూస్ అనే ప్రాంతం నుంచి మండలే-కలేవా రూట్లో భారత్-మయన్మార్ సరిహద్దుకు చేరుస్తున్నారు. ఇక్కడ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు ఉండటం స్మగ్లర్లకు అనుకూలిస్తోంది. మయన్మార్ నుంచి మ్యూస్-మండలే-కలేవా-టెడిం-జొకవతార్, మ్యూస్-మండలే-కలెవా-టము-నాంఫలాంగ్-మోరే అనే రెండు మార్గాలనుంచి బంగారం భారత్లోకి తరలుతోంది. ఇక్కడి నుంచి భారత్లోని మిజోరం, మణిపుర్లోకి వస్తోంది.
ఆ వెసులుబాటుతో వ్యూహం..
భారత్, మయన్మార్ దేశాల మధ్య సామాజిక సంబంధాల మెరుగుకోసం రెండుదేశాల ప్రజలు ఎలాంటి పాస్పోర్ట్, వీసా లేకుండా 16 కిలోమీటర్లపాటు అటు, ఇటు రాకపోకలు సాగించవచ్చు. దీంతో స్మగ్లర్లు ఈ రెండుదేశాల సరిహద్దుల్లో ఉన్న ప్రజలను ఎంచుకొని తమ వ్యూహాలకు పదును పెడుతోంది. భారత్లో బంగారం అత్యధిక వినియోగం జరుగుతున్నందున ఇక్కడ చట్టబద్ధమైన, స్మగ్లింగ్ బంగారం వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ భారతీయ కుటుంబాలు ఎలాంటి పత్రాలు లేకుండా తమకు పరిచయం ఉన్న దుకాణాల నుంచి బంగారాన్ని కొనుగోలు చేయడం బ్లాక్ మార్కెట్కు ఊతమిస్తోంది.
పేస్టులు, ల్యాప్టాప్ల ద్వారానూ స్మగ్లింగ్
భారతీయ కుటుంబాలవద్ద 25,000 టన్నులకుపైగా బంగారం ఉంది. అందుకే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అత్యధిక బంగారం ఉన్న దేశంగా భారత్కు గుర్తింపునిచ్చింది. ఇక్కడ బంగారానికి ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకొని లాభాలు దండుకోవడానికి బంగారం సిండికేట్లు, స్మగ్లర్లు విభిన్నరకాల పద్ధతులు అనుసరిస్తున్నాయి. మానవ శరీరం, యంత్రాలు, తుక్కులో బంగారాన్ని తరలిస్తున్నాయి. విమానాల్లో ప్రయాణించేవారు అత్యధికమంది మలద్వారం, బ్యాగేజ్, వివిధ వస్తువుల్లో దాచుకొని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలుచని ఫాయిల్స్, సూట్కేస్ బీడింగ్స్, పేస్ట్, పౌడర్ రూపంలో పట్టుకొస్తున్నారు. భూమార్గంలో అయితే ట్రక్కులు, కార్లు, ప్యాసింజర్ బస్సులు, మోటార్సైకిళ్ల ద్వారా తరలిస్తున్నారు. అలాగే ఇంధన ట్యాంకులు, డ్యాష్బోర్డులు, ఏసీ ఫిల్టర్లు, సీట్లు, వీల్ యాక్సిల్, ఛాసిస్, స్పేర్టైర్లలోనూ దొంగ రవాణా చేస్తున్నారు. అలాగే ల్యాప్ట్యాప్లు, ట్యాబ్లు, ట్రాలీ సూట్కేసుల ద్వారానూ తరలిస్తున్నారు. అక్రమ సొమ్ము తరలింపు (మనీలాండరింగ్)నకు బంగారం ఆకర్షణీయమార్గంగా కనిపిస్తోంది. దాని ధరలు స్థిరంగా ఉండటం వల్ల అక్రమంగా సొమ్ము సంపాదించిన నేరగాళ్లు తొలుత ఇందులో డబ్బుపెట్టి తర్వాత దాన్ని సులభంగా ఇతర ఆస్తుల్లోకి మార్చుకుంటున్నారు. మైనింగ్ నుంచి రిటైలింగ్ వరకు చట్టవ్యతిరేకమార్గంలో సంపాదించిన మొత్తాన్ని బంగారంలో పెడుతున్నారు. అంతర్జాతీయంగా దీని ధరల హెచ్చుతగ్గులు వీరికి లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇలా గడించిన సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికీ వీలవుతోంది’’ అని డీఆర్ఐ నివేదిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక