ఐబీఎం.. ఎస్ఏపీ.. కోన్.. డౌ
అంతర్జాతీయంగా ఉద్యోగాల కోతను ప్రకటిస్తున్న కంపెనీల్లో మరో 4 చేరాయి. సాంకేతికత దిగ్గజాలైన ఐబీఎం, ఎస్ఏపీతో పాటు ఎలివేటర్ల తయారీ సంస్థ కోన్, మెటీరియల్స్ సైన్స్ కంపెనీ డౌ సంస్థల తాజా ప్రకటన చూస్తే, ప్రపంచవ్యాప్తంగా మరో 10,000 ఉద్యోగాల్లో కోత పడుతోంది.
మరో 4 కంపెనీల్లో 10,000 ఉద్యోగాల కోత
వ్యయ నియంత్రణలో భాగంగానే
అంతర్జాతీయంగా ఉద్యోగాల కోతను ప్రకటిస్తున్న కంపెనీల్లో మరో 4 చేరాయి. సాంకేతికత దిగ్గజాలైన ఐబీఎం, ఎస్ఏపీతో పాటు ఎలివేటర్ల తయారీ సంస్థ కోన్, మెటీరియల్స్ సైన్స్ కంపెనీ డౌ సంస్థల తాజా ప్రకటన చూస్తే, ప్రపంచవ్యాప్తంగా మరో 10,000 ఉద్యోగాల్లో కోత పడుతోంది. అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి డౌ మినహా మిగిలిన సంస్థలు మెరుగైన ఆర్థిక గణాంకాలనే నమోదు చేసినా, వ్యయాలు తగ్గించుకునేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా లాంటి దిగ్గజాలు వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐబీఎం.. 3900
ఐబీఎం కార్పొరేషన్ తమ సిబ్బంది సంఖ్యలో 1.5 శాతానికి సమానమైన 3,900 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబరు త్రైమాసిక ఆదాయం అంచనాలకు మించి నమోదైనా, 2022 వార్షిక నగదు నిల్వల లక్ష్యమైన 10 బిలియన్ డాలర్లను అందుకోకపోవడమే ఉద్యోగాల కోతకు కారణమని రాయిటర్స్ వార్తా కథనం వెల్లడించింది. 2022కు సంస్థ వద్ద నగదు నిల్వలు 9.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిర్వహణ మూలధన అవసరాల కోసం కంపెనీ వ్యయాలు, అంచనాలను మించడమూ మరో కారణం. అయితే పరిశోధన- అభివృద్ధి విభాగాల్లో నియామకాలు కొనసాగుతాయని ఐబీఎం ముఖ్య ఆర్థిక అధికారి జేమ్స్ కవనాఘ్ వెల్లడించారు. తాజా ఉద్యోగ కోతలు కిండ్రైల్ వ్యాపారం, ఏఐ విభాగంలో భాగమైన వాట్సన్ హెల్త్ వ్యాపార విభజనకు సంబంధించినవని ఐబీఎం తెలిపింది.
ఎస్ఏపీ.. 3000
వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు క్లౌడ్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి సారించాలనే ప్రణాళికలో భాగంగా 3,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఎస్ఏపీ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి ఉన్న సిబ్బంది సంఖ్యలో ఇది 2.5 శాతానికి సమానం. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న జర్మనీలో 200 మందినే తొలగిస్తోంది. అక్టోబరు- డిసెంబరులో క్లౌడ్ వ్యాపార ఆదాయంలో 30% వృద్ధి లభించినా, ఉద్యోగాల తొలగింపు నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.
కోన్.. 1000
ప్రపంచవ్యాప్తంగా 1,000 మందిని తొలగిస్తున్నట్లు ఎలివేటర్ల తయారీ సంస్థ కోన్ వెల్లడించింది. ఇందువల్ల ఏడాదికి 100 మిలియన్ యూరోల మేర ఆదా అవుతుందని కంపెనీ భావిస్తోంది. 2022 చివరినాటికి కోన్లో 63,277 మంది పనిచేస్తున్నారు. తాజా తొలగింపుల సంఖ్య ఇందులో 1.6 శాతానికి సమానం. సంస్థ ప్రధాన కేంద్రమైన ఫిన్లాండ్లో 150 మందిని తొలగిస్తోంది. అక్టోబరు- డిసెంబరులో కోన్ ఫలితాలు అంచనాలను మించాయి. ప్రధాన విపణి అయిన చైనాలోనూ వ్యాపారం బాగుంటుందనే సంస్థ ఆశిస్తున్నా, ఉద్యోగ కోతలు ప్రకటించింది.
డౌ.. 2000
ఈ ఏడాదిలో వ్యయాలను 100 కోట్ల డాలర్ల మేర తగ్గించుకోవాలని భావిస్తున్న అమెరికాకు చెందిన మెటీరియల్స్ సైన్స్ కంపెనీ డౌ.. ప్రపంచవ్యాప్తంగా 2000 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. కంపెనీలో మొత్తం సిబ్బంది 37,800 మంది ఉన్నారు. అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఈ సంస్థ ప్రకటించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం