సంక్షిప్త వార్తలు (9)
జాతీయ మానవ వనరుల అభివృద్ధి (ఎన్హెచ్ఆర్డీ) సంస్థ, 25వ వార్షిక సమావేశం ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు హైదరాబాద్లో జరగనుంది. ఈ సదస్సును తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు.
ఎన్హెచ్ఆర్డీ సదస్సు 2 నుంచి
ఈనాడు, హైదరాబాద్: జాతీయ మానవ వనరుల అభివృద్ధి (ఎన్హెచ్ఆర్డీ) సంస్థ, 25వ వార్షిక సమావేశం ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు హైదరాబాద్లో జరగనుంది. ఈ సదస్సును తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు. ‘ఆర్థికాభివృద్ధి- భవిష్యత్తు ముఖచిత్రం’ అంశంపై ఆయన ప్రధానోపన్యాసం చేస్తారు. మానవ వనరుల విభాగానికి చెందిన వెయ్యి మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. మానవ వనరులకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారని ఎన్హెచ్ఆర్డీ హైదరాబాద్ ఛాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ విపుల్ సింగ్ పేర్కొన్నారు.
మారుతీ దేశీయ విక్రయాలు 2.5 కోట్లు
దిల్లీ: దేశీయంగా మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ఇప్పటివరకు విక్రయించిన మొత్తం వాహనాల సంఖ్య 2.5 కోట్లకు చేరిందని జపాన్కు చెందిన వాహన దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ సోమవారం వెల్లడించింది. 2023 జనవరి 9న ఈ ఘనతను ఎంఎస్ఐ సాధించిందని పేర్కొంది.
అలుఫ్లూరైడ్కు రూ.4.65 కోట్ల లాభం
ఈనాడు, హైదరాబాద్: రసాయనాల తయారీ కంపెనీ అలుఫ్లూరైడ్ లిమిటెడ్ డిసెంబరు త్రైమాసికానికి రూ. 38.49 కోట్ల ఆదాయంపై రూ.4.65 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.29 కోట్లు, నికరలాభం రూ.1.89 కోట్లే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు ఆదాయం రూ.101.71 కోట్లు, నికరలాభం రూ.9.71 కోట్లు నమోదయ్యాయి. 2021-22 మొదటి 9 నెలలకు రూ.59.56 కోట్ల ఆదాయంపై, నికరలాభం రూ.2.89 కోట్లు, ఈపీఎస్ రూ.3.70 ఉన్నాయి.
453% పెరిగిన మోల్డ్టెక్ టెక్నాలజీస్ లాభం
ఈనాడు, హైదరాబాద్: డిజైనింగ్ సేవల సంస్థ మోల్డ్టెక్ టెక్నాలజీస్ డిసెంబరు త్రైమాసికానికి రూ.40.72 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని, రూ.9.20 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాల ఆదాయం రూ.23.83 కోట్లు, నికరలాభం రూ.1.66 కోట్లతో పోల్చితే ఈసారి లాభం 453%, ఆదాయం 71% పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు రూ.104.39 కోట్ల ఆదాయంపై రూ.19.15 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సివిల్, మెకానికల్ విభాగాలు బాగా రాణించడం వల్లే మెరుగైన లాభాదాయాలు నమోదు చేయగలిగామని కంపెనీ వెల్లడించింది. మెకానికల్ విభాగాన్ని అమెరికాకు విస్తరిస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్లో క్యూబిక్ ట్రాన్స్పోర్టేషన్
ఈనాడు, హైదరాబాద్: రవాణా రంగ సంస్థలకు ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్, ఆన్లైన్ చెల్లింపుల సేవలు అందించే అమెరికా సంస్థ క్యూబిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ మనదేశంలో కార్యకలాపాలను విస్తరించేందుకు హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. కొద్ది నెలల్లో 150 మంది కొత్త ఉద్యోగులను నియమించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు జెఫ్రీ లావింగర్ వివరించారు. బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నిర్వహిస్తున్న రవాణా సేవల ప్రాజెక్టుల తరహాలో ఇక్కడా చేపడతామన్నారు.బస్సులు, రైళ్లు, మెట్రో, పార్కింగ్, ఫైర్ కలెక్షన్.. వంటి పలు రకాల సేవలకు ఒకే కార్డుతో చెల్లింపులు చేసే ‘వన్ అకౌంట్ టికెటింగ్’ సేవలను అందిస్తామని అన్నారు.
2500 నియామకాలు: ఫిజిక్స్వాలా
దిల్లీ: ప్రస్తుత త్రైమాసికంలో వేర్వేరు విభాగాల్లో 2,500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఎడ్టెక్ యూనికార్న్ సంస్థ ఫిజిక్స్వాలా ప్రకటించింది. బైజూస్, అన్అకాడమీ, వేదాంతు, ఫ్రంట్రో వంటి పోటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో, ఈ కంపెనీ నియామకాల ప్రకటన చేయడం విశేషం. ప్రస్తుతం సంస్థలో 6,500 మంది ఉద్యోగులున్నారు. వ్యాపార-డేటా విశ్లేషకులు, కౌన్సిలర్లు, ఆపరేషన్స్ మేనేజర్లు, బ్యాచ్ మేనేజర్లు, టీచర్లను కొత్తగా నియమించుకోనున్నట్లు తెలిపింది.
ఫిలిప్స్లో మరో 6,000 ఉద్యోగాల కోత
ది హేగ్: ఫిలిప్స్ కంపెనీ మరోసారి ఉద్యోగ కోతల్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 6,000 మందిని రెండేళ్లలో తొలగించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తాజాగా పేర్కొంది. కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన స్లీప్ అప్నియా రెస్పిరేటర్లలో లోపాల కారణంగా 2022లో భారీ నష్టాలు (1.6 బిలియన్ యూరోలు-సుమారు రూ.14,000 కోట్లు) తలెత్తడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మూడు నెలల్లోనే సంస్థ నుంచి ఉద్యోగ కోతల ప్రకటన వెలువడటం ఇది రెండోసారి.
గెయిల్ లాభంలో 90% క్షీణత
దిల్లీ: గెయిల్ ఇండియా డిసెంబరు త్రైమాసికంలో రూ.397.59 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.3,800.09 కోట్లతో పోలిస్తే ఇది 90 శాతం తక్కువ. పెట్రోరసాయనాల వ్యాపారంలో రూ.349 కోట్ల నష్టం రావడం వల్లే, ఈసారి లాభం భారీగా తగ్గింది. సహజ వాయువు మార్కెటింగ్ విభాగం కూడా నష్టాలే చవిచూసింది. ప్రధాన విభాగమైన ట్రాన్స్మిషన్ వ్యాపారంలో కూడా పన్నుకు ముందు లాభం సగానికి తగ్గింది. కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ.26,175.60 కోట్ల నుంచి రూ.35,939.96 కోట్లకు చేరింది. స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.3,287 కోట్ల నుంచి 92 శాతం తగ్గి రూ.245 కోట్లకు పరిమితమైంది.
రెనో, నిస్సాన్ పరస్పర వాటాలు ఇక సమానం
టోక్యో: జపాన్-ఫ్రెంచ్ వాహన దిగ్గజ సంస్థలైన నిస్సాన్, రెనో తమ సంయుక్త సంస్థలో పరస్పర వాటాలను సమాన స్థాయికి (15%) చేర్చాయి. తమ మధ్య ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాయి. నిస్సాన్ మోటార్లో రెనో గ్రూప్నకు 43.4 శాతం వాటా ఉండగా.. ఒక ఫ్రెంచి ట్రస్టుకు 28.4 శాతం వాటాకు సమానమైన షేర్లను బదిలీ చేయనుంది. అపుడు నిస్సాన్లో 15 శాతం వాటాను మాత్రమే రెనో కలిగి ఉంటుందని ఇరు కంపెనీలు తెలిపాయి. నిస్సాన్కు ఈ సంస్థలో అంతే వాటా ఉంది. ఇరు కంపెనీలకు వాటాల్లో ఉన్న అంతరం వల్ల రెనోతో పోలిస్తే నిస్సాన్ ఎక్కువ లాభదాయకతను నమోదు చేసిన అనంతరం, ఒకలాంటి సంఘర్షణ చోటు చేసుకోవడంతో, తాజా నిర్ణయం తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. -
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!