చిన్నబోయిన షేర్లు
సాధారణంగా చిన్న షేర్లపై చిన్న మదుపర్లు లేదా దేశీయ మదుపర్లే దృష్టి సారిస్తుంటారు. గణాంకాలను చూస్తుంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వారికి నష్టాలే మిగిలినట్లు కనిపిస్తోంది.
2022-23లో స్మాల్ క్యాప్ సూచీ 6% క్షీణత
మిడ్ క్యాప్ సూచీ, సెన్సెక్స్ 1% తగ్గాయ్
సాధారణంగా చిన్న షేర్లపై చిన్న మదుపర్లు లేదా దేశీయ మదుపర్లే దృష్టి సారిస్తుంటారు. గణాంకాలను చూస్తుంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వారికి నష్టాలే మిగిలినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చిన్న షేర్లు డీలాపడటంతో బీఎస్ఈలో స్మాల్ క్యాప్ సూచీ 5.73% లేదా 1,616.93 పాయింట్ల మేర కోల్పోయింది. ఇదే సమయంలో మిడ్ క్యాప్ సూచీ 270.29 పాయింట్లు (1.12 శాతం) నష్టపోగా, బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 608.42 పాయింట్లు (1.03 శాతం) మాత్రమే తగ్గింది.
* మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. స్థానిక మదుపర్లు ఎక్కువగా చిన్న షేర్లపై, విదేశీ మదుపర్లు ఎక్కువగా బ్లూచిప్ లేదా పెద్ద షేర్లపై ఆసక్తి చూపిస్తుంటారు. అంటే ఈసారి ఎక్కువగా నష్టపోయింది దేశీయ మదుపర్లే అని తెలుస్తోంది.
* అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలంగా మారాయి.
* 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో నిఫ్టీ, సెన్సెక్స్లు రెండంకెల ప్రతిఫలాన్ని అందించాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో డీలా పడ్డాయి. సాధారణంగా రెండేళ్లు వరుసగా మార్కెట్లు లాభాల్లో ఉంటే, మూడో ఏడాది లాభాల స్వీకరణ జరుగుతుందనేది ఒక అంచనా.
వడ్డీ రేట్లు పెరిగితే..
ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతూ పోతున్నాయి. దీంతో చిన్న మదుపర్లు రిస్కుతో కూడిన స్టాక్ మార్కెట్ కంటే కచ్చితమైన రాబడిని అందించే ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు మొగ్గు చూపారు. అందుకే చిన్న షేర్లకు గిరాకీ తగ్గిందని ఈక్విటీ అడ్వైజర్ మార్కెట్స్మోజో ముఖ్య పెట్టుబడుల అధికారి సునీల్ దమానియా వెల్లడించారు. వడ్డీ రేట్లు పెరుగుతుంటే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు తగ్గడాన్ని గతంలోనూ గమనించామని ఆయన పేర్కొన్నారు.
2020-21, 2021-22లో లాభాల పంట
2021-22లో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 7,566.32 పాయింట్లు (36.64%) పెరిగింది. మిడ్ క్యాప్ సూచీ 3,926.66 పాయింట్లు (19.45%) లాభపడింది. సెన్సెక్స్ కూడా 9,059.36 పాయింట్లు (18.29%) రాణించింది.
* 2020-21లో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 11,040.41 పాయింట్లు (114.89 శాతం), మిడ్ క్యాప్ సూచీ 9,611.38 పాయింట్లు (90.93%) మేర పెరిగాయి. బీఎస్ఈలో 30 షేర్ల సెన్సెక్స్ సూచీ 20,040.66 పాయింట్లు (68%) మేర లాభపడింది.
అదానీ గ్రూప్ కంపెనీలు డీలా
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్.. అదానీ గ్రూప్ కంపెనీలపై జనవరి 24న విడుదల చేసిన నివేదిక కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఆ గ్రూప్నకు చెందిన 10 నమోదిత కంపెనీలు 140 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి. చిన్న మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెట్టుబడులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలోనని ఇప్పటికీ తర్జన భర్జనలు పడుతున్నారు. ఎక్కువగా చిన్న షేర్ల వైపు మొగ్గు చూపే వీరు కొనుగోళ్లు తగ్గించడం కూడా స్మాల్ క్యాప్ సూచీపై ప్రభావం చూపించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్లు పని చేయలేదు
శ్రీరామ నవమి సందర్భంగా గురువారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఫారెక్స్, మనీ మార్కెట్లు పని చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. -
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!