ఐటీపై అనిశ్చితి మేఘాలు
ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఐటీ కంపెనీల్లో ఇప్పటివరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి.
ప్రస్తుత ఆర్థికంలో వృద్ధి మందకొడిగానే
వాయిదా పడుతున్న వేతన పెంపులు
మొదటి త్రైమాసికంలో మెప్పించిన ఆర్డర్లు
ముంబయి: ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఐటీ కంపెనీల్లో ఇప్పటివరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. ఇందులో టీసీఎస్ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించితే, మిగిలినవి మోస్తరు గణాంకాలనే వెల్లడించాయి. మరో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహా మరిన్ని కంపెనీలు త్వరలో ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం అంతా వృద్ధిలో మందగమనం కొనసాగొచ్చని, ఖాతాదారులు తమ ప్రాజెక్టుల వ్యయాలపై ఆచితూచి వ్యవహరించడం లేదా వాయిదా వేయడం కొనసాగొచ్చని ఫలితాల వెల్లడి సందర్భంగా ఐటీ కంపెనీల నిర్వాహకులే ప్రకటించారు. అయితే కంపెనీలు భారీ ఆర్డర్లను జూన్ త్రైమాసికంలో పొందడం, అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివస్తున్నందున, ఐటీ వ్యయాలను ఖాతాదారులు పెంచుతారనే భావనతో శుక్రవారం ఐటీ షేర్లు బాగా లాభపడ్డాయి. డిజిటలీకరణ ద్వారా ఖర్చులు తగ్గించుకోవడానికి కార్పొరేట్లు చూస్తుండటం వల్లే, మన ఐటీ కంపెనీలకు ఆర్డర్లు వృద్ధి చెందినట్లు అంచనా వేస్తున్నారు.
రూ.1.06 లక్షల కోట్ల ఆర్డర్లు
ఏప్రిల్-జూన్లో టీసీఎస్, హెచ్సీఎల్, విప్రో మొత్తంగా 13 బి.డాలర్ల(దాదాపు రూ.1.06 లక్షల కోట్లు) విలువైన ఆర్డర్లు దక్కించుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇవి 14% అధికం. ఈ కారణంగానే రెండు రోజుల్లో నిఫ్టీ ఐటీ సూచీ 6 శాతానికి పైగా పరుగులు తీసింది. 2020 సెప్టెంబరు తర్వాత ఈ సూచీకి అతిపెద్ద లాభం ఇదే కావడం విశేషం. అంతమాత్రాన ఐటీ కంపెనీల కష్టకాలం పూర్తిగా ముగిసినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు.
సవాళ్లు ఇవే
భవిష్యత్ అంచనాలపై ఐటీ కంపెనీల యాజమాన్యాలు, బ్రోకరేజీ సంస్థలు సానుకూల వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. అయితే సమీపకాలంలో పరిస్థితులు మెరుగుపడొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గెలుచుకున్న ఆర్డర్లను, ఆదాయంగా మలచడంలో ఆలస్యమవుతోందని తెలిపాయి. మెరుగైన ఆర్డరు పుస్తకం ఉన్నప్పటికీ.. ఆదాయ వృద్ధి గణనీయంగా లేదని టీసీఎస్ ఎండీ, సీఈఓ కృతివాసన్ పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్లో టీసీఎస్ దాదాపు 10 బి.డాలర్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. త్రైమాసికానికి 7-9 బి.డాలర్ల అంచనాలతో పోలిస్తే ఇవి అధికమే. ప్రతికూల పరిస్థితుల్లోనూ కంపెనీలు ఈ స్థాయి ఆర్డర్లు గెలుచుకోవడం సానుకూల పరిణామమనే చెప్పుకోవచ్చు.
ద్వితీయార్థంపై ఆందోళన
2023-24 ద్వితీయార్థంలో గిరాకీ పుంజుకోవడంపై టీసీఎస్, విప్రో యాజమాన్యాలు స్పష్టత ఇవ్వలేదు. గిరాకీపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని విప్రో తెలిపింది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మెరుగ్గా ఉంటుందని ఇప్పుడే అంచనాకు రాలేమని టీసీఎస్ వెల్లడించింది. ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధించడం కష్టతరమేనని స్పష్టం చేసింది. వృద్ధిపై హెచ్సీఎల్ టెక్ సానుకూలంగా ఉంది. ఏప్రిల్-జూన్లో ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నా, 6-8% వార్షిక వృద్ధి అంచనాలను కొనసాగించింది. ఇది అంత సులభం కాదని పలు బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి.
ఉద్యోగులకు ఇబ్బందులే
స్వల్పకాలంలో ఐటీ అనిశ్చితికి సంకేతంగా నూతన నియామకాల్లో క్షీణత కనిపిస్తోంది. మొదటి త్రైమాసికంలో విప్రో, హెచ్సీఎల్ టెక్ ఉద్యోగుల సంఖ్య 11,300 తగ్గితే, టీసీఎస్ కేవలం 523 మంది ఉద్యోగులనే చేర్చుకుంది. ప్రతికూల పరిస్థితుల వల్ల వేతనాల పెంపును ఒక త్రైమాసికం పాటు వాయిదా వేస్తున్నట్లు హెచ్సీఎల్ టెక్ వెల్లడించింది. ఇన్ఫోసిస్ కూడా ఇప్పటివరకు వేతనాల పెంపు చేపట్టలేదని, వాయిదా వేయొచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఫ్రెషర్ల నియామకాలు తగ్గాయి. ఈ ఏడాది జనవరి- మార్చిలో 4,480 మంది తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్లు) హెచ్సీఎల్ టెక్నాలజీస్ నియమించుకోగా.. ఏప్రిల్- జూన్లో ఈ సంఖ్య బాగా తగ్గి 1,597కు పరిమితమైంది. 2023-24లో 40,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటామని.. ఈ లక్ష్యంలో కోత పెట్టడం లేదని టీసీఎస్ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా ఐటీ కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఆలస్యం చేస్తుండడంతో చాలా మంది ఫ్రెషర్లు ఎపుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ట్రీ ఫలితాలతో, ఐటీ కంపెనీలపై ఒక అంచనాకు రావొచ్చని నిపుణులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది. -
మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. -
4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. -
మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు
మహీంద్రా గ్రూప్ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. -
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి. -
సూపర్ టాపప్ తీసుకోవచ్చా?
నా వయసు 57. నాకు బృంద ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకుంటే బాగుంటుందా? లేదా సూపర్ టాపప్ను ఎంచుకోవాలా? -
కార్డు బాకీ తీర్చలేకపోతే
చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులను కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డులు వెసులుబాటును అందిస్తాయి. ఈ సౌలభ్యం కొన్నిసార్లు అధిక ఖర్చుకూ దారి తీస్తుంది. చివరకు గడువులోపు బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365