మూలధన వ్యయాలు రూ.11.11 లక్షల కోట్లకు!
ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటున్నందున, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాలను 11% పెంచి రూ.11.11 లక్షల కోట్ల (జీడీపీలో 3.4 శాతం)కు చేర్చారు.
ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటున్నందున, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాలను 11% పెంచి రూ.11.11 లక్షల కోట్ల (జీడీపీలో 3.4 శాతం)కు చేర్చారు. 2022-23 కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను 37.5% పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేటు పెట్టుబడులు తక్కువగా ఉండటంతో, ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి 30 శాతానికి పైగా మూలధన వ్యయాలను పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రైవేటు పెట్టుబడులు తగినంత స్థాయికి పుంజుకోవడం, కేంద్ర ప్రభుత్వం తక్కువ అప్పులు తీసుకోవడం వల్ల ప్రైవేటు రంగానికి పెద్ద మొత్తంలో రుణాలు లభిస్తాయని అంచనా వేశారు.
పన్నుల ఆదాయాలు రూ.38.31 లక్షల కోట్లు
దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రభుత్వ స్థూల పన్నుల ఆదాయాలు 11.46% పెరిగి రూ.38.31 లక్షల కోట్లుగా నమోదుకావచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. జీఎస్టీ వసూళ్లు 11.6% పెరుగుతాయనే అంచనాలు ఇందుకు నేపథ్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 2024-25లో జీఎస్టీ వసూళ్లు (రాష్ట్రాల వాటా మినహాయించి) రూ.1.1 లక్షల కోట్లు (11.6%) పెరిగి రూ.10.68 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తం పన్నుల వసూళ్లలో ప్రత్యక్ష పన్నుల రూపేణా రూ.21.99 లక్షల కోట్లు (వ్యక్తిగత ఆదాయపు పన్ను+కార్పొరేట్ పన్ను), పరోక్ష పన్నుల రూపేణా రూ.16.22 లక్షల కోట్లు (కస్టమ్స్, ఎక్సైజ్ సుంకం, జీఎస్టీ) రావొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) స్థూల పన్నుల ఆదాయాలు బడ్జెట్ లక్ష్యం కంటే సుమారు రూ.76,000 కోట్ల మేర పెరిగే అవకాశం ఉంది. 2023-24లో రూ.33.61 లక్షల కోట్ల మేర పన్నుల ఆదాయం రావొచ్చని బడ్జెట్లో అంచనా వేయగా.. తాజా మధ్యంతర బడ్జెట్లో దాన్ని రూ.34.37 లక్షల కోట్లకు సవరించారు.
ప్రభుత్వానికి ఆర్బీఐ, పీఎస్బీల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-25) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నుంచి డివిడెండు ఆదాయం రూపేణా ప్రభుత్వానికి రూ.1.02 లక్షల కోట్లు రావొచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) గత బడ్జెట్లో అంచనా వేసిన రూ.48,000 కోట్ల కంటే అధికంగా రూ.1.04 లక్షల కోట్ల డివిడెండును ఆర్బీఐ, పీఎస్బీల నుంచి ప్రభుత్వం పొందే అవకాశం ఉంది. గతేడాది మేలో ఆర్బీఐ రూ.87,416 కోట్ల డివిడెండును చెల్లించడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, పీఎస్బీల నుంచి ప్రభుత్వానికి రూ.39,961 కోట్ల డివిడెండు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈల) నుంచి రూ.43,000 కోట్ల డివిడెండు ఖజానాకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇతర పెట్టుబడులు కూడా రూ.50,000 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం మీద 2023-24లో పీఎస్బీలు, ఆర్బీఐ, సీపీఎస్ఈల నుంచి రూ.1,54,407 కోట్ల మేర ప్రభుత్వానికి డివిడెండు రూపేణా రావొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీని కంటే కాస్త తక్కువగా రూ.1.50 లక్షల కోట్ల మేర ప్రభుత్వానికి డివిడెండు వచ్చే అవకాశం ఉంది.
పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.50,000 కోట్లు
2024-25 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.50,000 కోట్లుగా మధ్యంతర బడ్జెట్లో కేంద్రం నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా అయిన రూ.30,000 కోట్ల కంటే ఇది ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉపసంహరణ లక్ష్యాన్ని తొలుత రూ.51,000 కోట్లుగా పెట్టుకున్నా, ఆ తర్వాత తగ్గించారు. గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా నిధులేమీ ఖజానాకు చేరడం లేదు. 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం.. రూ.10,000 కోట్లు ఇలా రావాల్సి ఉంది.
ఇప్పటిదాకా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా జరిగిన పెట్టుబడుల ఉపసంహరణతో రూ.12,504 కోట్లే ఖజానాకు చేరాయి. కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీ, ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఈడీఏ వంటి 7 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాలను ప్రభుత్వం విక్రయించి, ఈ మొత్తం సమీకరించింది.
అంతక్రితం లక్ష్యాలు నెరవేరాయా?
- రెండు ఆర్థిక సంవత్సరాల్లో మాత్రమే బడ్జెట్లో ప్రకటించిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను ప్రభుత్వం చేరుకుంది. 2017-18లో రూ.లక్ష కోట్లు నిర్దేశించుకోగా.. రూ.1,00,056 కోట్లను పొందింది. ఇదే ఇప్పటి వరకు అత్యధికం.
- 2018-19లో రూ.80,000 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.84,972 కోట్లను సమీకరించగలిగింది.
రూ.14.13 లక్షల కోట్లు సమీకరిస్తాం
2024-25లో సెక్యూరిటీల జారీ ద్వారా రూ.14.13 లక్షల కోట్లను ప్రభుత్వం సమీకరించనుందని ఆర్థికమంత్రి తెలిపారు. ఆదాయాలు, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇలా నిధులను సమీకరిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023 జులై 31 వరకు ప్రభుత్వం సుమారు రూ.5.77 లక్షల కోట్లను సమీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
AI Express: ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. కంపెనీ 25 మందిని తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది. -
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతోంది. -
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
India Economic Superpower: రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత్ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. దీంట్లో ప్రధాని మోదీతో పాటు అంబానీ, అదానీ కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది. -
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది. -
400 మంది ఇంజినీర్ల నియామకాలు: కోటక్ బ్యాంక్
ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని బ్యాంక్ భావిస్తోంది. -
10 కిలోల పెంపుడు జంతువు క్యాబిన్లోనే
తమ దేశీయ విమానాల క్యాబిన్లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
తమ వెబ్సైట్లో వేసవి విహారం కోసం శోధించిన వాటి వివరాలను ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
-
సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు.. టీఎంసీ నేతలపై కేసు వెనక్కి
-
ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
-
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు