అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది.
వేతనజీవులు, పింఛనుదారుల్లో గందరగోళం
దామాషా పద్ధతి తెరపైకి తెచ్చిన ఈపీఎఫ్వో
10న సీబీటీ కీలక సమావేశంలో చర్చ
ఈనాడు, హైదరాబాద్: అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకే పార్ట్గా పింఛను ఫార్ములా ఉంటుందని పేర్కొంటూనే ప్రాంతీయ కార్యాలయాల సందేహాల నివృత్తికి ఇస్తున్న వివరణల్లో మాత్రం దామాషా విధానాన్ని తెరపైకి తేవడం దరఖాస్తుదారులను గందరగోళంలోకి నెడుతోంది. దేశంలోని కొన్ని ఈపీఎఫ్వో ప్రాంతీయ కార్యాలయాలు దామాషా విధానంలో పార్ట్-1, పార్ట్-2 విభాగాలుగా పింఛను లెక్కిస్తుంటే, మరికొన్ని ఒకేపార్ట్ కింద లెక్కిన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 10న (శనివారం) జరిగే ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ విషయమై ప్రధానంగా చర్చ జరగనుంది. అధిక పింఛను లెక్కింపుపై కేటగిరీల వారీగా స్పష్టమైన ఉదాహరణలు ఉండాలని సీబీటీ సభ్యులు ఈ సమావేశంలో డిమాండ్ చేయనున్నారు. తద్వారా అధిక పింఛను అమల్లో ఎదురవుతున్న అడ్డంకుల్ని అధిగమించాలని భావిస్తున్నారు. లెక్కింపుపై స్పష్టత కొరవడటంతో పలు కార్యాలయాల్లో పరిష్కారం నిలిచిపోయింది. డిమాండ్ నోటీసుల ప్రకారం ఇప్పటికే బకాయిలు చెల్లించిన దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
తొలుత ఇచ్చిన లెక్కింపు విధానమిదీ....
అధిక పింఛను లెక్కింపు ఫార్ములాపై ఈపీఎఫ్వో 2023 జూన్ 1న డిసెంబరు 13న స్పష్టత ఇచ్చింది. వాటి ప్రకారం... 2014 సెప్టెంబరు 1కి ముందు రిటైరైన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా పింఛను లెక్కించాలి. 2014 సెప్టెంబరు 1 తరువాత పదవీ విరమణ చేసే వారికి చివరి 60 నెలల సగటు వేతనం, పూర్తిసర్వీసు ఆధారంగా గణించాలి.
నెలరోజుల వ్యవధిలోనే మార్పు...
కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు పార్ట్-1, పార్ట్-2 కింద పింఛను లెక్కించాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని విజయవాడ, బెంగళూరు, తెలంగాణ తదితర ప్రాంతీయ కార్యాలయాలు కేంద్ర ఈపీఎఫ్ కార్యాలయాన్ని అభ్యర్థించాయి. 2024 జనవరి 11, 12న జరిగిన సమీక్ష సమావేశంలో ‘‘అధిక పింఛనుపై సుప్రీంకోర్టు ఎలాంటి ఫార్ములా ఇవ్వలేదు. దామాషా పద్ధతి కింద పింఛను లెక్కించాలి. ఇకమీదట ఎలాంటి వివరణలు ఈ విషయంలో అనుమతించబోం’’ అని ఈపీఎఫ్వో స్పష్టం చేసింది. ఈనెల 10న జరగనున్న సీబీటీ సమావేశ ఎజెండాలోనూ దామాషా పద్ధతిలో పింఛను లెక్కించాలన్న నిబంధన చేర్చినట్లు తెలిసింది.
దామాషా పద్ధతి కింద ఇలా..
2014 సెప్టెంబరు 1కి ముందు వేతన సగటు పరిమితి రూ.6,500కు లోబడి, ఆ తరువాత రూ.15వేలకు లోబడి ఈపీఎస్ చందా చెల్లిస్తున్నవారికి దామాషా పద్ధతిలో పింఛను లెక్కిస్తున్నారు. అంటే 2014 సెప్టెంబరు 1నాటికి గరిష్ఠంగా రూ.6,500 వేతన సగటు లెక్కన అప్పటివరకు ఉన్న సర్వీసు ఆధారంగా చివరి 12 నెలల వేతన సగటు తీసుకుని పార్ట్-1 కింద పింఛను గణిస్తున్నారు. 2014 సెప్టెంబరు 1 తరువాత గరిష్ఠంగా రూ.15వేల వేతన సగటును తీసుకుంటున్నారు. పదవీ విరమణ చేసే నాటికి సర్వీసు ఆధారంగా చివరి 60 నెలల వేతన సగటు తీసుకుని పార్ట్-2 కింద పింఛను లెక్కిస్తున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం పదవీ విరమణ పింఛనుగా ఖరారు చేస్తున్నారు. గరిష్ఠ వేతన పరిమితికి లోబడిన కార్మికులకు అమలు చేస్తున్న విధానాన్నే... అధిక పింఛను అర్హత కలిగిన వారికి అమలు చేసేలా వ్యవహరిస్తోంది. అంటే.. అధిక పింఛను దరఖాస్తుదారులకు 2014 సెప్టెంబరు 1 నాటికి ఉన్న సర్వీసుకు చివరి 12 నెలల వేతన సగటు ఆధారంగా పార్ట్-1గా, ఆ తరువాత పదవీ విరమణ నాటికి సర్వీసును గణించి చివరి 60 నెలల వేతన సగటు ఆధారంగా పార్ట్-2 కింద పింఛను దామాషా పద్ధతి కింద లెక్కించాలన్నట్లు వివరణ ఇచ్చింది. ఈ దామాషా పద్ధతిలో పార్ట్-1, పార్ట్-2 కింద లెక్కిస్తే చేతికి అందే పింఛను కనీసం 30-40 శాతం వరకు తగ్గే అవకాశముందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దామాషా లెక్కింపు పద్ధతిపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేతన పరిమితి లేకుండా ప్రతినెలా ఈపీఎస్ చందా చెల్లిస్తున్నవారికి దామాషా పద్దతి ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం