ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులతో పన్ను ఆదా
ఆదాయపు పన్ను మినహాయింపు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉన్న మార్గాల్లో ఈక్విటీ ఆధారిత పెట్టుబడి పథకాలు (ఈఎల్ఎస్ఎస్) ఒకటి.
ఆదాయపు పన్ను మినహాయింపు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉన్న మార్గాల్లో ఈక్విటీ ఆధారిత పెట్టుబడి పథకాలు (ఈఎల్ఎస్ఎస్) ఒకటి. మూడేళ్ల లాకిన్ వ్యవధితో ఉండే వీటిని కొత్తగా మదుపు ప్రారంభించే వారూ ఎంచుకోవచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు మీ కోసం..
పెట్టుబడి.. పన్ను ఆదా ఈ రెండు ప్రత్యేక మిశ్రమ ప్రయోజనాలను నెరవేర్చేవి ఈఎల్ఎస్ఎస్లు. ఈ ఫండ్లు ప్రధానంగా ఈక్విటీ ఆధారమైనవి. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో 65 శాతం వరకూ పెట్టుబడి పెడతాయి. ఈక్విటీలపై అధిక దృష్టి ఉండటం వల్ల దీర్ఘకాలిక వృద్ధికి అధికంగా అవకాశాలుంటాయి. కాలక్రమేణా మంచి రాబడిని ఈ ఫండ్లు ఆర్జిస్తుంటాయి.
ఈఎల్ఎస్ఎస్లను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లుగా పేర్కొంటారు. ఈక్విటీ పెట్టుబడుల ద్వారా మదుపరులకు మూలధన వృద్ధిని అందించడమే వీటి ప్రాథమిక లక్ష్యం. ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల మాదిరిగా కాకుండా, ఈఎల్ఎస్ఎస్లు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ ప్రత్యేకత వల్లే పన్ను భారం తగ్గించుకుంటూ, మదుపు చేయాలనుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికీ ఇవి వీలు కల్పిస్తాయి.
గత ఏడాది డిసెంబరు నాటికి చూస్తే.. ఈఎల్ఎస్ఎస్ల పథకాల నుంచి వచ్చిన ఏడాది రాబడి దాదాపు 18.8 శాతం వరకూ ఉంది. మూడేళ్ల సగటు రాబడిని పరిశీలిస్తే దాదాపు 20 శాతం కనిపించింది. క్రమానుగత పెట్టుబడి విధానంలో ఈ పథకాల్లో మదుపు చేసిన వారికి మూడేళ్లలో 17.5 శాతం, అయిదేళ్ల వ్యవధిలో 19.2 శాతం వరకూ రాబడిని అందించాయి.
ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో మదుపు చేసిన మొత్తం సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000 లోబడి ఉంటుంది. 30 శాతం పన్ను శ్లాబులో ఉన్న వారికి దాదాపు రూ.46,800 వరకూ భారం తగ్గుతుంది.
ఈఎల్ఎస్ఎస్లను తప్పనిసరిగా మూడేళ్ల వరకూ కొనసాగించాలి. అంటే మూడేళ్ల వ్యవధి పూర్తయ్యేదాకా పెట్టుబడులను ఉపసంహరించుకోలేరు. మదుపరులను దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం.
ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు కాబట్టి, ఈఎల్ఎస్ఎస్లు మార్కెట్ హెచ్చుతగ్గులకు ప్రభావితం అవుతుంటాయి. దీర్ఘకాలంలో నష్టభయం పరిమితం అవుతాయి. లాభాలను ఆర్జించేందుకు అవకాశాలు ఉంటాయి. ఇతర పన్ను ఆదా పథకాలతో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్లు అధిక రాబడులను అందించినట్లు గమనించవచ్చు.
ప్రయోజనాలేమిటి?
వైవిధ్యం: ఈక్విటీ పెట్టుబడుల్లో వైవిధ్యానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్లు భిన్న షేర్లలో మదుపు చేస్తాయి. ఫండ్ మేనేజర్లు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్లలో పెట్టుబడి పెట్టేందుకు వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల నష్టభయం తగ్గుతుంది. రాబడి పెరిగేందుకూ వీలవుతుంది. ఈక్విటీ మార్కెట్లలో అనుభవం ఉన్న వారే ఈ ఫండ్లను నిర్వహిస్తుంటారు. కాబట్టి, ఎంతో పరిశోధనతో పెట్టుబడులను ఎంచుకుంటారు.
దీర్ఘకాలంలో: పదవీ విరమణ ప్రణాళిక, పిల్లల ఉన్నత చదువులు, ఇతర అవసరాలకు సంపదను సృష్టించేందుకు ఈ పథకాలు అనువుగా ఉంటాయని చెప్పొచ్చు. ఈక్విటీ మార్కెట్ల దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం, పన్ను ప్రయోజనాలు రెండూ మదుపరులకు కలిసొచ్చే అంశాలు.
క్రమానుగతంగా: ఒకేసారి పెద్ద మొత్తంతోనే కాకుండా, చిన్న మొత్తాలతో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్)ద్వారా వీటిలో మదుపు చేసేందుకు వీలుంది. కాబట్టి, పాత పన్ను విధానంలో కొనసాగుతున్న వారు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను భారం తగ్గించుకునేందుకు ప్రణాళిక వేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం