పిల్లల చదువులకు భరోసాగా
పిల్లలకు పరీక్షలు మొదలయ్యాయి. ఇవి పూర్తికాగానే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. బడిలో చేరింది మొదలు.. ఉన్నత విద్య వరకూ అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది.
పిల్లలకు పరీక్షలు మొదలయ్యాయి. ఇవి పూర్తికాగానే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. బడిలో చేరింది మొదలు.. ఉన్నత విద్య వరకూ అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఆర్థికంగా తల్లిదండ్రులకు ఇదొక సవాలు లాంటిదేనని చెప్పొచ్చు. చిన్నారుల భవితకు భరోసానిచ్చేందుకు అనేక పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎలా ఎంపిక చేసుకోవాలి? చదువుల ఖర్చులను తట్టుకునేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి? తెలుసుకుందాం.
విద్యా ద్రవ్యోల్బణం ఏటా 11-12 శాతం మేరకు పెరుగుతోంది. అదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం వరకూ ఉంటోంది. రాబోయే ఆరు నుంచి ఏడేళ్లలో ఇప్పుడున్న విద్యా ఖర్చులు రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉంది. వీటిని తట్టుకోవాలంటే.. ఆ ఖర్చులకు మించి రాబడినిచ్చే పథకాలను ఎంపిక చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే దీర్ఘకాలిక దృష్టితో అధిక రాబడిని అందించే పథకాల్లో మదుపు చేయడం ప్రారôభించాలి. అప్పుడే ఎలాంటి చిక్కులూ లేకుండా పిల్లల ఆశలు తీర్చడంలో తల్లిదండ్రులు విజయం సాధిస్తారని చెప్పొచ్చు.
ధీమానే ముందు..
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పెట్టుబడులు ప్రారంభించే ముందు కుటుంబానికి తగిన ఆర్థిక రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లల చదువులు, వారి ఇతర బాధ్యతలను తీర్చేలా బీమా పాలసీలు తీసుకోవాలి. సంపాదించే వ్యక్తి తన పేరుమీద.. వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. కుటుంబానికి అంతటికీ వర్తించేలా కనీసం రూ.10లక్షల ఆరోగ్య బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే పిల్లల చదువులకు కేటాయిస్తున్న డబ్బును ఇతర అవసరాలకు మళ్లించాల్సిన అవసరం రాదు.
ఎంత కావాలి?
పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం ప్రణాళిక వేసుకునేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఎంత మొత్తం కావాలి? ఇప్పుడున్న ఫీజులకు ఏటా 12 శాతం అధికంగా కలిపి ఈ అంచనాలు ఉండాలి. దీనికోసం నెలనెలా ఎంత మదుపు చేయాలన్నది. దీనిని లెక్కించేందుకు ఆన్లైన్లో ఇప్పుడు ఎన్నో కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి, ఒక అంచనాకు రావచ్చు. ఎంత పెట్టుబడి పెట్టాలన్నదీ తెలిసిపోతుంది. ప్రతి అవసరానికీ ఒక ప్రత్యేక పథకం ఉంటుంది. అలాగే పిల్లల కోసం మదుపు చేసేటప్పుడూ దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చే వాటిని ఎంచుకోవాలి. ఒక్కో దశలో ఎంత మొత్తం కావాలి? దానికి తగ్గట్టుగా పెట్టుబడులు కేటాయించాలి.
హామీ పథకాల్లో...
విద్యా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని అందుకోవాలంటే.. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ అధిక రాబడినచ్చే పథకాలనే ఎంచుకోవాలి. ఉదాహరణకు 6.1 శాతం రాబడి అంచనాతో నెలకు రూ.62,000 మదుపు చేస్తే 15 ఏళ్ల తర్వాత రూ.1.82 కోట్లు చేతికి అందుతాయి. అదే 15 శాతం రాబడి అంచనాతో నెలకు రూ.27,000 మదుపు చేస్తే చాలు. అంతే మొత్తం సమకూరుతుంది. కాబట్టి, మంచి పనితీరున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకొని, పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. అదే సమయంలో ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన పథకాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి.
అధిక రాబడికి..
పిల్లల ఆర్థిక అవసరాల కోసం మదుపు చేసేటప్పుడు ఏదో ఒక పథకం మీదనే ఆధారపడటం ఎప్పుడూ మంచిది కాదు. వైవిధ్యమైన పెట్టుబడులు నష్టభయాన్ని తగ్గిస్తాయని మర్చిపోవద్దు. మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు ఉండేలా చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లలోనూ ఈక్విటీ, ఈక్విటీ డైవర్సిఫైడ్, మల్టీక్యాప్ ఫండ్లు ఉండాలి. డెట్ ఫండ్లనూ పరిశీలించాలి. కొంత బంగారంలోనూ మదుపు చేయడం మంచిది. నష్టభయం ఉన్న ఈక్విటీ పథకాలకు ఎంత కేటాయించాలి, సురక్షిత పథకాలకు ఎంత మళ్లించాలి అనేదీ కీలకమే. 10-12 ఏళ్ల వ్యవధి ఉన్నప్పుడు ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను పరిశీలించాలి. 4-5 ఏళ్లు మాత్రమే ఉంటే డెట్ ఫథకాలవైపు మొగ్గు చూపడమే శ్రేయస్కరం.
ప్రత్యేక పాలసీలతో...
ప్రత్యేకంగా పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని బీమా సంస్థలు కొన్ని ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చాయి. పాలసీ చేసిన తల్లిదండ్రులు అనుకోకుండా దూరమైనప్పుడు వెంటనే పాలసీ విలువను పరిహారంగా చెల్లిస్తుంది. పాలసీ గడువు తీరే వరకూ కొనసాగుతుంది. దీనికోసం ప్రీమియం వైవర్ రైడర్ తోడ్పడుతుంది. వ్యవధి ముగిసిన తర్వాత బీమా పాలసీ నుంచి అందాల్సిన డబ్బు చేతికి వస్తుంది. ఇలాంటి పాలసీలనూ పిల్లల చదువుల ప్రణాళికలో భాగం చేయాలి. వీటితోపాటు యూనిట్ ఆధారిత పాలసీలనూ ఎంచుకునే ప్రయత్నం చేయొచ్చు. కనీసం 15 ఏళ్ల వ్యవధికి పాలసీలు తీసుకునేందుకు ప్రయత్నించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్