Gold price: పెరిగిన బంగారం ధర.. రూ.65వేల ఎగువకు

Gold price: బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.65వేలు దాటింది.

Updated : 05 Mar 2024 18:53 IST

Gold price today: దిల్లీ: బంగారం ధరకు (Gold price) ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాములు మేలిమి స్పాట్‌ గోల్డ్‌ ధర మంగళవారం ఒక్కరోజే రూ.800 మేర పెరిగి రూ.65 వేలకు చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.64,200 వద్ద ముగిసింది. అటు వెండి సైతం కేజీ రూ.900 మేర పెరిగి రూ.74,900కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ప్రభావంతోనే దేశీయంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2100 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది. ఔన్సు వెండి 23.88 డాలర్లుగా కొనసాగుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గి.. జూన్‌ నుంచి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగినట్లు గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మరలిస్తున్నారని ఎల్‌కేపీఈ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ జతీన్‌ త్రివేది పేర్కొన్నారు.

గమనిక: ప్రాంతాన్ని బట్టి బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. వాస్తవ ధర కోసం దగ్గర్లోని బంగారం దుకాణదారుడిని సంప్రదించగలరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని