Online Scams: ఆన్లైన్లో ఎన్ని స్కాములో..! మరి వీటిని గుర్తించేదెలా?
ప్రస్తుత కాలంలో టెక్నాలజీతో పాటు ఆన్లైన్ మోసాలు బాగా పెరిగాయి. ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లే.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఇంటర్నెట్ అనేది మన జీవితంలో అంతర్భాగమైపోయింది. దీంతోపాటే ఆన్లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు సామాన్యుల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వీళ్లు ప్రజలను మోసగించడానికి వినూత్నమైన మార్గాలను అనుసరిస్తుంటారు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. కాబట్టి ఆన్లైన్ మోసాల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్ అవ్వాల్సిందే. అలాంటి కొన్ని ఆన్లైన్ మోసాల గురించి ఇప్పుడు చూద్దాం..
యూపీఐ రిఫండ్ స్కామ్
యూపీఐ గురించి అందరికీ తెలిసిందే. కూరగాయల దగ్గర నుంచి కిరాణా స్టోర్ వరకు.. ఫోన్ రీఛార్జ్ నుంచి విమాన టికెట్ల వరకు వివిధ నగదు చెల్లింపులకు యూపీఐను ఉపయోగిస్తున్నాం. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రజలను మోసగించడానికి స్కామర్లు కొత్త పద్ధతులను అవలంబించడం ప్రారంభించారు. ఇదే యూపీఐ రిఫండ్ స్కామ్. ఇక్కడ మోసగాళ్లు మీకు కాల్ చేసి మీరు చేసిన ఏదైనా చెల్లింపులలో మీకు కొంత రిఫండ్ ఇవ్వాల్సి ఉంటుందని తెలియజేస్తారు. బ్యాంకులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ వెబ్సైట్ల సిబ్బందిలా మీతో మాట్లాడతారు. మీకు మెసేజ్ను పంపడం ద్వారా లింక్ను పంచుకుంటారు. మీ డబ్బు వాపసు కావడానికి మీరు లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని మిమ్మల్ని కోరతారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మీ బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ ఐడీ పిన్ను నమోదు చేయాలని చెబుతారు. డబ్బు వెంటనే మీ ఖాతాలో జమ అవ్వాలంటే ఇవన్నీ అవసరమని మీపై ఒత్తిడి చేస్తారు. ఒకవేళ మీరు వారు చెప్పినట్టుగా చేస్తే వెంటనే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయిపోతుంది. ఇటువంటి ఆఫర్తో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే.. అసలు మీరు రిఫండ్కు అర్హులా కాదా? అని తెలుసుకోవాలి. తెలియని వారు పంపిన ఐడీల నుంచి వచ్చిన లింక్లపై క్లిక్ చేయొద్దు. బ్యాంకు ఖాతా నంబర్లు, యూపీఐ పిన్ వంటి సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయొద్దు. ముఖ్యంగా గోప్యమైన సమాచారాన్ని బ్యాంకు, ఇతర అధికారులు మిమ్మల్ని ఎప్పుడు అడగరని గుర్తించాలి.
పవర్ కట్ స్కాం
ఈ రకమైన మోసం ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తోంది. కొంత మంది విద్యుత్ వినియోగదారులు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మేసేజ్లు అందుకుంటున్నారు. మేసేజ్లో ఈ విధంగా ఉంటుంది. ‘ప్రియమైన కస్టమర్.. మీ విద్యుత్కు సంబంధించిన మునుపటి నెల బిల్లు ఆన్లైన్లో అప్డేట్ కానందున మీ ఇంటికి కరెంట్ సప్లయ్ ఈ రాత్రి 9.00 గంటలకు విద్యుత్ కార్యాలయం నుంచి డిస్కనెక్ట్ చేస్తారు’ అంటూ ఓ నకిలీ సైట్/ఫోన్ నంబర్ పేర్కొంటారు. బిల్లు చెల్లించాలని అడుగుతారు. రాత్రి సమయంలో ఈ తరహా మెసేజ్ వస్తే.. సాధారణంగానే ఎవరైనా గాబరా పడతారు. ఇక్కడే మనమో విషయం గమనించాలి. ఏ కారణం చేతనైనా విద్యుత్ బిల్లు అప్డేట్ కాకపోయినా, ఎలక్ట్రిక్ ఆఫీస్ నుంచే కనెక్షన్ను కట్ చేయలేరని మీరు గుర్తించాలి. కరెంట్ను కట్ చేయాలంటే వినియోగదారు ఇంటికి విద్యుత్ సిబ్బంది రావల్సిందే. అది కూడా పగటి పూట మాత్రమే విద్యుత్ శాఖ ఆ పని చేస్తుంది. విద్యుత్ బోర్డు లేదా పంపిణీదారు సాధారణంగా అధికారిక నంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపుతారు. ఆయా నంబర్లు ఎలక్ట్రికల్ బిల్లులో కూడా ఉంటాయి. ఇవన్నీ విద్యుత్ వినియోగదారులు గుర్తించాలి. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే మేసేజ్లకు వినియోగదారులు స్పందించకూడదు.
ఫేక్ జాబ్ ఆఫర్
అత్యంత సాధారణ జాబ్ స్కామ్ల్లో ఇదీ ఒకటి. ఇక్కడ మోసగాళ్లు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని అందిస్తామని, విశ్రాంతి సమయాల్లోనే సులువుగా డబ్బు సంపాదించవచ్చని చెబుతారు. అవసరమైతే నకిలీ ఉద్యోగ పోస్టింగ్లను సృష్టిస్తారు. చట్టబద్ధంగా కనిపించే నకిలీ వెబ్సైట్లను కూడా వీరు డిజైన్ చేసుకుంటారు. అనేక సందర్భాల్లో మోసగాళ్లు వీలైనంత ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని బయటకు తీయడానికి అనేక రౌండ్ల నకిలీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. శిక్షణకు, పరికరాలకు, ఇతర ప్రయోజనాల కోసం ముందుగానే కొత్త మొత్తాన్ని చెల్లించమని ఉద్యోగార్ధులను అడుగుతారు. నిరుద్యోగులు చాలా తేలికగా వీరి ఉచ్చులో పడే అవకాశం ఉంది. ఇటువంటి ఫేక్ జాబ్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాన్ని ఆశించేవారు ముందుగా గూగుల్లో వారు తెలిపిన కంపెనీ గురించి లోతుగా పరిశీలించాలి. అలాంటి కంపెనీ ఉనికిలో ఉందో లేదో మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
ఓటీపీ స్కామ్
ఏదైనా ఎన్బీఎఫ్సీ పేరు మీద రుణం అందిస్తామని లేదా క్రెడిట్ లిమిట్ పెంచుతామని మీకు నకిలీ మెసేజ్ను పంపుతారు. ఈ మెసేజ్ ద్వారా మీ ఆర్థిక వివరాలు షేర్ చేయమని అడుగుతారు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరులో మీరు స్వీకరించే వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లేదా పిన్ వివరాలను షేర్ చేయమని మిమ్మల్ని కోరతారు. మీరు వారికి స్పందించి ఓటీపీ లేదా పిన్ను షేర్ చేసిన మరుక్షణంలో మోసగాళ్లు మీ బ్యాంకు ఖాతాల నుంచి అనధికారిక లావాదేవీలను నిర్వహించడానికి దాన్ని ఉపయోగిస్తారు. ఇటువంటి సందర్భంలో మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయిపోతుంది. దీన్ని నివారించడానికి మీకు సంబంధం లేని క్రెడిట్ ఆఫర్లకు మీరు స్పందించకపోవడమే మంచిది. ఓటీపీ, పిన్ వివరాలు ఇతరులతో పంచుకోవలసినవి కావని మీరు గుర్తించాలి.
జ్యూస్ జాకింగ్ స్కామ్
ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ఫోన్లనే వాడుతున్నారు. వాడకాన్ని బట్టి వీటికి ఛార్జింగ్ కూడా త్వరగానే అయిపోతుంది. అధిక సమయం బయట గడిపేవారు కనిపించిన ప్రతి చోటా ఫోన్ ఛార్జింగ్ చేస్తుంటారు. ఈ జ్యూస్ జాకింగ్ స్కామ్లో మోసగాళ్లు ఫోన్ నుంచి డేటాను చోరీ చేయడానికి ఈ ఛార్జింగ్ ప్లేస్లను ఎంచుకుంటున్నారు. ఇక్కడ నేరగాళ్లు మీ ఫోన్ హ్యాక్ చేయడానికి, బ్యాంకు వివరాలు లేదా యూపీఐ పాస్వర్డ్లు మొదలైన రహస్య సమాచారాన్ని చోరీ చేయడానికి ఈ ఛార్జింగ్ పోర్ట్ల వద్ద హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేస్తారు. దీంతో మీ ఫోన్లో ఉన్న డేటా అక్కడ ఉన్న పరికారాల్లో సేవ్ అయిపోతుంది. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎక్కువ సమయం ఇంటి బయట గడిపేవారు పోర్టబుల్ పవర్ బ్యాంక్ను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం